మొత్తానికి జగన్ సర్కారు అనుకున్నది సాధించింది. మూడు రాజధానుల బిల్లును గవర్నర్తో ఆమోదింపజేసుకుంది. పేరుకు మూడు రాజధానులు అంటున్నప్నటికీ.. కార్య నిర్వాహక వ్యవస్థకు కేంద్రం కాబోతున్న విశాఖపట్నమే ఆంధ్రప్రదేశ్కు ఇకపై అసలైన రాజధాని అన్నది రాజకీయ విశ్లేషకుల మాట.
కేవలం శాసన సభ, శాసన మండలి సమావేశాలకు మాత్రమే ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యులు, ఎమ్మెల్సీలు అమరావతికి రావాల్సిన అవసరముంది. మిగతా సమయాల్లో ఎవరికీ అమరావతిలో పని లేదు. సీఎం జగన్ ఎన్నికలకు ముందే అమరావతిలో పెద్ద ఇల్లు కట్టుకున్నారు కానీ.. అది ఇక అలంకార ప్రాయమే.
అసెంబ్లీ సమావేశాలకో లేదా కోర్టు పనుల మీద వచ్చినపుడో తప్ప ఈ ఇంటిని ఆయన ఉపయోగించకపోవచ్చు. ఇదిలా ఉంటే.. ఇంతకీ చంద్రబాబు రాబోయే రోజుల్లో ఎక్కడ ఉండబోతున్నారన్నది ఆసక్తికరం. ముఖ్యమంత్రిగా అయిదేళ్లు అమరావతిలో ఉన్నప్పటికీ ఆయన సొంతంగా ఇల్లు కట్టుకోలేదు.
జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక ఆయనుంటున్న ఇల్లు ముంపునకు గురవడంతో వేరే అద్దె ఇంటికి మారారు. ఈ సంగతలా ఉంచితే ఇప్పడు రాజధాని విశాఖకు మారుతోంది. అమరావతిలో పెద్దగా కార్యకలాపాలేమీ ఉండవు. ప్రభుత్వం అంతా నడిచేది విశాఖలోనే. అనివార్యంగా చంద్రబాబు అక్కడికి వెళ్లాల్సిందే. కానీ అలా వెళ్తే చంద్రబాబు అమరావతిని పక్కన పెట్టేసినట్లు అవుతుంది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో వెంటనే కదలాల్సిన అవసరం లేదు కానీ.. కొన్ని నెలల తర్వాత అయినా చంద్రబాబు ఏం చేస్తారన్నది ఆసక్తికరం.
This post was last modified on August 2, 2020 6:59 pm
హాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఉన్న సినిమాటిక్ యునివర్స్ కాన్సెప్ట్ ని క్రమంగా మన దర్శకులు బాగా పుణికి పుచ్చుకుంటున్నారు.…
కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాస్ పోర్టును రెడీ చేసుకుని సిద్ధంగా పెట్టుకున్నారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల…
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముంగిట రాజకీయ నేపథ్యం ఉన్న పలు చిత్రాలు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వైసీపీకి అనుకూలంగా యాత్ర-2,…
జూనియర్ ఎన్టీఆర్ దేవర అధికారిక విడుదల తేదీ అక్టోబర్ 10లో ఎలాంటి మార్పు లేదు కానీ అంతర్గతంగా జరుగుతున్న కొన్ని…
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కూటమి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నదా ? తొలి, మలి దశ ఎన్నికలలో ఆ పార్టీకి ఎదురుగాలి…
మాములుగా యావరేజ్ సినిమాలనే బ్లాక్ బస్టరని చెప్పి మభ్యపెట్టాలని చూసే ట్రెండ్ లో ఉన్నాం మనం. అలాంటిది ఒక డెబ్యూ…