మొత్తానికి జగన్ సర్కారు అనుకున్నది సాధించింది. మూడు రాజధానుల బిల్లును గవర్నర్తో ఆమోదింపజేసుకుంది. పేరుకు మూడు రాజధానులు అంటున్నప్నటికీ.. కార్య నిర్వాహక వ్యవస్థకు కేంద్రం కాబోతున్న విశాఖపట్నమే ఆంధ్రప్రదేశ్కు ఇకపై అసలైన రాజధాని అన్నది రాజకీయ విశ్లేషకుల మాట.
కేవలం శాసన సభ, శాసన మండలి సమావేశాలకు మాత్రమే ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యులు, ఎమ్మెల్సీలు అమరావతికి రావాల్సిన అవసరముంది. మిగతా సమయాల్లో ఎవరికీ అమరావతిలో పని లేదు. సీఎం జగన్ ఎన్నికలకు ముందే అమరావతిలో పెద్ద ఇల్లు కట్టుకున్నారు కానీ.. అది ఇక అలంకార ప్రాయమే.
అసెంబ్లీ సమావేశాలకో లేదా కోర్టు పనుల మీద వచ్చినపుడో తప్ప ఈ ఇంటిని ఆయన ఉపయోగించకపోవచ్చు. ఇదిలా ఉంటే.. ఇంతకీ చంద్రబాబు రాబోయే రోజుల్లో ఎక్కడ ఉండబోతున్నారన్నది ఆసక్తికరం. ముఖ్యమంత్రిగా అయిదేళ్లు అమరావతిలో ఉన్నప్పటికీ ఆయన సొంతంగా ఇల్లు కట్టుకోలేదు.
జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక ఆయనుంటున్న ఇల్లు ముంపునకు గురవడంతో వేరే అద్దె ఇంటికి మారారు. ఈ సంగతలా ఉంచితే ఇప్పడు రాజధాని విశాఖకు మారుతోంది. అమరావతిలో పెద్దగా కార్యకలాపాలేమీ ఉండవు. ప్రభుత్వం అంతా నడిచేది విశాఖలోనే. అనివార్యంగా చంద్రబాబు అక్కడికి వెళ్లాల్సిందే. కానీ అలా వెళ్తే చంద్రబాబు అమరావతిని పక్కన పెట్టేసినట్లు అవుతుంది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో వెంటనే కదలాల్సిన అవసరం లేదు కానీ.. కొన్ని నెలల తర్వాత అయినా చంద్రబాబు ఏం చేస్తారన్నది ఆసక్తికరం.
This post was last modified on August 2, 2020 6:59 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…