ఆంధ్రప్రదేశ్లో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ తమ్ముడు, జగన్ బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసు ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. ఆ హత్యకు సంబంధించి నిందను చంద్రబాబు సర్కారు మీద వేసి జగన్ అండ్ కో బాగానే రాజకీయ ప్రయోజనం పొందింది.
నిజానికి వివేకాది గుండెపోటు అని సాక్షి మీడియాలో ముందుగా ప్రచారం చేసింది జగన్ కుటుంబ సభ్యులే. కానీ తర్వాత హత్య విషయం బయటికి రాగానే చంద్రబాబు మీదికి నిందను నెట్టేస్తూ సాక్షి మీడియాలో వచ్చిన నారాసుర రక్తచరిత్ర కథనం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. వివేకా చనిపోయిన గంటల్లోనే ఒక వెర్షన్ మారి ఇంకో వెర్షన్ రాగా.. గత కొన్నేళ్లలో ఈ కేసు ఎన్ని మలుపులు తిరిగిందో.. ఎన్నెన్ని కొత్త వెర్షన్లు వచ్చాయో పరిశీలిస్తే షాకవ్వక తప్పదు.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ సోదరుడు అవినాష్ రెడ్డి వర్గీయులే ఎప్పటికప్పుడు కొత్త వెర్షన్లు వినిపిస్తుండటం ఈ కథలో అసలైన ట్విస్టు .గుండె పోటు కాస్తా హత్యగా మారాక.. ఓవైపు చంద్రబాబే ఈ హత్య చేయించాడని ఆరోపిస్తూ.. మరోవైపు టైంకి రానందుకు వివేకా తిట్టాడని ఆయన డ్రైవరే హత్య చేసినట్లు వివేకా పేరుతో ఒక లేఖను సృష్టించడం గమనార్హం. తర్వాతేమో బెంగళూరులో ఉన్న ఒక స్థలం వ్యవహారంలో వివేకా హత్య జరిగిందని ఒక ప్రచారం నడిచింది. ఆపై నింద వివేకా కూతురు, అల్లుడు మీదికి మళ్లింది. ముస్లిం యువతితో కన్న బిడ్డని వారసుడుగా ప్రకటిస్తున్నాడని కూతురు,అల్లుడే చంపేశారనే ఆరోపణను తెరపైకి తెచ్చారు. ఈ ఆరోపణ చేసింది స్వయంగా అవినాషే కావడం విశేషం.
కానీ ఇప్పుడు అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి ఇంకో కొత్త ఆరోపణను తెరపైకి తెచ్చారు. ఈ కేసు నిందితుల్లో ఒకడైన సునీల్ యాదవ్ తన తల్లిపై వివేకానందరెడ్డి లైంగిక వేధింపులు భరించలేక వివేకాని చంపేశాడు అని భాస్కర్ రెడ్డి తాజాగా హై కోర్టులో పిటీషన్ వేయడం గమనార్హం. కొడుకు వివేకా కూతురి మీద ఆరోపణలు చేసిన కొన్ని రోజుల్లోనే తండ్రి ఇలా కొత్త వెర్షన్తో పిటిషన్ వేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇలా ఎప్పటికప్పుడు వెర్షన్లను మార్చేస్తుండటం పట్ల సోషల్ మీడియాలో బాగానే కామెడీ నడుస్తోంది.
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…
అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…