ఆంధ్రప్రదేశ్లో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ తమ్ముడు, జగన్ బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసు ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. ఆ హత్యకు సంబంధించి నిందను చంద్రబాబు సర్కారు మీద వేసి జగన్ అండ్ కో బాగానే రాజకీయ ప్రయోజనం పొందింది.
నిజానికి వివేకాది గుండెపోటు అని సాక్షి మీడియాలో ముందుగా ప్రచారం చేసింది జగన్ కుటుంబ సభ్యులే. కానీ తర్వాత హత్య విషయం బయటికి రాగానే చంద్రబాబు మీదికి నిందను నెట్టేస్తూ సాక్షి మీడియాలో వచ్చిన నారాసుర రక్తచరిత్ర కథనం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. వివేకా చనిపోయిన గంటల్లోనే ఒక వెర్షన్ మారి ఇంకో వెర్షన్ రాగా.. గత కొన్నేళ్లలో ఈ కేసు ఎన్ని మలుపులు తిరిగిందో.. ఎన్నెన్ని కొత్త వెర్షన్లు వచ్చాయో పరిశీలిస్తే షాకవ్వక తప్పదు.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ సోదరుడు అవినాష్ రెడ్డి వర్గీయులే ఎప్పటికప్పుడు కొత్త వెర్షన్లు వినిపిస్తుండటం ఈ కథలో అసలైన ట్విస్టు .గుండె పోటు కాస్తా హత్యగా మారాక.. ఓవైపు చంద్రబాబే ఈ హత్య చేయించాడని ఆరోపిస్తూ.. మరోవైపు టైంకి రానందుకు వివేకా తిట్టాడని ఆయన డ్రైవరే హత్య చేసినట్లు వివేకా పేరుతో ఒక లేఖను సృష్టించడం గమనార్హం. తర్వాతేమో బెంగళూరులో ఉన్న ఒక స్థలం వ్యవహారంలో వివేకా హత్య జరిగిందని ఒక ప్రచారం నడిచింది. ఆపై నింద వివేకా కూతురు, అల్లుడు మీదికి మళ్లింది. ముస్లిం యువతితో కన్న బిడ్డని వారసుడుగా ప్రకటిస్తున్నాడని కూతురు,అల్లుడే చంపేశారనే ఆరోపణను తెరపైకి తెచ్చారు. ఈ ఆరోపణ చేసింది స్వయంగా అవినాషే కావడం విశేషం.
కానీ ఇప్పుడు అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి ఇంకో కొత్త ఆరోపణను తెరపైకి తెచ్చారు. ఈ కేసు నిందితుల్లో ఒకడైన సునీల్ యాదవ్ తన తల్లిపై వివేకానందరెడ్డి లైంగిక వేధింపులు భరించలేక వివేకాని చంపేశాడు అని భాస్కర్ రెడ్డి తాజాగా హై కోర్టులో పిటీషన్ వేయడం గమనార్హం. కొడుకు వివేకా కూతురి మీద ఆరోపణలు చేసిన కొన్ని రోజుల్లోనే తండ్రి ఇలా కొత్త వెర్షన్తో పిటిషన్ వేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇలా ఎప్పటికప్పుడు వెర్షన్లను మార్చేస్తుండటం పట్ల సోషల్ మీడియాలో బాగానే కామెడీ నడుస్తోంది.
This post was last modified on April 12, 2023 6:10 am
నిన్న విడుదలైన డబుల్ ఇస్మార్ట్ టీజర్ పట్ల రామ్ అభిమానుల స్పందన కాసేపు పక్కనపెడితే సగటు ప్రేక్షకులకు మాత్రం మరీ…
ఇంకో నలభై రోజుల్లో విడుదల కాబోతున్న కల్కి 2898 ఏడికి సంబంధించి పూర్తి స్థాయి ప్రమోషన్లు మొదలుకాలేదని ఎదురు చూస్తున్న…
అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న దేవర ఆడియోలోని మొదటి లిరికల్ సాంగ్ ఈ వారమే విడుదల కానుంది. జూనియర్ ఎన్టీఆర్…
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. తాజాగా ఏపీ ఎన్నికల ఫలితంపై స్పందించారు. ఇంకా ఫలితం…
ఏపీ సీఎం జగన్ నివాసం ఉంటే తాడేపల్లిలోని ఇంట్లో విశిష్ఠ రాజశ్యామల యాగం నిర్వహించారు. అయితే.. ఇది 41 రోజుల…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎన్నికల కోలాహలం ముగిసింది. ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. దీనికి 20 రోజుల సమయం ఉంది.…