Political News

తెలుగుదేశం త‌మ్ముళ్ల‌కు పాత జ్ఞాప‌కాలు గుర్తొస్తున్నాయా..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు పార్టీని బ‌లోపేతం చేసేందుకు అనేక కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌కు కౌంట‌ర్‌గా ఆయ‌న కూడా.. వ్యూహాలు సిద్ధం చేసుకుని ముందుకు సాగుతున్నారు. ఇలా.. గ‌త ఏడాది గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని వైసీపీ ప్రారంభించింది. అంటే.. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా.. ప్ర‌జ‌ల‌ను నేరుగా క‌లిసి వారి స‌మ‌స్య‌లు విన‌డం.. ఈ కార్య‌క్ర‌మం ల‌క్ష్యం.

అదేస‌మ‌యంలో ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను, ప‌థ‌కాల‌ను కూడా వారికి వివ‌రించాలి. దీంతో ఇది పెద్ద ఎత్తు న వైసీపీకి మేలు చేస్తుంద‌నే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. దీంతో అలెర్ట్ అయిన‌.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. వెంట‌నే ఇంటింటికీ టీడీపీ కార్య‌క్ర‌మం తాము కూడా చేప‌డుతున్నామంటూ.. ప్ర‌క‌టించారు. అంతేకాదు.. ప్రాంతీయ స‌మ‌న్వ‌య క‌ర్త‌ల‌తో పెద్ద ఎత్తున వీడియో కాన్ఫ‌రెన్సులు నిర్వ‌హించారు.

ఇంటింటికీ కార్య‌క్ర‌మాన్ని వేగవంతం చేయాల‌ని చెప్పారు. అంతేకాదు.. పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ప్లాన్ కూడా చేసుకున్నారు. ఎవ‌రెవ‌రు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనాలో కూడా మ్యాప్ రెడీ చేసుకున్నారు. కానీ, ఈ కార్య‌క్ర‌మం ఎందుకో మ‌రుగున ప‌డింది. ఇప్పుడు ఈ చ‌ర్చ ఎందుకు వ‌చ్చిందంటే.. చేతులు కాలిని త‌ర్వాత‌.. అన్న‌ట్టుగా.. వైసీపీ నేత‌లు మ‌రో కార్య‌క్ర‌మం చేప‌ట్టి.. శుక్ర‌వారం దుమ్ము రేపారు. మా న‌మ్మ‌కం నువ్వే జ‌గ‌న‌న్నా.. అనే కార్య‌క్ర‌మం పెద్ద ఎత్తున హిట్ కొట్టింది.

దీంతో ఇలాంటి కార్య‌క్ర‌మం మ‌నం కూడా చేస్తే.. బాగుండేది కదా.. ఎంత సేపూ మీడియా ముందు మాట్టాడితే.. ఏం ప్ర‌యోజ‌నం.. అనే మాట వినిపించింది. ఈ క్ర‌మంలోనే గ‌తాన్ని త‌వ్వుకున్న త‌మ్ముళ్ల‌కు.. ఇప్పుడు పాత గుర్తులు జ్ఞాప‌కం వ‌చ్చాయి. మ‌రి ఇలా.. అయితే.. పార్టీ పరిస్తితి ఏంటి? అనేది చ‌ర్చ. పోనీ.. ఆ కార్య‌క్ర‌మం ఎందుకు చేప‌ట్టలేదో కూడా.. ఇప్ప‌టిక ఈక్లారిటీ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on April 10, 2023 8:35 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

2 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

2 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

3 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

4 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

5 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

7 hours ago