Political News

సెల్ఫీలు కోట్లాడుతున్నాయ్‌.. టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ

టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ.. ఏదో ఒక వివాదం తెర‌మీదికి వ‌స్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. వైసీపీ స‌ర్కారుకు సెల్ఫీ చాలెంజ్ విసురుతున్నారు. ఇటీవ‌ల రెండు రోజుల కింద‌ట మూ డు జిల్లాల ప‌ర్య‌ట‌న‌ను చంద్ర‌బాబు ప్రారంభించారు. పార్టీ కార్య‌క‌ర్త‌లు, నేత‌ల జోన‌ల్ స‌మావేశాల‌ను ఆయన చేప‌ట్టారు. త‌ద్వారా.. పార్టీని బ‌లోపేతం చేయ‌డంతోపాటు..నేత‌ల‌కు దిశానిర్దేశం చేస్తున్నారు.

ఇదేస‌మ‌యంలో తాను ప‌ర్య‌టిస్తున్న ప్రాంతాల్లో టీడీపీ హ‌యాంలో చేప‌ట్టిన కీల‌క‌ప‌థ‌కాలు… ప‌నుల‌కు సంబంధించి.. సెల్ఫీలు దిగుతున్నారు చంద్ర‌బాబు. వీటిని సోష‌ల్ మీడియాలో పోస్టు చేస్తూ.. వైసీపీ ప్ర‌భుత్వానికి సెల్ఫీ చాలెంజ్ విసురుతున్నారు. విశాఖ‌లో ఐటీ పార్కు వ‌ద్ద‌.. సెల్ఫీదిగిన చంద్ర‌బాబు .. త‌మ హ‌యాంలో ఐటీ ప‌రుగులు పెట్టింద‌ని.. ఇప్పుడు ప‌రిస్థితి ఏంట‌ని సీఎం జ‌గ‌న్‌ను ప్ర‌శ్నించారు.

అదేవిధంగా నెల్లూరులో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు.. తాను సీఎంగా ఉన్న‌ప్పుడు.. పేద‌ల‌కు.. టిడ్కో ఇళ్లు క‌ట్టించామ‌ని.. ఇవి పూర్త‌య్యే ద‌శ‌లో ఉన్న‌ప్పుడు వ‌చ్చిన ఎన్నిక‌ల్లో తాము ఓడిపోయాని అంగీక‌రించారు. మ‌రి ఇప్పుడు ఆ టిడ్కో ఇళ్లు ఎందుకు పేద‌ల‌కు ఇవ్వ‌లేద‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. తమ హ‌యాంలో నే 85 శాతం పూర్త‌య్యాయ‌ని మిగిలిన 15 శాతం కూడా పూర్తి చేయ‌లేరా? అని ప్ర‌శ్నించారు. ఈ క్ర‌మంలోనే టీడ్కో ఇళ్ల ముందు చంద్ర‌బాబు సెల్ఫీ తీసుకున్నారు.

దీనిని సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. సీఎం జ‌గ‌న్‌కు స‌వాల్ విసిరారు. అయితే.. టీడీపీ అధినేత సెల్ఫీ చాలెంజ్‌ల‌పై ఆచితూచి స్పందించారు వైసీపీ మంత్రులు. నెల్లూరుకు చెందిన మంత్రి కాకాని గోవ‌ర్ధ‌న్ రెడ్డి, ప్ర‌కాశం జిల్లాకు చెందిన మంత్రి ఆదిమూల‌పు సురేష్‌.. టీడీపీ అధినేత‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. సెల్ఫీలుకాద‌ని.. నేరుగా త‌మ‌తో చ‌ర్చ‌ల‌కు వ‌స్తే.. లెక్క‌లు చూపిస్తామ‌ని వ్యాఖ్యానించారు. ఇక‌, దీనిపై టీడీపీ నేత‌లు కౌంట‌ర్లు ఇవ్వ‌డం ప్రారంభించారు. ఇలా.. మొత్తంగా.. సెల్ఫీల విష‌యం ఇరు పార్టీల మ‌ధ్య వివాదంగా మార‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on April 10, 2023 8:31 am

Share

Recent Posts

వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ?

కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…

20 minutes ago

మెగాస్టార్ ప్రస్థానం… టాలీవుడ్ మాస్ సంతకం

తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…

30 minutes ago

సందీప్ వంగ ‘చిరు’ ఫ్యానిజం… ఇది చాలా లోతు బాసూ

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…

50 minutes ago

చిరంజీవి కాకా… అదిరింది కానుక

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…

1 hour ago

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…

2 hours ago

గవర్నర్ గా యనమల రామకృష్ణుడు?

కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…

4 hours ago