టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏదో ఒక వివాదం తెరమీదికి వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు.. వైసీపీ సర్కారుకు సెల్ఫీ చాలెంజ్ విసురుతున్నారు. ఇటీవల రెండు రోజుల కిందట మూ డు జిల్లాల పర్యటనను చంద్రబాబు ప్రారంభించారు. పార్టీ కార్యకర్తలు, నేతల జోనల్ సమావేశాలను ఆయన చేపట్టారు. తద్వారా.. పార్టీని బలోపేతం చేయడంతోపాటు..నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.
ఇదేసమయంలో తాను పర్యటిస్తున్న ప్రాంతాల్లో టీడీపీ హయాంలో చేపట్టిన కీలకపథకాలు… పనులకు సంబంధించి.. సెల్ఫీలు దిగుతున్నారు చంద్రబాబు. వీటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. వైసీపీ ప్రభుత్వానికి సెల్ఫీ చాలెంజ్ విసురుతున్నారు. విశాఖలో ఐటీ పార్కు వద్ద.. సెల్ఫీదిగిన చంద్రబాబు .. తమ హయాంలో ఐటీ పరుగులు పెట్టిందని.. ఇప్పుడు పరిస్థితి ఏంటని సీఎం జగన్ను ప్రశ్నించారు.
అదేవిధంగా నెల్లూరులో పర్యటించిన చంద్రబాబు.. తాను సీఎంగా ఉన్నప్పుడు.. పేదలకు.. టిడ్కో ఇళ్లు కట్టించామని.. ఇవి పూర్తయ్యే దశలో ఉన్నప్పుడు వచ్చిన ఎన్నికల్లో తాము ఓడిపోయాని అంగీకరించారు. మరి ఇప్పుడు ఆ టిడ్కో ఇళ్లు ఎందుకు పేదలకు ఇవ్వలేదని చంద్రబాబు ప్రశ్నించారు. తమ హయాంలో నే 85 శాతం పూర్తయ్యాయని మిగిలిన 15 శాతం కూడా పూర్తి చేయలేరా? అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే టీడ్కో ఇళ్ల ముందు చంద్రబాబు సెల్ఫీ తీసుకున్నారు.
దీనిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సీఎం జగన్కు సవాల్ విసిరారు. అయితే.. టీడీపీ అధినేత సెల్ఫీ చాలెంజ్లపై ఆచితూచి స్పందించారు వైసీపీ మంత్రులు. నెల్లూరుకు చెందిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి ఆదిమూలపు సురేష్.. టీడీపీ అధినేతపై విమర్శలు గుప్పించారు. సెల్ఫీలుకాదని.. నేరుగా తమతో చర్చలకు వస్తే.. లెక్కలు చూపిస్తామని వ్యాఖ్యానించారు. ఇక, దీనిపై టీడీపీ నేతలు కౌంటర్లు ఇవ్వడం ప్రారంభించారు. ఇలా.. మొత్తంగా.. సెల్ఫీల విషయం ఇరు పార్టీల మధ్య వివాదంగా మారడం గమనార్హం.
This post was last modified on April 10, 2023 8:31 am
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు…
ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…