Political News

సీపీఎస్ ర‌ద్దు చేసేలా నిర్ణ‌యం: లోకేష్ హామీ!

ఏపీ ప్ర‌భుత్వ‌ ఉద్యోగులు ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్న కంట్రిబ్యూట‌రీ పింఛ‌న్‌(సీపీఎస్‌) ర‌ద్దుపై టీడీపీ యువ‌నాయ‌కుడు, మాజీ మంత్రి నారాలోకేష్ సంచ‌ల‌న హామీ ఇచ్చారు. సీఎం జ‌గ‌న్‌.. 2019ఎన్నిక‌ల‌కు ముందు నిర్వ‌హించిన పాద‌యాత్ర‌లో సీపీఎస్ ర‌ద్దుపై హామీ ఇచ్చార‌ని.. అయితే.. అధికారంలోకి వ‌చ్చాక‌.. తెలియ‌క ఇచ్చాను.. అప్ప‌ట్లో గుర్తించ‌లేక పోయాను.. అని నంగ‌నాచి క‌బుర్లు చెప్పార‌ని లోకేష్ విమ‌ర్శించారు. దీంతో ఉద్యోగులు తీవ్ర మాన‌సిక వేద‌న‌ను అనుభ‌విస్తున్నార‌ని అన్నారు.

అయితే.. తాము వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చాక‌.. ఉద్యోగుల‌కు, ప్ర‌భుత్వానికిఆమోద యోగ్యం అయ్యేలా సీపీఎస్ ర‌ద్దుపై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు. లోకేష్ నిర్వ‌హిస్తున్న‌ యువగళం పాదయాత్ర… అనంతపురం జిల్లాలో ఉత్సాహంగా కొనసాగింది. పాదయాత్రను జంబులదిన్నె విడిదికేంద్రం నుంచి.. యువనేత ప్రారంభించారు. భారీ సంఖ్యలో స్థానికులు, టీడీపీ కార్యకర్తలు యాత్రలో పాల్గొని పాద‌యాత్ర‌కు మద్దతుగా నడిచారు. వివిధ వర్గాల సమస్యల్ని తెలుసుకుంటూ లోకేష్ ముందుకు కదిలారు.

విడిదికేంద్రం వద్ద వర్కింగ్ ప్రొఫెషనల్స్‌లో ముఖాముఖి నిర్వహించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం దివాలా దిశగా పయనిస్తోంద ని… లోకేష్ మండిపడ్డారు. మళ్లీ టీడీపీ గెలిచిన తర్వాత అన్ని రంగాల్లో ఏపీని మొదటి స్థానంలో నిలబెట్టడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక సీపీఎస్. రద్దుపై ఉపాధ్యాయులకు, ప్రభుత్వానికి ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని తీసుకుందామని భరోసా ఇచ్చారు.

పాదయాత్రలో భాగంగా శింగనమల మండలం నర్సాపురంలో రైతులతో లోకేశ్ మాట్లాడారు. వాతావరణం అనుకూలించక భారీగా నష్టపోయామని వేరుశనగ రైతులు వాపోయారు. మూడేళ్లగా ఎరువులు, విత్తనాల ధరలు విపరీతంగా పెరిగిపోయా యని… మద్దతు ధర కూడా లభించడంలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో బిందు సేద్యానికి.. యంత్రాలను 90శాతం రాయితీతో ఇచ్చామని జగన్‌ సర్కార్‌ రైతుకు మొండిచేయి చూపిందని ఈ సంద‌ర్భంగా నారా లోకేష్‌ మండిపడ్డారు.

This post was last modified on April 9, 2023 10:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

32 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago