మహిళల దుస్తులు.. వారి వ్యవహారశైలిపై బీజేపీ నేత ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒళ్లంతా కనిపించేలా బట్టలు కనిపించేవా రు.. శూర్పణఖలతో సమానమని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. అలాంటి వారిని అక్కడే.. నడిరోడ్డుపై కొట్టినా తప్పులేదనిపిస్తుందని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు మంటలు రేపుతున్నాయి. దీనిపై మహిళా సంఘాల నాయకులు మండిపడుతున్నారు. మంచి దుస్తులు ధరించని మహిళలు శూర్పణఖల్లాంటి వారని బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయవర్గీయ వ్యాఖ్యానించారు.
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగిన ఓ కార్యక్రమంలో విజయవర్గీయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “రాత్రి సమయంలో ఇంటికి వెళ్తున్నప్పుడు మద్యం మత్తులో ఉన్న యువతను, పిల్లల్ని చూస్తుంటాను. చాలా అలగా చేస్తున్నారని అనిపిస్తుంది. వాళ్లను అలగా జనం అంటే తప్పులేదు. అంతేకాదు.. నాకు చచ్చే కోపం వస్తుంది. కారు దిగి వారిని అక్కడే కొట్టాలని అనిపిస్తుంది” అని వర్గీయ వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు.. “మహిళల్లో మనం దేవతలను చూస్తుంటాం. మరి, మంచి దుస్తులు వేసుకోని బాలికలు దేవతల్లా కారు.. శూర్పణఖల్లా కనిపిస్తారు. దేవుడు ఆడవాళ్లకు అందమైన శరీరం ఇచ్చాడు. మంచి దుస్తులు ధరించండి. ఒళ్లంతా కనిపించేలా షార్ట్స్ వేసుకోమని ఎవరు చెప్పారు. తర్వాత ఏమైనా అయితే.. ప్రభుత్వాలపై పడి ఏడుస్తారు” అని వ్యాఖ్యానించారు. ఇక, వర్గీయ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి.
ఈ వ్యాఖ్యలు మహిళలను కించపరచడేమనని ప్రతిపక్షాలు విమర్శించాయి. అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నెటా డిసౌజా స్పందిస్తూ తాలిబన్ పాలనలో ఉన్నట్టు అనిపిస్తోందని విమర్శించారు. ఏమి తినాలో, ఎలాంటి దస్తులు వేసుకోవాలో ప్రభుత్వమే నిర్ణయిస్తుందా అని ప్రశ్నించారు. ఇరాన్ లో తాలిబాన్ల ఆంక్షలపై ఆశ్చర్యం వ్యక్తం చేశామని..కానీ, ఇప్పుడు ఇక్కడ అవే ఆంక్షలు కనిపిస్తున్నాయని అన్నారు.
This post was last modified on April 9, 2023 2:44 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…
ఏపీకి పొరుగునే ఉన్న తమిళనాడులో ఇప్పుడు ఇదే తరహా రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీలు లెక్కకు మిక్కిలిగా ఉన్నా.. నాయకులు…