జీవితకాలం ఎంతో ఉన్నతంగా బతికి.. తమిళనాడును శాసించిన దివంగత ముఖ్యమంత్రి.. అన్నాడీఎంకే నేతల అమ్మ.. జయలలిత.. చివరి దశలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని..జైలు జీవితం గడిపిన విషయం తెలిసిందే. పురుచ్చితలైవిగా.. పేర్గాంచి.. బతికి ఉన్నప్పుడే.. ఆలయాలు కట్టించుకునేంత ఎత్తుకు ఎదిగిన జయ జీవితంలో అన్నీ సస్పెన్సులే! వివాహం.. పిల్ల(లు).. ప్రేమాయణం.. అవినీతి… ఆఖరుకు మరణం కూడా.. అంతా మిస్టరీగానే ముగిశాయి.
ఇక, ఆమె జీవితంలో కీలక మలుపుగా మారి… జైలుకు వెళ్లే దుస్థితిని కల్పించిన అవినీతి అంతా ఇంతా కాదు. అప్పట్లో జయ అక్రమార్జన గురించి.. పేపర్లు ప్రత్యేక ఎడిషన్లు వేసిన సందర్భాలు ఉన్నాయంటే.. ఆశ్చర్యం అనిపించకమానదు. ఈ కేసును ప్రభావితం చేస్తున్నారంటూ.. ఏకంగా.. తమిళనాడు రాష్ట్రం నుంచి కర్ణాటకకు తరలించారు. ఇక్కడే జయ కేసులో తీర్పురావడం.. ఆమె జైలుకు కూడా వెళ్లడం తెలిసిందే.
అయితే.. అక్రమార్జన కేసులో జయలలిత నుంచి స్వాధీనం చేసుకున్న చరాస్తుల్ని విక్రయించేందుకు కర్ణాటక ప్రభుత్వం రెడీ అయింది. దీనికి సంబంధించి లావాదేవీలు చేసేందుకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా న్యాయవాది కిరణ్ ఎస్ జావలిని బొమ్మై ప్రభుత్వం నియమించింది. సాక్ష్యాల రూపంలో 1996లో చెన్నైలోని జయ నివాసం నుంచి స్వాధీనపరచుకున్న వస్తువులన్నీ ప్రస్తుతం కర్ణాటక సర్కారు ఆధీనంలో ఉన్నాయి. మరి వీటిని కొనుగోలు చేయాలని భావించేవారు.. ప్రత్యేక ఏర్పాటు చేసిన వెబ్సైట్లో పేరు నమోదు చేసుకుని.. వేలంలో పాల్గొనవచ్చు.
వేలం వేసే జయ అక్రమార్జన ఇదీ..
This post was last modified on April 9, 2023 10:59 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…
ఏపీకి పొరుగునే ఉన్న తమిళనాడులో ఇప్పుడు ఇదే తరహా రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీలు లెక్కకు మిక్కిలిగా ఉన్నా.. నాయకులు…