జీవితకాలం ఎంతో ఉన్నతంగా బతికి.. తమిళనాడును శాసించిన దివంగత ముఖ్యమంత్రి.. అన్నాడీఎంకే నేతల అమ్మ.. జయలలిత.. చివరి దశలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని..జైలు జీవితం గడిపిన విషయం తెలిసిందే. పురుచ్చితలైవిగా.. పేర్గాంచి.. బతికి ఉన్నప్పుడే.. ఆలయాలు కట్టించుకునేంత ఎత్తుకు ఎదిగిన జయ జీవితంలో అన్నీ సస్పెన్సులే! వివాహం.. పిల్ల(లు).. ప్రేమాయణం.. అవినీతి… ఆఖరుకు మరణం కూడా.. అంతా మిస్టరీగానే ముగిశాయి.
ఇక, ఆమె జీవితంలో కీలక మలుపుగా మారి… జైలుకు వెళ్లే దుస్థితిని కల్పించిన అవినీతి అంతా ఇంతా కాదు. అప్పట్లో జయ అక్రమార్జన గురించి.. పేపర్లు ప్రత్యేక ఎడిషన్లు వేసిన సందర్భాలు ఉన్నాయంటే.. ఆశ్చర్యం అనిపించకమానదు. ఈ కేసును ప్రభావితం చేస్తున్నారంటూ.. ఏకంగా.. తమిళనాడు రాష్ట్రం నుంచి కర్ణాటకకు తరలించారు. ఇక్కడే జయ కేసులో తీర్పురావడం.. ఆమె జైలుకు కూడా వెళ్లడం తెలిసిందే.
అయితే.. అక్రమార్జన కేసులో జయలలిత నుంచి స్వాధీనం చేసుకున్న చరాస్తుల్ని విక్రయించేందుకు కర్ణాటక ప్రభుత్వం రెడీ అయింది. దీనికి సంబంధించి లావాదేవీలు చేసేందుకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా న్యాయవాది కిరణ్ ఎస్ జావలిని బొమ్మై ప్రభుత్వం నియమించింది. సాక్ష్యాల రూపంలో 1996లో చెన్నైలోని జయ నివాసం నుంచి స్వాధీనపరచుకున్న వస్తువులన్నీ ప్రస్తుతం కర్ణాటక సర్కారు ఆధీనంలో ఉన్నాయి. మరి వీటిని కొనుగోలు చేయాలని భావించేవారు.. ప్రత్యేక ఏర్పాటు చేసిన వెబ్సైట్లో పేరు నమోదు చేసుకుని.. వేలంలో పాల్గొనవచ్చు.
వేలం వేసే జయ అక్రమార్జన ఇదీ..
This post was last modified on April 9, 2023 10:59 am
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…