Political News

“జ‌గ‌న్.. జాదూ” ఏపీలో ముదిరిన రాజ‌కీయం..!

ఏపీలో అధికార వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ మ‌ధ్య రాజ‌కీయాలు మ‌రింత ముదురుతున్నాయి. తాజాగా ఏపీ ప్ర‌భుత్వం.. ‘మా న‌మ్మ‌కం నువ్వే జ‌గ‌న్‌’ అనే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టిన విష‌యం తెలిసిందే. అయితే.. దీనికి కౌంట‌ర్‌గా.. టీడీపీ ” ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాదూ” అంటూ టీడీపీ పోస్టర్ విడుదల చేసింది. ఇది.. రాజ‌కీయాల‌ను ఒక్క‌సారిగా వేడెక్కించింది. టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ.. ఈ మధ్య వీధుల్లో సంచులు వేసుకొని వైసీపీ భజన బృందo తిరుగుతోందని, సంచుల్లో ఉన్న స్టిక్కర్ తీసి ప్రతి ఇంటికి వాళ్లే అంటించుకుంటున్నారని విమర్శించారు.

జగన్ త‌మ భవిష్యత్తు అని ప్రజలు చెప్పుకోవాలి కానీ స్టిక్కర్లు అంటించుకోవడమేంటని ప్రశ్నించారు.సీఎం జగన్ స్టిక్కర్ పథకానికి నాంది పలికారని, ‘జ‌గ‌న్‌ ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం’ అనే స్టిక్కర్లు వేసే రోజు దగ్గరలోనే ఉందని అనిత అన్నారు. జగన్ మాట తప్పరు, మడమ తిప్పరు అంటే నాలుక కోస్తారన్నారు. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి కొడుకు కాకపోతే ఆయనకు ఏమీ లేదని.. ఏ తల్లి ఇలాంటి బిడ్డను కనకూడదని చూపించడానికి బెస్ట్ ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. సొంత తల్లినే గౌరవించని వ్యక్తని దుయ్యబట్టారు.

ఓటును గుర్తించారు.. బాబాయి హంత‌కుడిని గుర్తించ‌లేదా?

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో నాలుగు గోడల మధ్య వేరొకరు ఓటు వేస్తేనే తెలిసిపోయింది.. మరి బాబాయి వైఎస్ వివేకను చంపింది ఎవరో ఇప్పటికీ జగన్ తెలుసుకోలేకపోయారా? అని టీడీపీ నాయ‌కురాలు అనిత ప్రశ్నించారు. ఎవరు ఎన్ని చెప్పినా.. చంద్రబాబు సీఎం అవ్వడం ఖాయమని వంగలపూడి అనిత ఆశాభావం వ్యక్తం చేశారు. ‘జగనన్న, మా భవిష్యత్తు కాదు.. జగనే మా దరిద్రం’ అని ప్రజలు అనుకుంటున్నారన్నారు. సంక్షేమంపై డబ్బులు పంచడం జరిగిందని.. అభివృద్ధి లేదని విమర్శించా రు. అభివృద్ధి లేక ఉపాధి లేక యువత గంజాయికి బానిసలు అవుతున్నారని అన్నారు.

This post was last modified on April 8, 2023 10:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

58 minutes ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

1 hour ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

1 hour ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

2 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

3 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

4 hours ago