ఒక్క తప్పటడుగు వల్ల జనాలు, పార్టీలోనే కాకుండా చివరకు కుటుంబంతో కూడా విభేదాలు వచ్చేశాయి. వైసీపీ ఎంఎల్ఏగా ఉంటు క్రాస్ ఓటింగ్ ద్వారా టీడీపీ ఎంఎల్సీ అభ్యర్ధి గెలుపుకు సహకరించారని జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎంఎల్ఏ మేకపాటి చంద్రశేఖరరెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. క్రాస్ ఓటింగ్ కారణంగా ముందు పార్టీకి తర్వాత జనాలకు కూడా దూరమయ్యారు. తాజాగా కుటుంబానికి కూడా ఎంఎల్ఏ దూరమైపోయినట్లు సమాచారం.
ఇదే విషయమై మాజీ ఎంపీ, చంద్రశేఖరరెడ్డి అన్న మేకపాటి రాజగోపాలరెడ్డి మీడియాతో మాట్లాడుతు తన తమ్ముడిని దూరంపెట్టేసినట్లు చెప్పారు. క్రాస్ ఓటింగ్ చేసి పార్టీనుండి సస్పెండ్ అయినప్పటినుండి తన తమ్ముడితో మాటలు లేవన్నారు. దారితప్పిన దగ్గరనుండి ఎంఎల్ఏతో మాట్లాడటం లేదని మాజీ ఎంపి చెప్పారు. పార్టీలైను దాటి క్రాస్ ఓటింగ్ చేయటం ముమ్మాటకి తన తమ్ముడు చేసింది తప్పే అన్నారు. క్రాస్ ఓటింగ్ చేయలేదని తమ్ముడు ఎంతచెప్పినా చెల్లుబాటు కాదన్నారు.
ఒక ఎంఎల్ఏని సస్పెండ్ చేశారంటే ఊరికే చేయరు కదా అని మాజీ ఎంపీ ఎదురు ప్రశ్నించారు. క్రాస్ ఓటింగ్ విషయంపై అంతర్గతంగా విచారణ చేసుకుని, నిర్ధారించుకున్న తర్వాతనే వేటు వేసినట్లు స్పష్టంచేశారు. తమ్ముడైనా ఎవరైనా పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టబడుండాల్సిందే అని రాజగోపాలరెడ్డి స్పష్టంగా చెప్పారు. క్రాస్ ఓటింగ్ చేయలేదని ప్రమాణం చేస్తానని ఎంఎల్ఏ చెప్పటంలో అర్ధంలేదని అన్న అభిప్రాయపడ్డారు.
ఎంఎల్ఏ తీరుతో ప్రమాణాలకు కూడా విలువ లేకుండా పోయిందని బాధపడ్డారు. నియోజకవర్గంలో ఎవరు పోటీచేస్తారనేది జగన్మోహన్ రెడ్డి నిర్ణయం ప్రకారమే జరుగుతుందన్నారు. అభ్యర్ధిగా జగన్ ఎవరిని ఎంపికచేసినా సంతోషమే అన్నారు. వచ్చేఎన్నికల్లో కూడా పోయిన ఎన్నికల్లో లాగే అన్నీ నియోజకవర్గాల్లోను వైసీపీనే గెలుస్తుందన్న ధీమాను వ్యక్తంచేశారు. మొత్తానికి ఎప్పటినుండి అన్నదమ్ముల మధ్య గొడవలను సెటిల్ చేసుకునేందుకు క్రాస్ ఓటింగ్ మంచి అవకాశం కల్పించినట్లే ఉంది. తమ్ముడి వైఖరితో విసిగిపోయిన అన్న కుటుంబం చాలాకాలంగా దూరంగా ఉంటున్నట్లు సమాచారం. అలాంటిది క్రాస్ ఓటింగ్ పుణ్యమాని పూర్తిగా తెగతెంపులు చేసుకున్నట్లున్నారు.
This post was last modified on April 8, 2023 11:27 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…