ఒక్క తప్పటడుగు వల్ల జనాలు, పార్టీలోనే కాకుండా చివరకు కుటుంబంతో కూడా విభేదాలు వచ్చేశాయి. వైసీపీ ఎంఎల్ఏగా ఉంటు క్రాస్ ఓటింగ్ ద్వారా టీడీపీ ఎంఎల్సీ అభ్యర్ధి గెలుపుకు సహకరించారని జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎంఎల్ఏ మేకపాటి చంద్రశేఖరరెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. క్రాస్ ఓటింగ్ కారణంగా ముందు పార్టీకి తర్వాత జనాలకు కూడా దూరమయ్యారు. తాజాగా కుటుంబానికి కూడా ఎంఎల్ఏ దూరమైపోయినట్లు సమాచారం.
ఇదే విషయమై మాజీ ఎంపీ, చంద్రశేఖరరెడ్డి అన్న మేకపాటి రాజగోపాలరెడ్డి మీడియాతో మాట్లాడుతు తన తమ్ముడిని దూరంపెట్టేసినట్లు చెప్పారు. క్రాస్ ఓటింగ్ చేసి పార్టీనుండి సస్పెండ్ అయినప్పటినుండి తన తమ్ముడితో మాటలు లేవన్నారు. దారితప్పిన దగ్గరనుండి ఎంఎల్ఏతో మాట్లాడటం లేదని మాజీ ఎంపి చెప్పారు. పార్టీలైను దాటి క్రాస్ ఓటింగ్ చేయటం ముమ్మాటకి తన తమ్ముడు చేసింది తప్పే అన్నారు. క్రాస్ ఓటింగ్ చేయలేదని తమ్ముడు ఎంతచెప్పినా చెల్లుబాటు కాదన్నారు.
ఒక ఎంఎల్ఏని సస్పెండ్ చేశారంటే ఊరికే చేయరు కదా అని మాజీ ఎంపీ ఎదురు ప్రశ్నించారు. క్రాస్ ఓటింగ్ విషయంపై అంతర్గతంగా విచారణ చేసుకుని, నిర్ధారించుకున్న తర్వాతనే వేటు వేసినట్లు స్పష్టంచేశారు. తమ్ముడైనా ఎవరైనా పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టబడుండాల్సిందే అని రాజగోపాలరెడ్డి స్పష్టంగా చెప్పారు. క్రాస్ ఓటింగ్ చేయలేదని ప్రమాణం చేస్తానని ఎంఎల్ఏ చెప్పటంలో అర్ధంలేదని అన్న అభిప్రాయపడ్డారు.
ఎంఎల్ఏ తీరుతో ప్రమాణాలకు కూడా విలువ లేకుండా పోయిందని బాధపడ్డారు. నియోజకవర్గంలో ఎవరు పోటీచేస్తారనేది జగన్మోహన్ రెడ్డి నిర్ణయం ప్రకారమే జరుగుతుందన్నారు. అభ్యర్ధిగా జగన్ ఎవరిని ఎంపికచేసినా సంతోషమే అన్నారు. వచ్చేఎన్నికల్లో కూడా పోయిన ఎన్నికల్లో లాగే అన్నీ నియోజకవర్గాల్లోను వైసీపీనే గెలుస్తుందన్న ధీమాను వ్యక్తంచేశారు. మొత్తానికి ఎప్పటినుండి అన్నదమ్ముల మధ్య గొడవలను సెటిల్ చేసుకునేందుకు క్రాస్ ఓటింగ్ మంచి అవకాశం కల్పించినట్లే ఉంది. తమ్ముడి వైఖరితో విసిగిపోయిన అన్న కుటుంబం చాలాకాలంగా దూరంగా ఉంటున్నట్లు సమాచారం. అలాంటిది క్రాస్ ఓటింగ్ పుణ్యమాని పూర్తిగా తెగతెంపులు చేసుకున్నట్లున్నారు.
This post was last modified on April 8, 2023 11:27 am
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు…
డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…
హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…
ప్రపంచ వేదిక మీద సగర్వంగా ఆస్కార్ అందుకున్న ఎంఎం కీరవాణి మీద ఇప్పుడు అతి పెద్ద బాధ్యత ఉంది. వారణాసికి…
నిఖిల్ ఎంత గ్యాప్ వస్తున్నా లెక్క చేయకుండా అత్యధిక సమయం కేటాయించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటికే విపరీతమైన…