Political News

బీజేపీ సీమ గేమ్…

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ను వదిలి కాషాయ కండువా కప్పుకున్నారు. కొద్ది గంటల వ్యవధిలోనే పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలుసుకుని రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వెళ్లిపోయే నేతలంతా చేసే పనే కిరణ్ కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీపై టన్నుల కొద్ది బురద చల్లి వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీ తమ నాయకులను ఏ మాత్రం పట్టించుకోదని, వారి అభిప్రాయాలకు గౌరవం ఇవ్వదని కిరణ్ ఆరోపించారు. ప్రజలతో మాట్లాడని పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనన్నారు. కాంగ్రెస్ అన్ని రాష్ట్రాలను కోల్పోతుండగా, యువత ఆదరణ పొందుతున్న బీజేపీ ఒక్కో రాష్ట్రాన్ని హస్తగతం చేసుకుంటోందన్నారు..

రుద్రరాజు ఆగ్రహం

కాంగ్రెస్ పార్టీ ఆరోపణలను ఏపీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు ఖడించారు. అన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని వదిలి కిరణ్ బీజేపీలోకి వెళ్లారని అంటూ.. హస్తం పార్టీని విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. త్యాగాలకు మారుపేరైన కాంగ్రెస్ ను విమర్శించే హక్కు కిరణ్ కు లేదన్నారు..

సీమలో బలోపేతమే లక్ష్యంగా..

బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు.. కోస్తా జిల్లాల నాయకుడు. గత అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, గుంటూరు జిల్లా నేత. పార్టీ కేడర్ కూడా కోస్తాలోనే ఎక్కువగా ఉంది. పైగా విష్ణు వర్థన్ రెడ్డి, భాను ప్రకాష్ రెడ్డి లాంటి ఒక్కరిద్దరు తప్పితే పార్టీలో రెడ్డి సామాజిక వర్గం నేతలు పెద్దగా లేరు. వైసీపీ మాత్రమే రెడ్డి పార్టీ అన్న పేరు పడిపోయింది. దానితో రాయలసీమలో బలపడేందుకు, రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు కిరణ్ కుమార్ ను చేర్చుకున్నట్లుగా చెబుతున్నారు. పైగా కాంగ్రెస్ పార్టీలో ఇక మనుగడ లేదని, రాష్ట్రంలో ఆ పార్టీ మళ్లీ పుంజుకోవడం కుదరదని గ్రహించిన కిరణ్, బీజేపీలో చేరేందుకు ఒప్పుకున్నారు..

రాజ్యసభ గిఫ్ట్ ?

కిరణ్ ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడు. ఆయన వచ్చినందుకు ఏదోక ప్రయోజనం చూపించాలి. రాష్ట్రంలో ఎంపీగానో, ఎమ్మెల్యేగానో గెలిచే అవకాశాలు తక్కువగానే ఉండటంతో ఆయన్ను రాజ్యసభకు పంపుతామని ముందే హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. త్వరలో ఉత్తర ప్రదేశ్ లేదా మధ్య ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఆయన ఎన్నిక కావచ్చు…

This post was last modified on April 8, 2023 9:27 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీలో ఈసారి ఉగాది పండగా మాత్రమే కాదు

తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రాది ఉగాది మ‌రో 20 రోజుల్లో రానుంది. ఏటా వ‌చ్చే పండుగే క‌దా.. ఏముంది ?…

49 minutes ago

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

4 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

4 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

6 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

6 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

7 hours ago