Political News

స్టిక్క‌ర్ ప‌డింది.. ఓటు ప‌డేనా? వైసీపీలో గుస‌గుస‌!!

ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. తాజాగా శుక్ర‌వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘జగ‌న‌న్నే మా భ‌విష్య‌త్తు’ పేరుతో కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఈ కార్య‌క్ర‌మా న్ని అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభించాల‌ని పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపుతో ఎమ్మెల్యేలు, మంత్రులు ముందుకు క‌దిలారు. భుజాల‌కు ప్ర‌త్యేకంగా రూపొందించిన సంచీని త‌గిలించుకుని ప్ర‌తి ఇంటికీ తిరిగారు.

అయితే..వీరి రాక‌కుముందుగానే.. ప్ర‌తి ఇంటికీ.. ‘జ‌గ‌న‌న్నే మా భ‌విత‌’ పేరుతో ముద్రించిన స్టిక్క‌ర్ల‌ను అంటించారు. అనంత‌రం.. ఆ స్టిక్క‌ర్ల‌ను చూపిస్తూ.. ఎమ్మెల్యేలు, మంత్రులు.. ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ ప‌థ‌కాల పై వివ‌రించారు. నాలుగేళ్ల‌లో సీఎం జ‌గ‌న్ ఏం చేశారు..వచ్చే ఏడాది కాలంలో ఏం చేయ‌నున్నార‌నే విషయాల‌ను కూడా వారు వివ‌రించారు. అయితే.. వైసీపీలోని ఓ వ‌ర్గంలో చిన్న‌పాటి గుస‌గుస వినిపించింది.

స్టిక్క‌ర్ల‌యితే వేశారు.. బాగానే ఉంది. కానీ, ఓట్లు ప‌డ‌తాయా? అని వారు చ‌ర్చించుకోవ‌డం గ‌మ‌నార్హం. ఎందుకంటే.. తాజాగా జ‌రిగిన కార్య‌క్ర‌మంలోనూ ప్ర‌జ‌లు ప‌లు చోట్ల అభివృద్ది గురించి చ‌ర్చించారు. త‌మ‌కు రోడ్లు లేవ‌ని.. తాగునీటి సౌక‌ర్యం లేద‌ని.. పెద్ద ఎత్తున ప్ర‌శ్నించ‌డం క‌నిపించింది. విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాల్లోని శివారు ప్ర‌జ‌లు, కొండ ప్రాంతాల ప్ర‌జ‌లు త‌మ‌కు తాగునీరు ఇచ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేయాల‌ని సూచించారు.

అదేవిధంగా న‌గ‌రిలో మంత్రి రోజా, తిరుప‌తిలో ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డిలు కూడా ఇంటింటికీ సంచీలు వేసుకుని.. తిరిగి.. గ‌త చంద్ర‌బాబు పాల‌న‌కు.. త‌మ‌కు తేడాను వివ‌రించారు. ఈ స‌మ‌యంలో కొంద‌రు అభివృద్ధి గురించి ప్ర‌శ్నించారు. ఈ సంద‌ర్భంగా రోజా క‌లుగ జేసుకుని.. ఈ కార్య‌క్ర‌మం వేరు.. మేం చెప్పింది.. వినండి! అంటూ.. స‌ముదాయించే ప్ర‌య‌త్నం చేశారు. ఈ ప‌రిణామాల‌తో స్టిక్క‌ర్ అయితే వేశారు.. కానీ.. ఓట్లు ప‌డ‌తాయా? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

This post was last modified on April 7, 2023 6:01 pm

Share

Recent Posts

హైదరాబాద్ లో అద్దెకు బాయ్ ఫ్రెండ్లు

హైదరాబాద్ లో రోజురోజుకూ పాశ్చత్య సంస్కృతీ పెరిగిపోతుంది. కో లివింగ్ పీజీలు ఇందుకు ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఉద్యోగం, చదువు…

8 hours ago

ఆలీ రాజకీయాలు ఎందుకు వదిలేశాడు?

తెలుగు సినిమా నటులు రాజకీయాలు చేయడం ఎప్పట్నుంచో ఉన్నదే. కానీ ఈ మధ్య పరిస్థితులు మారిపోయాయి. సినిమాలు వేరు, రాజకీయాలు…

8 hours ago

ట్రైలర్ల జాతర… విజేత ఎవరు దొర

ఈ వారం భారీ సినిమాల ట్రైలర్లు వరసగా రోజుకొకటి సందడి చేశాయి. అన్నీ పెద్ద అంచనాలు పెట్టుకున్న చిత్రాలు కావడంతో…

9 hours ago

ఆహాలో అదరగొడుతున్న దీవానా

కొన్ని సినిమాలకు మంచి టాక్ వచ్చినా అవి థియేట్రికల్ గా భారీ రెవెన్యూలు చూపించకపోవచ్చు. అంత మాత్రాన వాటిని ఫ్లాప్…

10 hours ago

మూడు కోట్లు ఇచ్చి నిశ్చితార్ధం రద్దు చేసుకో

ఒకప్పుడు లక్షలాది రూపాయల కట్నకానుకలు ముట్టచెబితేనే కానీ అమ్మాయిల పెళ్లిళ్లు కావడం కష్టమయ్యేది. లేకపోతే అత్తారింటి వేధింపులు భరించాల్సి వచ్చేది.…

11 hours ago

ఛార్జీల బాదుడు వాళ్లకు మాత్రమే…

500, 1000 రూపాయల నోట్ల రద్దు తర్వాత భారత దేశంలో యూపీఐ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు వీధిలో కూరగాయల…

11 hours ago