ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. తాజాగా శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘జగనన్నే మా భవిష్యత్తు’ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ ఈ కార్యక్రమా న్ని అంగరంగ వైభవంగా ప్రారంభించాలని పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపుతో ఎమ్మెల్యేలు, మంత్రులు ముందుకు కదిలారు. భుజాలకు ప్రత్యేకంగా రూపొందించిన సంచీని తగిలించుకుని ప్రతి ఇంటికీ తిరిగారు.
అయితే..వీరి రాకకుముందుగానే.. ప్రతి ఇంటికీ.. ‘జగనన్నే మా భవిత’ పేరుతో ముద్రించిన స్టిక్కర్లను అంటించారు. అనంతరం.. ఆ స్టిక్కర్లను చూపిస్తూ.. ఎమ్మెల్యేలు, మంత్రులు.. ప్రజలకు ప్రభుత్వ పథకాల పై వివరించారు. నాలుగేళ్లలో సీఎం జగన్ ఏం చేశారు..వచ్చే ఏడాది కాలంలో ఏం చేయనున్నారనే విషయాలను కూడా వారు వివరించారు. అయితే.. వైసీపీలోని ఓ వర్గంలో చిన్నపాటి గుసగుస వినిపించింది.
స్టిక్కర్లయితే వేశారు.. బాగానే ఉంది. కానీ, ఓట్లు పడతాయా? అని వారు చర్చించుకోవడం గమనార్హం. ఎందుకంటే.. తాజాగా జరిగిన కార్యక్రమంలోనూ ప్రజలు పలు చోట్ల అభివృద్ది గురించి చర్చించారు. తమకు రోడ్లు లేవని.. తాగునీటి సౌకర్యం లేదని.. పెద్ద ఎత్తున ప్రశ్నించడం కనిపించింది. విజయవాడ సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాల్లోని శివారు ప్రజలు, కొండ ప్రాంతాల ప్రజలు తమకు తాగునీరు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేయాలని సూచించారు.
అదేవిధంగా నగరిలో మంత్రి రోజా, తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డిలు కూడా ఇంటింటికీ సంచీలు వేసుకుని.. తిరిగి.. గత చంద్రబాబు పాలనకు.. తమకు తేడాను వివరించారు. ఈ సమయంలో కొందరు అభివృద్ధి గురించి ప్రశ్నించారు. ఈ సందర్భంగా రోజా కలుగ జేసుకుని.. ఈ కార్యక్రమం వేరు.. మేం చెప్పింది.. వినండి! అంటూ.. సముదాయించే ప్రయత్నం చేశారు. ఈ పరిణామాలతో స్టిక్కర్ అయితే వేశారు.. కానీ.. ఓట్లు పడతాయా? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
This post was last modified on April 7, 2023 6:01 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…