Political News

స్టిక్క‌ర్ ప‌డింది.. ఓటు ప‌డేనా? వైసీపీలో గుస‌గుస‌!!

ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. తాజాగా శుక్ర‌వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘జగ‌న‌న్నే మా భ‌విష్య‌త్తు’ పేరుతో కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఈ కార్య‌క్ర‌మా న్ని అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభించాల‌ని పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపుతో ఎమ్మెల్యేలు, మంత్రులు ముందుకు క‌దిలారు. భుజాల‌కు ప్ర‌త్యేకంగా రూపొందించిన సంచీని త‌గిలించుకుని ప్ర‌తి ఇంటికీ తిరిగారు.

అయితే..వీరి రాక‌కుముందుగానే.. ప్ర‌తి ఇంటికీ.. ‘జ‌గ‌న‌న్నే మా భ‌విత‌’ పేరుతో ముద్రించిన స్టిక్క‌ర్ల‌ను అంటించారు. అనంత‌రం.. ఆ స్టిక్క‌ర్ల‌ను చూపిస్తూ.. ఎమ్మెల్యేలు, మంత్రులు.. ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ ప‌థ‌కాల పై వివ‌రించారు. నాలుగేళ్ల‌లో సీఎం జ‌గ‌న్ ఏం చేశారు..వచ్చే ఏడాది కాలంలో ఏం చేయ‌నున్నార‌నే విషయాల‌ను కూడా వారు వివ‌రించారు. అయితే.. వైసీపీలోని ఓ వ‌ర్గంలో చిన్న‌పాటి గుస‌గుస వినిపించింది.

స్టిక్క‌ర్ల‌యితే వేశారు.. బాగానే ఉంది. కానీ, ఓట్లు ప‌డ‌తాయా? అని వారు చ‌ర్చించుకోవ‌డం గ‌మ‌నార్హం. ఎందుకంటే.. తాజాగా జ‌రిగిన కార్య‌క్ర‌మంలోనూ ప్ర‌జ‌లు ప‌లు చోట్ల అభివృద్ది గురించి చ‌ర్చించారు. త‌మ‌కు రోడ్లు లేవ‌ని.. తాగునీటి సౌక‌ర్యం లేద‌ని.. పెద్ద ఎత్తున ప్ర‌శ్నించ‌డం క‌నిపించింది. విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాల్లోని శివారు ప్ర‌జ‌లు, కొండ ప్రాంతాల ప్ర‌జ‌లు త‌మ‌కు తాగునీరు ఇచ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేయాల‌ని సూచించారు.

అదేవిధంగా న‌గ‌రిలో మంత్రి రోజా, తిరుప‌తిలో ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డిలు కూడా ఇంటింటికీ సంచీలు వేసుకుని.. తిరిగి.. గ‌త చంద్ర‌బాబు పాల‌న‌కు.. త‌మ‌కు తేడాను వివ‌రించారు. ఈ స‌మ‌యంలో కొంద‌రు అభివృద్ధి గురించి ప్ర‌శ్నించారు. ఈ సంద‌ర్భంగా రోజా క‌లుగ జేసుకుని.. ఈ కార్య‌క్ర‌మం వేరు.. మేం చెప్పింది.. వినండి! అంటూ.. స‌ముదాయించే ప్ర‌య‌త్నం చేశారు. ఈ ప‌రిణామాల‌తో స్టిక్క‌ర్ అయితే వేశారు.. కానీ.. ఓట్లు ప‌డ‌తాయా? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

This post was last modified on April 7, 2023 6:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago