వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఆరోపణాస్త్రాల పదును పెంచింది. ఒక పక్క యువగళం ద్వారా నారా లోకేష్ దూసుకెళ్తున్నారు. మరో పక్క చంద్రబాబు, టీడీపీ క్లస్టర్ మీటింగ్లలో ఆరోపణలు సంధిస్తూ జగన్కు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.
ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు సెల్ఫీ చాలెంజ్ విసిరారు. నెల్లూరులో టీడీపీ హయాంలో కట్టిన వేలాది టిడ్కో ఇళ్ల వద్ద చంద్రబాబు సెల్ఫీ దిగారు. అవి తమ ప్రభుత్వ హాయాంలో పేదలకు కట్టిన వేలాది టిడ్కో ఇళ్లు అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
గతంలో తాము కట్టిన లక్షల ఇళ్లకు ఇవే సజీవ సాక్ష్యం అంటూ రాసుకొచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో కట్టిన ఇళ్లెన్ని? జగన్ కట్టిన ఇళ్లెక్కడ… జవాబు చెప్పగలడా? అంటూ చంద్రబాబు జగన్కు ట్యాగ్ చేస్తూ సెల్ఫీ ఫోటోతో ట్వీట్ చేశారు.
పాదయాత్రలో భాగంగా లోకేష్ తొలుత సెల్ఫీ ఛాలెంజ్ చేశారు. కియా పరశ్రమ దగ్గర సెల్ఫీ దిగి ఇది మేము చేసిన పనేనని వెల్లడించారు. ఇప్పుడు చంద్రబాబు కూడా సెల్ఫీ ఛాలెంజ్ చేసి జగన్పై వత్తిడి పెంచారు…
This post was last modified on April 7, 2023 5:56 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…