వైసీపీ ప్రభుత్వంలో మాదక ద్రవ్యాలు యథేచ్ఛగా లభిస్తున్నాయని గతేడాది ఒక నివేదిక వచ్చింది. నార్కాటిక్స్ కంట్రోల్ బ్యురో వెల్లడించిన నివేదిక ప్రకారం గంజాయి రవాణా, విక్రయంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానాన్ని పొందింది. పల్లెల్లో కూడా గంజాయి దొరుకుతోందని, యువత మాదక ద్రవ్యాలకు బానిస అవుతోందని ఆరోపణలు వినిపించాయి. గుజరాత్ నుంచి వస్తున్న గంజాయి ఏపీలో విక్రయం కావడంతో పాటు తూర్పు తీరం గుండా విదేశాలకు ఎగుమతి అవుతోందని నిర్ధారించారు.
రాష్ట్రాన్ని గంజాయి ప్రదేశ్ గా మార్చిన ఏపీ ప్రభుత్వాన్ని దించేస్తేనే యువతకు భవిష్యత్తు ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు పలు పర్యాయాలు గుర్తు చేశారు. యువగళం పాదయాత్రలో కూడా లోకేష్ పదే పదే అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్బంగా తెలుగు దేశం ఒక ఉద్యమం ప్రారంభించింది. #GanjaOdhuBro హ్యాష్ ట్యాగ్ తో మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాన్ని వివరిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న ఈ హ్యాష్ టాగ్ వల్ల ప్రజల్లో మార్పు వస్తుందని టీడీపీ విశ్వసిస్తోంది.. ఇదే అంశంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ట్విట్టర్లో స్పందిస్తూ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న గంజాయి మహమ్మారిని తరిమి కొట్టే వరుకు తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని తెలిపారు..
This post was last modified on April 7, 2023 1:23 pm
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు…
డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…
హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…
ప్రపంచ వేదిక మీద సగర్వంగా ఆస్కార్ అందుకున్న ఎంఎం కీరవాణి మీద ఇప్పుడు అతి పెద్ద బాధ్యత ఉంది. వారణాసికి…
నిఖిల్ ఎంత గ్యాప్ వస్తున్నా లెక్క చేయకుండా అత్యధిక సమయం కేటాయించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటికే విపరీతమైన…