Political News

వైసీపీ ఎమ్మెల్యేలు నాతో కూడా ట‌చ్‌లో ఉన్నారు: బాల‌య్య

వైసీపీ ఎమ్మెల్యేలు కొంద‌రు మంత్రులు టీడీపీకి ట‌చ్‌లో ఉన్నార‌ని హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నాయ కుడు, న‌టుడు బాల‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మ‌రికొంద‌రు త‌న‌తో కూడా ట‌చ్‌లో ఉన్నార‌ని చెప్పారు. వారంతా వ‌చ్చి.. టీడీపీతో క‌లిసి ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌ని భావిస్తున్నార‌ని బాల‌య్య చెప్పారు. టీడీపీ యువ‌నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేస్తున్న యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో బాల‌య్య పాల్గొన్నారు.

శుక్ర‌వారం ఉద‌యం అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం గార్ల దిన్నెమండలంలో మార్తాడులో యువ‌గ‌ళం పాద‌యాత్ర ప్రారంభ‌మైంది. ఈ పాద‌యాత్ర‌కు బాల‌య్య సంఘీభావం తెలిపారు. తొలుత ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ప‌బ్జీ ఆడుకోవ‌డం త‌ప్ప ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు ఏమీ తెలియ‌ద‌ని బాల‌కృష్ణ విమ‌ర్శించారు. దీంతో పాల‌న లేకుండా పోయింద‌ని అన్నారు.

వైసీపీ ఎమ్మెల్యేల్లో తీవ్ర అసంతృప్తి నెల‌కొంద‌ని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు, మంత్రుల‌కు ఫ్రీ హ్యాండ్ లేద‌ని, వారి మాట‌కు అస‌లు విలువేలేద‌ని బాల‌య్య చెప్పారు. ఇప్ప‌టికిప్పుడు టీడీపీ గేట్లు తెరిస్తే.. 60 నుంచి 80 మంది వ‌ర‌కు టీడీపీలోకి వ‌చ్చేస్తార‌ని చెప్పారు. ఎవ‌రినైనా బెదిరించ‌వ‌చ్చని జ‌గ‌న్ భావిస్తున్నార‌ని.. కానీ, త‌మ ద‌గ్గ‌ర జ‌గ‌న్ ఆట‌లు సాగ‌బోవ‌ని చెప్పారు. ఏపీలో అస‌మ‌ర్థ‌, చెత్త పాల‌న సాగుతోంద‌ని అన్నారు.

రాష్ట్రంలో అభివృద్ధి లేదని, ప‌రిశ్ర‌మ‌లు రాక‌పోగా.. ఉన్న‌వి కూడా పోతున్నాయ‌ని బాల‌య్య చెప్పారు. అమ‌రావ‌తి రైతులు.. రాష్ట్ర రాజ‌ధానికోసం ఉద్య‌మిస్తుంటే.. వారిపైనా దాడులు చేస్తున్నార‌ని, వారిపై కేసులు పెడుతున్నార‌ని అన్నారు. ఇంత‌క‌న్నా దారుణం ఉంటుందా? అని ప్ర‌శ్నించారు. ఏపీ త్వ‌ర‌లోనే మ‌రో శ్రీలంక అవుతుంద‌ని వ్యాఖ్యానించారు. అధికారంలోకి మ‌రోసారి సైకో జ‌గ‌న్ వ‌స్తే.. రాష్ట్ర ప్ర‌జ‌లు పొరుగు రాష్ట్రాల‌కు వ‌ల‌స పోతార‌ని అన్నారు.

This post was last modified on April 7, 2023 12:51 pm

Share

Recent Posts

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

1 hour ago

మమిత బైజు – వయసు తక్కువా… హిట్లు ఎక్కువ!

ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…

2 hours ago

కేరళం ప్రకృతి వైద్యానికి పవన్ ప్రాధాన్యత

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…

2 hours ago

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

4 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

5 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

5 hours ago