Political News

వైసీపీ ఎమ్మెల్యేలు నాతో కూడా ట‌చ్‌లో ఉన్నారు: బాల‌య్య

వైసీపీ ఎమ్మెల్యేలు కొంద‌రు మంత్రులు టీడీపీకి ట‌చ్‌లో ఉన్నార‌ని హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నాయ కుడు, న‌టుడు బాల‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మ‌రికొంద‌రు త‌న‌తో కూడా ట‌చ్‌లో ఉన్నార‌ని చెప్పారు. వారంతా వ‌చ్చి.. టీడీపీతో క‌లిసి ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌ని భావిస్తున్నార‌ని బాల‌య్య చెప్పారు. టీడీపీ యువ‌నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేస్తున్న యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో బాల‌య్య పాల్గొన్నారు.

శుక్ర‌వారం ఉద‌యం అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం గార్ల దిన్నెమండలంలో మార్తాడులో యువ‌గ‌ళం పాద‌యాత్ర ప్రారంభ‌మైంది. ఈ పాద‌యాత్ర‌కు బాల‌య్య సంఘీభావం తెలిపారు. తొలుత ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ప‌బ్జీ ఆడుకోవ‌డం త‌ప్ప ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు ఏమీ తెలియ‌ద‌ని బాల‌కృష్ణ విమ‌ర్శించారు. దీంతో పాల‌న లేకుండా పోయింద‌ని అన్నారు.

వైసీపీ ఎమ్మెల్యేల్లో తీవ్ర అసంతృప్తి నెల‌కొంద‌ని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు, మంత్రుల‌కు ఫ్రీ హ్యాండ్ లేద‌ని, వారి మాట‌కు అస‌లు విలువేలేద‌ని బాల‌య్య చెప్పారు. ఇప్ప‌టికిప్పుడు టీడీపీ గేట్లు తెరిస్తే.. 60 నుంచి 80 మంది వ‌ర‌కు టీడీపీలోకి వ‌చ్చేస్తార‌ని చెప్పారు. ఎవ‌రినైనా బెదిరించ‌వ‌చ్చని జ‌గ‌న్ భావిస్తున్నార‌ని.. కానీ, త‌మ ద‌గ్గ‌ర జ‌గ‌న్ ఆట‌లు సాగ‌బోవ‌ని చెప్పారు. ఏపీలో అస‌మ‌ర్థ‌, చెత్త పాల‌న సాగుతోంద‌ని అన్నారు.

రాష్ట్రంలో అభివృద్ధి లేదని, ప‌రిశ్ర‌మ‌లు రాక‌పోగా.. ఉన్న‌వి కూడా పోతున్నాయ‌ని బాల‌య్య చెప్పారు. అమ‌రావ‌తి రైతులు.. రాష్ట్ర రాజ‌ధానికోసం ఉద్య‌మిస్తుంటే.. వారిపైనా దాడులు చేస్తున్నార‌ని, వారిపై కేసులు పెడుతున్నార‌ని అన్నారు. ఇంత‌క‌న్నా దారుణం ఉంటుందా? అని ప్ర‌శ్నించారు. ఏపీ త్వ‌ర‌లోనే మ‌రో శ్రీలంక అవుతుంద‌ని వ్యాఖ్యానించారు. అధికారంలోకి మ‌రోసారి సైకో జ‌గ‌న్ వ‌స్తే.. రాష్ట్ర ప్ర‌జ‌లు పొరుగు రాష్ట్రాల‌కు వ‌ల‌స పోతార‌ని అన్నారు.

This post was last modified on April 7, 2023 12:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీలో ఈసారి ఉగాది పండగా మాత్రమే కాదు

తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రాది ఉగాది మ‌రో 20 రోజుల్లో రానుంది. ఏటా వ‌చ్చే పండుగే క‌దా.. ఏముంది ?…

55 minutes ago

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

4 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

4 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

6 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

6 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

7 hours ago