తెలంగాణ రాష్ట్రం తాగుబోతుల చేతుల్లో ఉందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదోతరగతి హిందీ పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ను పోలీసులు అరెస్టు చేయడం.. తెలిసిందే. అయితే.. గురువారం రాత్రి పొద్దు పోయాక ఆయనకు హనుమకొండ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో జైలు నుంచి బయటకు వచ్చిన సంజయ్ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపైనా తీవ్ర విమర్శలు చేశా రు.అ దేసమయంలో కరీంనగర్ పోలీసు కమిషనర్పైనా విమర్శలు గుప్పించారు. హిందీ పేపర్ ఎవరైనా లీకు చేస్తారా? అని సంజయ్ ప్రశ్నించారు. ఒక వేళ హిందీ పేపర్ లీకు చేసింది తామైతే.. తెలుగు పేపర్ లీకు చేసింది ఎవరని నిలదీశారు. కేసీఆర్ కుటుంబంలోనే.. లీకు వీరులు, లిక్కరు వీరులు ఉన్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కూతురు కవిత, కొడుకు కేటీఆర్..లు త్వరలోనే జైలుకు పోతారని అన్నారు.
కేసీఆర్ను నయాం నిజాంగా అభివర్ణించిన బండి సంజయ్ ఆయనను త్వరలోనే తరిమి కొడతామన్నారు. పేపర్ లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా మంత్రి కేటీఆర్పైనా విచారణ జరిపించాలని, ఆయనను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని అన్నారు. పేపర్ లీక్ కారణంగా నష్టపోయిన నిరుద్యోగులకు(టీఎస్ పీఎస్సీ) రూ. లక్ష పరిహారం ఇవ్వాలన్నారు. లవంగానికి, తంబాకుకు తేడా తెలియనివ్యక్తి కేటీఆర్ అని విమర్శించారు.
కేసీఆర్ నియంత పాలనతో ప్రజలు విసిగిపోయారని బండి దుయ్యబట్టారు. కేసీఆర్పై పోరాటానికి బీజేపీ కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. యుద్ధానికి సిద్ధమని ప్రకటించారు. ఇక, కరీంనగర్ సీపీపైనా బండి విమర్శలు గుప్పించారు. పేపర్ లీక్కు, మాల్ ప్రాక్టీస్కు తేడా తెలియడం లేదా? అని నిలదీశారు. సీపీ తన టోపీపై ఉన్న మూడు సింహాలపై ప్రమాణం చేసి.. తాను చెప్పింది నిజమని చెప్పాలని డిమాండ్ చేశారు. తనకు లీకేజీతో సంబంధం లేదని ప్రమాణం చేస్తున్నానని బండి వ్యాఖ్యానించారు. వరంగల్ సీపీపై ధిక్కరణ వ్యాజ్యం వేస్తామన్నారు.
This post was last modified on April 7, 2023 10:54 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…