తెలంగాణ రాష్ట్రం తాగుబోతుల చేతుల్లో ఉందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదోతరగతి హిందీ పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ను పోలీసులు అరెస్టు చేయడం.. తెలిసిందే. అయితే.. గురువారం రాత్రి పొద్దు పోయాక ఆయనకు హనుమకొండ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో జైలు నుంచి బయటకు వచ్చిన సంజయ్ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపైనా తీవ్ర విమర్శలు చేశా రు.అ దేసమయంలో కరీంనగర్ పోలీసు కమిషనర్పైనా విమర్శలు గుప్పించారు. హిందీ పేపర్ ఎవరైనా లీకు చేస్తారా? అని సంజయ్ ప్రశ్నించారు. ఒక వేళ హిందీ పేపర్ లీకు చేసింది తామైతే.. తెలుగు పేపర్ లీకు చేసింది ఎవరని నిలదీశారు. కేసీఆర్ కుటుంబంలోనే.. లీకు వీరులు, లిక్కరు వీరులు ఉన్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కూతురు కవిత, కొడుకు కేటీఆర్..లు త్వరలోనే జైలుకు పోతారని అన్నారు.
కేసీఆర్ను నయాం నిజాంగా అభివర్ణించిన బండి సంజయ్ ఆయనను త్వరలోనే తరిమి కొడతామన్నారు. పేపర్ లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా మంత్రి కేటీఆర్పైనా విచారణ జరిపించాలని, ఆయనను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని అన్నారు. పేపర్ లీక్ కారణంగా నష్టపోయిన నిరుద్యోగులకు(టీఎస్ పీఎస్సీ) రూ. లక్ష పరిహారం ఇవ్వాలన్నారు. లవంగానికి, తంబాకుకు తేడా తెలియనివ్యక్తి కేటీఆర్ అని విమర్శించారు.
కేసీఆర్ నియంత పాలనతో ప్రజలు విసిగిపోయారని బండి దుయ్యబట్టారు. కేసీఆర్పై పోరాటానికి బీజేపీ కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. యుద్ధానికి సిద్ధమని ప్రకటించారు. ఇక, కరీంనగర్ సీపీపైనా బండి విమర్శలు గుప్పించారు. పేపర్ లీక్కు, మాల్ ప్రాక్టీస్కు తేడా తెలియడం లేదా? అని నిలదీశారు. సీపీ తన టోపీపై ఉన్న మూడు సింహాలపై ప్రమాణం చేసి.. తాను చెప్పింది నిజమని చెప్పాలని డిమాండ్ చేశారు. తనకు లీకేజీతో సంబంధం లేదని ప్రమాణం చేస్తున్నానని బండి వ్యాఖ్యానించారు. వరంగల్ సీపీపై ధిక్కరణ వ్యాజ్యం వేస్తామన్నారు.
This post was last modified on April 7, 2023 10:54 am
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…