తెలంగాణ రాష్ట్రం తాగుబోతుల చేతుల్లో ఉందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదోతరగతి హిందీ పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ను పోలీసులు అరెస్టు చేయడం.. తెలిసిందే. అయితే.. గురువారం రాత్రి పొద్దు పోయాక ఆయనకు హనుమకొండ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో జైలు నుంచి బయటకు వచ్చిన సంజయ్ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపైనా తీవ్ర విమర్శలు చేశా రు.అ దేసమయంలో కరీంనగర్ పోలీసు కమిషనర్పైనా విమర్శలు గుప్పించారు. హిందీ పేపర్ ఎవరైనా లీకు చేస్తారా? అని సంజయ్ ప్రశ్నించారు. ఒక వేళ హిందీ పేపర్ లీకు చేసింది తామైతే.. తెలుగు పేపర్ లీకు చేసింది ఎవరని నిలదీశారు. కేసీఆర్ కుటుంబంలోనే.. లీకు వీరులు, లిక్కరు వీరులు ఉన్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కూతురు కవిత, కొడుకు కేటీఆర్..లు త్వరలోనే జైలుకు పోతారని అన్నారు.
కేసీఆర్ను నయాం నిజాంగా అభివర్ణించిన బండి సంజయ్ ఆయనను త్వరలోనే తరిమి కొడతామన్నారు. పేపర్ లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా మంత్రి కేటీఆర్పైనా విచారణ జరిపించాలని, ఆయనను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని అన్నారు. పేపర్ లీక్ కారణంగా నష్టపోయిన నిరుద్యోగులకు(టీఎస్ పీఎస్సీ) రూ. లక్ష పరిహారం ఇవ్వాలన్నారు. లవంగానికి, తంబాకుకు తేడా తెలియనివ్యక్తి కేటీఆర్ అని విమర్శించారు.
కేసీఆర్ నియంత పాలనతో ప్రజలు విసిగిపోయారని బండి దుయ్యబట్టారు. కేసీఆర్పై పోరాటానికి బీజేపీ కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. యుద్ధానికి సిద్ధమని ప్రకటించారు. ఇక, కరీంనగర్ సీపీపైనా బండి విమర్శలు గుప్పించారు. పేపర్ లీక్కు, మాల్ ప్రాక్టీస్కు తేడా తెలియడం లేదా? అని నిలదీశారు. సీపీ తన టోపీపై ఉన్న మూడు సింహాలపై ప్రమాణం చేసి.. తాను చెప్పింది నిజమని చెప్పాలని డిమాండ్ చేశారు. తనకు లీకేజీతో సంబంధం లేదని ప్రమాణం చేస్తున్నానని బండి వ్యాఖ్యానించారు. వరంగల్ సీపీపై ధిక్కరణ వ్యాజ్యం వేస్తామన్నారు.
This post was last modified on April 7, 2023 10:54 am
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…