Political News

మోదీ.. సెటైర్ కు రెడీ

ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. శనివారం ఆయన వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భాగ్యనగరానికి వస్తున్నారు. సాధారణంగా అయితే అది రొటీన్ పర్యటన అయినా.. తాజా పరిణామాలు మాత్రం కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. టెన్త్ పేపర్ లీక్ పేరుతో టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్టు చేయడం, రెండు రోజుల్లోనే ఆయనకు బెయిల్ రావడం లాంటి పరిణామాల మధ్య మోదీ కామెంట్స్, ప్రధాని బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందోనని అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు..

తెలంగాణలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. పైగా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పెద్ద గేమ్ ప్లానే జరుగుతోంది.పైగా బీజేపీ, బీఆర్ఎస్ మధ్య కేసుల వార్ నడుస్తోంది. ఫార్మ్ హౌస్ కేసు చప్పబిడినట్లే కనిపించినా ఇప్పుడు పేపర్ లీకేజీ కేసులో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అటు పక్క ఢిల్లీ లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవితను సీబీఐ, ఈడీ బిగిస్తున్నాయన్న వార్తలు వస్తున్నాయి. ఈడీ ఇప్పటికే ఆమె స్వయంగా సమర్పించిన పది సెల్ ఫోన్ల డేటాను విశ్లేషిస్తోంది.

సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ రైలు ప్రారంభోత్సవం సహా పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మోదీ వస్తున్నారు. భారీ బహిరంగ సభకు తెలంగాణ బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. స్పీచ్ అదరగొట్టడం,సెటైర్లతో కడుపుబ్బ నవ్వించడంలో మోదీ దిట్ట అని చెప్పాలి. పైగా ఇటీవలి కాలంలో ప్రధానమంత్రిని ఆహ్వానించే ప్రోటోకాల్ సైతం కేసీఆర్ పాటించడం లేదు. దానితో మోదీ ఎలాంటి డైలాగులు కొడతారోనని తెలుగు రాష్ట్రాల జనం ఎదురు చూస్తున్నారు. పైగా మోదీ రాకతో ఎన్నికల సమర శంఖారావం పూరించాలని బీజేపీ డిసైడైంది. అంటే ఇక దబిడి దిబిడేనన్నమాట..

This post was last modified on April 7, 2023 10:44 am

Share

Recent Posts

మమిత బైజు – వయసు తక్కువా… హిట్లు ఎక్కువ!

ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…

46 minutes ago

కేరళం ప్రకృతి వైద్యానికి పవన్ ప్రాధాన్యత

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…

51 minutes ago

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

3 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

4 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

4 hours ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

4 hours ago