ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. శనివారం ఆయన వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భాగ్యనగరానికి వస్తున్నారు. సాధారణంగా అయితే అది రొటీన్ పర్యటన అయినా.. తాజా పరిణామాలు మాత్రం కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. టెన్త్ పేపర్ లీక్ పేరుతో టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్టు చేయడం, రెండు రోజుల్లోనే ఆయనకు బెయిల్ రావడం లాంటి పరిణామాల మధ్య మోదీ కామెంట్స్, ప్రధాని బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందోనని అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు..
తెలంగాణలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. పైగా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పెద్ద గేమ్ ప్లానే జరుగుతోంది.పైగా బీజేపీ, బీఆర్ఎస్ మధ్య కేసుల వార్ నడుస్తోంది. ఫార్మ్ హౌస్ కేసు చప్పబిడినట్లే కనిపించినా ఇప్పుడు పేపర్ లీకేజీ కేసులో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అటు పక్క ఢిల్లీ లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవితను సీబీఐ, ఈడీ బిగిస్తున్నాయన్న వార్తలు వస్తున్నాయి. ఈడీ ఇప్పటికే ఆమె స్వయంగా సమర్పించిన పది సెల్ ఫోన్ల డేటాను విశ్లేషిస్తోంది.
సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ రైలు ప్రారంభోత్సవం సహా పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మోదీ వస్తున్నారు. భారీ బహిరంగ సభకు తెలంగాణ బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. స్పీచ్ అదరగొట్టడం,సెటైర్లతో కడుపుబ్బ నవ్వించడంలో మోదీ దిట్ట అని చెప్పాలి. పైగా ఇటీవలి కాలంలో ప్రధానమంత్రిని ఆహ్వానించే ప్రోటోకాల్ సైతం కేసీఆర్ పాటించడం లేదు. దానితో మోదీ ఎలాంటి డైలాగులు కొడతారోనని తెలుగు రాష్ట్రాల జనం ఎదురు చూస్తున్నారు. పైగా మోదీ రాకతో ఎన్నికల సమర శంఖారావం పూరించాలని బీజేపీ డిసైడైంది. అంటే ఇక దబిడి దిబిడేనన్నమాట..
This post was last modified on April 7, 2023 10:44 am
ఎవరు ఔనన్నా కాదన్నా అఖండ తాండవం 2 బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న వైనం స్పష్టం. కొన్ని ఏరియాల్లో డీసెంట్ గా…
నిన్న జరిగిన రాజా సాబ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ తర్వాత హీరోయిన్ నిధి అగర్వాల్ పట్ల అభిమానులు ప్రవర్తించిన తీరు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడు. మెగాస్టార్ చిరంజీవి బ్రేక్ తీసుకున్నాక నంబర్ వన్ స్థానం…
కెరీర్లో ఎన్నడూ లేని విధంగా సుదీర్ఘ విరామం తీసుకున్న మంచు మనోజ్.. ఈ ఏడాదే రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.…
ఒకప్పుడు మలయాళ ఫిలిం ఇండస్ట్రీ టాప్ హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగాడు దిలీప్. మోహన్ లాల్, మమ్ముట్టిల తర్వాత…
‘పవన్ కల్యాణ్ డిఫరెంట్ ఫీల్డ్ నుంచి వచ్చారు. స్ట్రగుల్ అవుతున్నారు. అయినా బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారు’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు…