వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ మందగించినట్లే కనిపించినా గుట్టుచప్పుడు కాకుండా వేగం పుంజుకుందని తెలుస్తోంది. దర్యాప్తు అధికారి రామ్ సింగ్ ను మార్చివేసి కొత్త సిట్ కు సీబీఐ డీఐజీ కే.ఆర్. చౌరసియాను చీఫ్ గా నియమించిన తర్వాత ఆయన చకచకా పనులు చేసుకుపోతున్నారు. ఎక్కడా మీడియాకు లీకులు ఇవ్వకుండా గుట్టు చప్పుడు కాకుండా పని కానిచ్చేస్తున్నారు. ఏప్రిల్ 30లోగా దర్యాప్తు పూర్తి చేయాలని, ఆరు నెలల్లో ట్రయల్ ప్రారంభించాలని న్యాయస్థానం ఆదేశించిన మరుసటి రోజే సిట్ తన పనులను ప్రారంభించింది..
అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి సమన్లు ఇవ్వడం, వారి రావడం, లేదా టైమ్ అడగటం లాంటి పనులు వెంటనే జరిగితే మీడియా ప్రచారం తప్ప కేసు ముందుకు సాగడం లేదని చౌరసియా భావిస్తున్నారట. అందుకే కామ్ గా పనులు కానిచ్చేయ్యాలని డిసైడయ్యారట. అవినాష్ కు మలి దఫా సమన్లు ఇచ్చే లోపు పూర్తి ఎవెడెన్స్ సేకరించి ముందుకు సాగాలనుకుంటున్నారట. సీబీఐ అధికారులు కొందరు కడప, పులివెందుల వచ్చి వెళ్లినా బయటకు పొక్క కుండా చూసుకున్నారని చెబుతున్నారు..
సీబీఐ కొత్త రకం దూకుడు జగన్, అవినాష్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో వారు కొంత మేర టెన్షన్ అవుతున్నారని వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. అవినాష్ రెడ్డి నేరుగా ఢిల్లీ నుంచి తాడేపల్లి ప్యాలెస్ కు చేరుకుని జగన్, ఆయన భార్య భారతీ రెడ్డితో మంతనాలు జరపారు. సీబీఐ పిలిస్తే ఏం చెప్పాలి, పరస్పర విరుద్ధమైన స్టేట్ మెంట్స్ రాకుండా ఎలా చూసుకోవాలని చర్చించినట్లు సమాచారం. న్యాయస్థానానికి సీబీఐ సమర్పించిన అఫిడవిట్లో అవినాష్ రెడ్డిపై చేసిన ఆరోపణలు, దర్యాప్తు సంస్థ అనుమానాలను ఎలా తిప్పికొట్టాలో చర్చించారు.
భారతీ రెడ్డి సహాయకుడిని సీబీఐ ఓ సారి ప్రశ్నించిన నేపథ్యంలో మరో సారి పిలిస్తే ఏం చేయాలో కూడా చర్చించారు. జగన్ రెడ్డి రెండు సార్లు ఢిల్లీ వెళ్లినప్పుడు అక్కడి పెద్దలతో మాట్లాడిన అంశాలు మాత్రం చర్చకు రాలేదని తెలుస్తోంది. అయితే ఏం జరిగినా తాను చూసుకుంటానని భయపడవద్దని జగన్ అభయ హస్తం ఇచ్చారట. తాడేపల్లి ప్యాలెస్ వర్గాలు మాత్రం ఈ భేటీపై ఎలాంటి వ్యాఖ్య చేయడం లేదు. అన్నదమ్ములు కలిస్తే తప్పేముందంటూ మాట దాట వేస్తున్నారట..
This post was last modified on April 7, 2023 9:26 am
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…