వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ మందగించినట్లే కనిపించినా గుట్టుచప్పుడు కాకుండా వేగం పుంజుకుందని తెలుస్తోంది. దర్యాప్తు అధికారి రామ్ సింగ్ ను మార్చివేసి కొత్త సిట్ కు సీబీఐ డీఐజీ కే.ఆర్. చౌరసియాను చీఫ్ గా నియమించిన తర్వాత ఆయన చకచకా పనులు చేసుకుపోతున్నారు. ఎక్కడా మీడియాకు లీకులు ఇవ్వకుండా గుట్టు చప్పుడు కాకుండా పని కానిచ్చేస్తున్నారు. ఏప్రిల్ 30లోగా దర్యాప్తు పూర్తి చేయాలని, ఆరు నెలల్లో ట్రయల్ ప్రారంభించాలని న్యాయస్థానం ఆదేశించిన మరుసటి రోజే సిట్ తన పనులను ప్రారంభించింది..
అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి సమన్లు ఇవ్వడం, వారి రావడం, లేదా టైమ్ అడగటం లాంటి పనులు వెంటనే జరిగితే మీడియా ప్రచారం తప్ప కేసు ముందుకు సాగడం లేదని చౌరసియా భావిస్తున్నారట. అందుకే కామ్ గా పనులు కానిచ్చేయ్యాలని డిసైడయ్యారట. అవినాష్ కు మలి దఫా సమన్లు ఇచ్చే లోపు పూర్తి ఎవెడెన్స్ సేకరించి ముందుకు సాగాలనుకుంటున్నారట. సీబీఐ అధికారులు కొందరు కడప, పులివెందుల వచ్చి వెళ్లినా బయటకు పొక్క కుండా చూసుకున్నారని చెబుతున్నారు..
సీబీఐ కొత్త రకం దూకుడు జగన్, అవినాష్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో వారు కొంత మేర టెన్షన్ అవుతున్నారని వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. అవినాష్ రెడ్డి నేరుగా ఢిల్లీ నుంచి తాడేపల్లి ప్యాలెస్ కు చేరుకుని జగన్, ఆయన భార్య భారతీ రెడ్డితో మంతనాలు జరపారు. సీబీఐ పిలిస్తే ఏం చెప్పాలి, పరస్పర విరుద్ధమైన స్టేట్ మెంట్స్ రాకుండా ఎలా చూసుకోవాలని చర్చించినట్లు సమాచారం. న్యాయస్థానానికి సీబీఐ సమర్పించిన అఫిడవిట్లో అవినాష్ రెడ్డిపై చేసిన ఆరోపణలు, దర్యాప్తు సంస్థ అనుమానాలను ఎలా తిప్పికొట్టాలో చర్చించారు.
భారతీ రెడ్డి సహాయకుడిని సీబీఐ ఓ సారి ప్రశ్నించిన నేపథ్యంలో మరో సారి పిలిస్తే ఏం చేయాలో కూడా చర్చించారు. జగన్ రెడ్డి రెండు సార్లు ఢిల్లీ వెళ్లినప్పుడు అక్కడి పెద్దలతో మాట్లాడిన అంశాలు మాత్రం చర్చకు రాలేదని తెలుస్తోంది. అయితే ఏం జరిగినా తాను చూసుకుంటానని భయపడవద్దని జగన్ అభయ హస్తం ఇచ్చారట. తాడేపల్లి ప్యాలెస్ వర్గాలు మాత్రం ఈ భేటీపై ఎలాంటి వ్యాఖ్య చేయడం లేదు. అన్నదమ్ములు కలిస్తే తప్పేముందంటూ మాట దాట వేస్తున్నారట..
This post was last modified on April 7, 2023 9:26 am
ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయడం అన్నది పెద్ద రిస్క్గా మారిపోయిన మాట వాస్తవం. ఇంటర్నెట్, ఓటీటీల విప్లవం వల్ల…
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…