Political News

చాప కింద నీరులా సిట్ ..అవినాష్ కు టెన్షన్

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ మందగించినట్లే కనిపించినా గుట్టుచప్పుడు కాకుండా వేగం పుంజుకుందని తెలుస్తోంది. దర్యాప్తు అధికారి రామ్ సింగ్ ను మార్చివేసి కొత్త సిట్ కు సీబీఐ డీఐజీ కే.ఆర్. చౌరసియాను చీఫ్ గా నియమించిన తర్వాత ఆయన చకచకా పనులు చేసుకుపోతున్నారు. ఎక్కడా మీడియాకు లీకులు ఇవ్వకుండా గుట్టు చప్పుడు కాకుండా పని కానిచ్చేస్తున్నారు. ఏప్రిల్ 30లోగా దర్యాప్తు పూర్తి చేయాలని, ఆరు నెలల్లో ట్రయల్ ప్రారంభించాలని న్యాయస్థానం ఆదేశించిన మరుసటి రోజే సిట్ తన పనులను ప్రారంభించింది..

అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి సమన్లు ఇవ్వడం, వారి రావడం, లేదా టైమ్ అడగటం లాంటి పనులు వెంటనే జరిగితే మీడియా ప్రచారం తప్ప కేసు ముందుకు సాగడం లేదని చౌరసియా భావిస్తున్నారట. అందుకే కామ్ గా పనులు కానిచ్చేయ్యాలని డిసైడయ్యారట. అవినాష్ కు మలి దఫా సమన్లు ఇచ్చే లోపు పూర్తి ఎవెడెన్స్ సేకరించి ముందుకు సాగాలనుకుంటున్నారట. సీబీఐ అధికారులు కొందరు కడప, పులివెందుల వచ్చి వెళ్లినా బయటకు పొక్క కుండా చూసుకున్నారని చెబుతున్నారు..

సీబీఐ కొత్త రకం దూకుడు జగన్, అవినాష్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో వారు కొంత మేర టెన్షన్ అవుతున్నారని వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. అవినాష్ రెడ్డి నేరుగా ఢిల్లీ నుంచి తాడేపల్లి ప్యాలెస్ కు చేరుకుని జగన్, ఆయన భార్య భారతీ రెడ్డితో మంతనాలు జరపారు. సీబీఐ పిలిస్తే ఏం చెప్పాలి, పరస్పర విరుద్ధమైన స్టేట్ మెంట్స్ రాకుండా ఎలా చూసుకోవాలని చర్చించినట్లు సమాచారం. న్యాయస్థానానికి సీబీఐ సమర్పించిన అఫిడవిట్లో అవినాష్ రెడ్డిపై చేసిన ఆరోపణలు, దర్యాప్తు సంస్థ అనుమానాలను ఎలా తిప్పికొట్టాలో చర్చించారు.

భారతీ రెడ్డి సహాయకుడిని సీబీఐ ఓ సారి ప్రశ్నించిన నేపథ్యంలో మరో సారి పిలిస్తే ఏం చేయాలో కూడా చర్చించారు. జగన్ రెడ్డి రెండు సార్లు ఢిల్లీ వెళ్లినప్పుడు అక్కడి పెద్దలతో మాట్లాడిన అంశాలు మాత్రం చర్చకు రాలేదని తెలుస్తోంది. అయితే ఏం జరిగినా తాను చూసుకుంటానని భయపడవద్దని జగన్ అభయ హస్తం ఇచ్చారట. తాడేపల్లి ప్యాలెస్ వర్గాలు మాత్రం ఈ భేటీపై ఎలాంటి వ్యాఖ్య చేయడం లేదు. అన్నదమ్ములు కలిస్తే తప్పేముందంటూ మాట దాట వేస్తున్నారట..

This post was last modified on April 7, 2023 9:26 am

Share

Recent Posts

రామాయ‌ణం.. ర‌ణ‌బీర్… ర‌బ్బ‌ర్ చెప్పులు

పురాణ గాథ‌ల‌ను తెర‌కెక్కించేట‌పుడు ఎన్నో ఇబ్బందులుంటాయి. అప్ప‌టి వాతావ‌ర‌ణాన్ని తెర‌పైకి తీసుకురావ‌డం అంత తేలిక కాదు. ప్రతి చిన్న విష‌యం…

1 hour ago

జ‌గ‌న్ భద్రతపై వైసీపీ నేతల ఆందోళన

వైసీపీ అధినేత జ‌గ‌న్ తాజాగా బుధ‌వారం తూర్పుగోదావ‌రి జిల్లా దేవ‌ర‌ప‌ల్లిలో ప‌ర్య‌టించారు. ఇక్క‌డి పొగాకు రైతుల‌ను ఆయ‌న ప‌రామ‌ర్శించారు. తొలుత…

1 hour ago

ఆన్ లైన్లో తండ్రి అంత్యక్రియలకు హాజరు

రోజులు మారిపోయాయి. బంధాలు, అనుబంధాలు అన్నీ ఆన్ లైన్ అయిపోయాయి. ఆకలైనప్పుడు ఆహారం, అనారోగ్యంగా వున్నప్పుడు మందులు ఆన్ లైన్లో…

1 hour ago

దర్శకుడు చనిపోయినా సినిమా బ్రతుకుతోంది

ప్రపంచంలో ఏ భాషలో అయినా సినిమా గొప్పదనం ఒకటుంది. మనుషులు భౌతికంగా ఉన్నా లేకపోయినా వాళ్ళను దశాబ్దాల తరబడి గుర్తుంచుకునేలా…

2 hours ago

రాజ్యసభలో జగన్ కేసులను ప్రస్తావించిన టీడీపీ యువ రక్తం

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఇంకా మూలుగుతూనే…

2 hours ago

గప్‌చుప్ ఉంటే ఎలా నాయుడు గారూ

ఎల్లుండి విడుదల కాబోతున్న చిత్రాల్లో అందరి దృష్టి కొరియన్ కనకరాజు మీదే ఉంది. కొద్దో గొప్పో తమిళ దర్శకుడు లోకేష్…

6 hours ago