తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్కు భారీ ఊరట లభించింది. 10వ తరగతి హిందీ పేపర్ లీక్ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న బండి సంజయ్కు హనుమకొండ కోర్టు బుధవారం 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా గురువారం అదే కోర్టులో బండి సంజయ్ తరఫున న్యాయవాదులు.. బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన కోర్టు.. బెయిల్ మంజూరు చేసింది. అయితే.. దీనికి ముందు రోజు రోజంతా కూడా.. హైకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
హనుమకొండ కోర్టు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ.. బండి సంజయ్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై గురువారం అత్యవసర విచారణ చేపట్టారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా అక్రమంగా అరెస్టు చేశారని.. సీఆర్పీసీ 41ఏ నోటీసు ఇవ్వలేదని పిటిషన్లో బండి సంజయ్ పేర్కొన్నారు. కిలోమీటర్ల మేర వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ శారీరకంగా మానసికంగా వేధించారని.. పోలీసుల దాడిలో కాలికి, చేతికి గాయాలు కూడా అయ్యాయని పిటిషన్లో వివరించారు.
ప్రశ్నపత్రం బయటకు వచ్చిన ఘటనతో తనకెలాంటి సంబంధం లేదన్నారు. ప్రభుత్వ అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాడుతున్నందునే అక్రమంగా కేసులో ఇరికించారని పిటిషన్లో పేర్కొన్నా రు. ఈ నెల 8 న ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అక్రమంగా అరెస్టు చేశారన్నారు. అరెస్టు విషయం లోక్సభ స్పీకర్కు సమాచారం కూడా ఇవ్వలేదన్నారు.
బండి సంజయ్ తరఫున సీనియర్ న్యాయవాది, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచంద్రరావు వాదించారు. ప్రధాని పర్యటనలో పాల్గొనేందుకు వీలుగా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. రిమాండ్ రద్దు చేయాలన్న పిటిషన్లో బెయిల్ ఎలా ఇవ్వగలమని హైకోర్టు ప్రశ్నించింది. ప్రత్యేకంగా వేరే బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చునని.. అవసరమైతే హౌజ్ మోషన్ వేయవచ్చని కోర్టు తెలిపింది.
ప్రభుత్వ వాదన ఇదీ..
ప్రశ్నపత్రాలు బయటకు రావడం వెనక ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే భారీ కుట్ర ఉందని.. బండి సంజయ్ ప్రమేయంపై ఆధారాలున్నాయని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదించారు. అయితే.. ఎఫ్ఐఆర్లో బండి సంజయ్పై నిర్దిష్ట అభియోగాలేమీ లేవు కదా అని హైకోర్టు ప్రశ్నించింది. ఆయన ప్రమేయంపై ఎలక్ట్రానిక్ ఆధారాలు ఉన్నాయని తెలిపింది.
పంపిస్తే.. తప్పేంటి? : హైకోర్టు
పబ్లిక్ డొమైన్లో ఉన్న సమాచారాన్ని ప్రతిపక్ష నేతగా ఇతరులకు పంపిస్తే తప్పేంటని హైకోర్టు అడిగింది. పరీక్షలను దెబ్బతీసేందుకు ఇతర నిందితులను బండి సంజయ్ ప్రోత్సహించారని ఏజీ వివరించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వంతో పాటు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రధానోపాధ్యాయుడికి నోటీసులు జారీ చేసింది.
This post was last modified on April 7, 2023 8:16 am
తమిళంలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పార్తీబన్కు గొప్ప పేరే ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ ప్రయాణం కొనసాగుతోంది.…
భయపడినట్టే జరిగింది. దురంధర్ ది రివెంజ్ తెలుగు ప్రీమియర్లు క్యాన్సిలయ్యాయని ట్రేడ్ టాక్. పివిఆర్ ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్సులు ఇప్పటికే…
ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…
మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…
'మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్రెడ్డి విషయం మాజీ…
వైసీపీ అధినేత జగన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయనకు పెద్ద చిక్కు వచ్చింది.…