Political News

సమస్యగా మారిన పేపర్ల లీకేజి

మూలిగే నక్క పై తాటిపండు పడటం అనే సామెత తెలంగాణా ప్రభుత్వానికి సరిగ్గా సరిపోతుంది. ఇప్పటికే టీఎస్ పీఎస్సీ బోర్డు నిర్వహించిన పరీక్షల పేపర్ల లీకేజీ వ్యవహారం గట్టిగా కేసీయార్ మెడకు చుట్టుకునేసింది. ఇందులో నుండి ఎలా బయటపడాలో అర్ధంకాక కేసీయార్ నానా అవస్తలు పడుతున్నారు. ఇటువంటి సమయంలోనే పదవ తరగతి పరీక్షల ప్రశ్నపత్రాలు కూడా లీకవుతుండటంతో ఏమిచేయాలో దిక్కుతోస్తున్నట్లు లేదు. ఇప్పటికి రెండు పరీక్షలు జరిగితే రెండు ప్రశ్నపేపర్లూ లీకయ్యాయి.

విచిత్రం ఏమిటంటే పరీక్ష మొదలైన పదినిముషాల్లోపే రెండు ప్రశ్నపత్రాలు కూడా బయటకు వచ్చేయటమే. ప్రశ్నపత్రాలు లీకేజీలను మొదట ప్రభుత్వం అంగీకరించలేదు. ప్రశ్నపత్రాలు లీకేజీ కాలేదని మొదట్లో అడ్డంతిరిగింది. అయితే చివరకు ఆధారాలన్నీ చూసిన తర్వాత లీకైన విషయాన్ని అంగీకరించక తప్పలేదు. దాంతో రెండు క్వశ్చన్ పేపర్ల లీకేజీ విషయమై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. బాధ్యులుగా కొందరిని అరెస్టులు చేసి సస్పెండ్ కూడా చేసింది.

ఇక్కడ సమస్య ఏమిటంటే బాధ్యులను గుర్తించటం, అరెస్టులు చేయటం, విచారణ మొదలుపెట్టడం కాదు. అసలు ప్రశ్నపత్రం లీకేజీ కాకుండా ఎందుకు ముందు జాగ్రత్తలు తీసుకోలేక పోతోందన్న విషయమే ఎవరికీ అర్ధంకావటంలేదు. ప్రశ్నపత్రాలను టీచర్లు లేదా ఇతర ఉద్యోగులే లీక్ చేస్తుండటం ఆశ్చర్యంగా ఉంది. ఒకవైపు టీఎస్ పీఎస్సీ పరీక్షల ప్రశ్న పేపర్ల లీకేజీపై విచారణ జరుగుతోందన్న విషయం అందరికీ తెలుసు. పట్టుబడితే ఏమవుతుందన్న విషయమూ అందరికీ తెలుసు.

అయినా ఏమాత్రం బయటపడకుండా కొందరు ప్రశ్నపత్రాల లీకేజీకి తెగిస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. అంటే పట్టుబడుతామని, విచారణ జరుగుతుందని, అరెస్టు చేస్తారని, కోర్టు ద్వారా శిక్షలు పడతాయనే భయం కూడా కనబడటంలేదు. ఇదే సమయంలో ఏపీ లో జరుగుతున్న పరీక్షల ప్రశ్నపత్రాలు లీకేజీ కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. క్వశ్చన్ పేపర్లోని ప్రతి ప్రశ్నకు ప్రత్యేకమైన బార్ కోడ్ కేటాయించినట్లు సమాచారం. ఎవరైనా ప్రశ్నపత్రం లీకేజీకి ప్రయత్నించినా బార్ కోడ్ కారణంగా ఎవరి మొబైల్ నుండి పేపర్ లీకైందన్న విషయం వెంటనే అధికారులకు తెలిసిపోతుంది.

అలాగే పరీక్షలు జరిగే స్కూళ్ళల్లో సిబ్బంది మొబైల్ ఫోన్ల వాడకాన్ని ప్రభుత్వం నిషేధించింది. స్కూళ్ళ ను నో మొబైల్ జోన్లుగా ప్రకటించింది. పరీక్ష పేపర్లను లీక్ చేస్తే ఏడేళ్ళు జైలుశిక్ష తప్పదని ప్రభుత్వం ముందుగానే ప్రకటించింది. మొత్తానికి ఏపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని జాగ్రత్తల వల్ల ఇప్పటివరకు ప్రశ్నపత్రం లీకైందని ఎవరు చెప్పలేదు. ఇలాంటి జాగ్రత్తలే తెలంగాణా ప్రభుత్వం కూడా తీసుకుంటే బాగుంటుంది.

This post was last modified on April 5, 2023 12:23 pm

Share

Recent Posts

ఇక్కడ అమ్మాయి సుప్రియకు అదిరిపోయే పదవి!

ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…

44 minutes ago

సంబరాలు అంత సాహసం చేస్తుందా

సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…

55 minutes ago

కేసీఆర్ ఫ్యామిలీ భూముల లెక్క చూస్తే షాకే!

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…

1 hour ago

ఇలాంటి కొడుకులు కూడా ఉంటారు..

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…

2 hours ago

నిద్రాహారాలు కాదు ముందు పనవ్వాలి

ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…

3 hours ago

ఇక పై కోడి కెలికినట్టు రాస్తే కుదరదు!

దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…

4 hours ago