జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. వరసుగా ఆయన బీజేపీ పెద్దలను అక్కడ కలుస్తున్నా రు. రెండో రోజు మంగళవారం స్వయంగా మీడియాతో మాట్లాడిన పవన్.. ఢిల్లీకి ఎందుకు వచ్చిందీ వివరించారు. ఏపీలో వైసీపీ పాలనకు విముక్తి కలిగించడమే అజెండాగా తాను డిల్లీలో పర్యటిస్తున్నట్టు చెప్పారు. వైసీపీ పాలనలో ఏపీ భ్రష్టు పట్టిపోయింద న్నారు. ఏపీలో అన్ని వ్యవస్థలు నాశనం అయ్యాయని దుయ్యబట్టారు. రాజధాని లేదు. పోలవరం ప్రాజెక్టు లేదు.. అభివృద్ధి లేదు. యువతకు ఉద్యోగాలు లేవు. ఉపాధి అసలే లేదు.. అని పవన్ విమర్శించారు.
అందుకే గతంలో తాను చెప్పినట్టు వైసీపీ విముక్త ఏపీ లక్ష్యంగా ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసి.. వారితో చర్చించినట్టు పవన్ చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యాయని, ఏపీ విషయాలను చర్చించానని తెలిపారు. గతంలో తాను వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చనివ్వకుండా.. చూస్తానని చెప్పిన విషయాన్ని పవన్ ప్రస్తావించారు. ఈ విషయాన్ని బీజేపీ పెద్దలకు కూడా వివరించినట్టు తెలిపారు. ఈ సారి వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ వైసీపీని గెలవకుండా చూడడమే తన లక్ష్యమని తేల్చి చెప్పారు.
సమావేశాలు అన్నీ సుహృద్భావ వాతావరణంలో సాగాయని పవన్ వెల్లడించారు. ఏపీపై బీజేపీ పెద్దలకు ఒక అవగాహన ఉందన్నారు. తాను చెప్పిన విషయాలను నమోదు చేసుకున్నారని తెలిపారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై మాత్రం తాము చర్చించలేదని తెలిపారు. ప్రస్తుతం బీజేపీ-జనసేన ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపైనే చర్చించామని.. ఈ క్రమంలో సంస్థాగతంగా ఇరు పార్టీలు ఎలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్లాలనే విషయంపైనే దృష్టి పెట్టామన్నారు. కేంద్రం నుంచి తనకు సహకారం లభిస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్న విషయాన్ని తాను బీజేపీ నేతలు చెప్పానని పవన్ వెల్లడించారు. దీనికి వారు కూడా సమ్మతించినట్టు చెప్పారు.
This post was last modified on April 4, 2023 10:28 pm
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి…