అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ రాజధాని Hyderabad పై 60 సెకన్ల నిడివితో రీల్ తీస్తే.. చాలు.. రూ.లక్ష గెలుచుకునే అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ అభివృద్ధిపై తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ ‘హ్యాపెనింగ్ హైదరాబాద్ రీల్స్ కాంటెస్ట్’ నిర్వహిస్తోంది. ప్రైజ్ మనీ కింద విజేతకు రూ.50,000, ఫస్ట్ రన్నరప్ రూ.25,000, సెకండ్ రన్నరప్ రూ.10,000, ముగ్గురికి కన్సొలేషన్ ప్రైజ్ రూ.5వేలు చొప్పున.. మొత్తంగా రూ.లక్ష ఇవ్వనున్నట్టు తెలంగాణ డిజిటల్ మీడియా ప్రకటించింది. ఈ నెల 30లోపు ఈ పోటీలో పాల్గొనాలని సూచించింది.
ఇందుకోసం చేయవలసిందల్లా.. హైదరాబాద్లో గత తొమ్మిదేళ్లలో జరిగిన అభివృధ్ధికి అద్దంపట్టే దృశ్యాలను 60 సెకన్ల నిడివి మించకుండా వీడియో తీయాలి. ఆ వీడియోను @DigitalmediaTS ట్యాగ్తో సోషల్ మీడియాలో పోస్టు చేయాలి. ఆ తర్వాత వీడియో లింక్ను dir_dm@telangana.gov.inకు మెయిల్ చేయాలి. ఏప్రిల్ 30వ తేదీతో ఈ పోటీ ముగుస్తుంది. మరిన్ని వివరాల కోసం https://it.telangana.gov.in/contest/లో చూడాలని తెలంగాణ డిజిటల్ మీడియా తెలిపింది. మే రెండో వారంలో విజేతలను ప్రకటిస్తారు.
అభివృద్ది ఇలా..
తొమ్మిదేళ్లలో భాగ్యనగరం ఎంతో అభివృద్ధి చెందింది. నగరంలోని ఎల్బీనగర్, గచ్చిబౌలి లాంటి ప్రధాన కూడళ్ల రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయి. దశాబ్దం క్రితం హైదరాబాద్ వచ్చిన వారు.. ఇప్పుడు హైదరాబాద్కు వస్తే కొన్ని ప్రాంతాలను చూసి గుర్తు పట్టలేరు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ఖ్యాతిని మరింత పెంచేందుకు.. మరింత ప్రచారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పోటీని పెట్టడం గమనార్హం. మరి ఇంకెందుకు ఆలస్య.. మెదళ్ల పదును పెళ్లి.. సెల్ ఫోన్ను చేతబట్టి.. రంగంలోకి దిగిపోవడమే!!
This post was last modified on April 4, 2023 9:12 pm
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి…