ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కల నెరవేరే దిశగా మొదటి అడుగు పడింది. గవర్నర్ ఆమోదం కోసం వేచిచూస్తున్న సీఆర్డీఏ, రాజధానుల వికేంద్రీకరణ బిల్లలుకు రాజ్ భవన్ ఆమోదముద్ర వేసింది. పది రోజులుగా గవర్నర్ వద్ద ఉన్న ఈ బిల్లలను న్యాయ సలహా కోసం కొంచెం సమయం తీసుకున్నారు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. ఎట్టకేలకు ఈరోజు వాటికి ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు.
3 రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించడంతో వైసీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో తగిలిన ఎదురుదెబ్బతో కాస్త ఇబ్బంది పడిన వైసీపీ శ్రేణులకు తాజా పరిణామం పెద్ద ఉపశమనం ఇచ్చిందని చెప్పాలి.
సీఆర్డీఏ రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం పది రోజుల క్రితం గవర్నర్ వద్దకు పంపారు. ఈ వ్యవహారంపై కోర్టుల్లో కేసులు నడుస్తుండటం, శాసన మండలిలో సెలెక్ట్ కమిటీ వద్ద బిల్లు పెండింగ్ ఉన్న నేపథ్యంలో గవర్నర్ బిల్లు ఆమోదించరేమో అనుకున్నారు. కానీ అనూహ్యంగా … పది రోజుల గ్యాప్ తీసుకుని న్యాయసలహాలు తీసుకున్న అనంతరం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆ బిల్లులకు ఆమోదం తెలిపారు.
దీంతో జగన్ 3 రాజధానుల కల నెరవేరడానికి మొదటి అడుగు పడినట్టయ్యింది. ఇపుడు అమరావతి విషయంలో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి. రైతులకు ప్రభుత్వం ఎలా న్యాయం చేస్తుంది.
రైతులు భూములు వెనక్కు తీసుకోవడానికి ఒప్పుకుంటారా? ఇది ఏ టర్న్ తీసుకుంటుందన్న ప్రశ్నలు అందరి మదిలో కదులుతున్నాయి. ఏది ఏమైనా ఇది ఏపీ రాజకీయాల్లో ఒక సంచలన పరిణామం. తదనంతరం ఎలాంటి పరిస్థితులు నెలకొన్నబోతున్నాయనేది ఆసక్తికరం.
This post was last modified on July 31, 2020 4:20 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…