Political News

ఎన్నికలొచ్చాయి.. స్వామీజీ మళ్లీ యాక్టివ్

భారత దేశంలో పౌరుల జీవితానికి మతానికి విడదీయరాని సంబంధం ఉంది. రోజూవారీ కార్యక్రమాల్లో కూడా మతాచారాలను పాటిస్తూనే ఉంటారు.మతం కోసం యుద్ధాలకు కూడా సిద్ధపడే వారున్నారు. అందుకే స్వామీజీలకు మంచి డిమాండ్ ఉంటుంది.నిజానికి జనంలో మంచిని బోధించే స్వామీజీలు చాలా మంది ఉన్నారు. కాకినాడ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద కూడా జనంలో సత్ ప్రవర్తన ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు కాకపోతే ఆయన తర్వాతి కాలంలోనే కొంత రాజకీయం వంటపట్టించుకున్నారనుకోవాలి. బీజేపీలో కూడా చేరారు..

సంచలన వ్యాఖ్యలు

పరిపూర్ణానంద మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో రెండు రకాల ఆధార్ కార్డులివ్వాలన్నారు. ఇటీవల జగిత్యాల జిల్లా వీర హనుమాన్ శోభాయాత్రలో స్వామి పరిపూర్ణానంద.. ఆధార్ కార్డుల అంశాన్ని ప్రస్తావించారు.
దేశంలో హిందువుగా జీవించే వారికి ఒక రకం ఆధార్ కార్డు, హిందువు కాకపోయినా హిందూ ధర్మాన్ని గౌరవించే వాళ్ళకి రెండో రకం ఆధార్ కార్డు ఇవ్వాలని ఆయన సూచించారు హిందూ ధర్మాన్ని గౌరవించని వాళ్ళు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలకు వెళ్లిపోవాలని, లేకపోతే వేరే దేశాలకు పారిపోవాలని హెచ్చరించారు..దేశంలో ప్రజా ప్రతినిధులు ఈ సంగతి గుర్తుంచాలన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్లకు మాత్రమే ఓటు వేయాలని ఆయన సూచించడం ఇప్పుడు మళ్లీ వివాదాస్పదమైంది..

రాజకీయాల్లోకి..

స్వామి పరిపూర్ణానంద తొలుత మత ప్రచారకుడిగానూ, ప్రవచనకర్తగానూ మాత్రమే ఉండేవారు. టీవీల్లో రోజూ నాలుగు మంచి మాటలు చెబుతూ బాగా ఫెమస్ అయ్యారు,. తర్వాతి కాలంలో రాజకీయాల వైపు దృష్టిపెట్టారు. యూపీ సీఎంగా యోగీ ఆదిత్యనాథ్ అయినట్లే.. తాను కూడా తెలంగాణ సీఎం కావాలని పరిపూర్ణానంద కోరుకుంటున్నట్లు 2018 ప్రాంతంలో వార్తలు వచ్చాయి. యోగీ వచ్చిన తర్వాతే యూపీ అభివృద్ధి పధంలో నడుస్తోందని, శాంతి భద్రతల స్థాపన సాధ్యపడిందని పరిపూర్ణానంద చెప్పుకున్నారు. పైగా కంచె ఐలయ్య రాసిన పుస్తకాలపై విమర్శలతో కులాలను, మతాలను రెచ్చగొట్టారన్న పేరు కూడా ఉంది. ఒక ఛానెల్ లో కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ హైదరాబాద్ నుంచి యాదాద్రికి ఆయన పాదయాత్ర చేయాలనుకున్నారు. పోలీసులు అడ్డు తగిలి హౌస్ అరెస్టు చేయడంతో వివాదం సద్దుమణిగింది..

పార్టీ ఓడిపోవడంతో…

2018 ప్రాంతంలో పరిపూర్ణానంద రాజకీయాల్లో బాగా యాక్టివ్ గా ఉన్నారు. తన ప్రచారం కోసం ఒక టీవీ ఛానెల్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడంతో స్వామి డీలా పడిపోయారు. యూపీ తరహాలో తెలంగాణ కాలేకపోయిందన్న ఆవేదనతో ఆయన కొంతకాలం తెరమరుగయ్యారు. ఈ ఏడాది ఆఖరులో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో స్వామి మళ్లీ పొలిటికల్ గా స్పీడ్ అందుకున్నారనుకోవాల్సి వస్తుంది..

This post was last modified on April 4, 2023 9:57 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

భవిష్యత్తుని శాసించబోతున్న డాల్బీ సినిమా

వెండితెరపై సినిమా చూసే అనుభూతి మారుతోంది. ఒకప్పుడు తెల్లని తెరలు కట్టి ప్రింట్లు ఎంత మసకగా ఉన్నా, లైన్లు కనిపించి…

5 hours ago

భార్య కోసం 78 ఏళ్ల వయసులో ఫుడ్ డెలివరీ… 4 కోట్ల విరాళం

​కష్టం ఎదురైనప్పుడు వయసుతో సంబంధం లేకుండా పోరాడే మనస్తత్వం కొందరికే ఉంటుంది. అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రానికి చెందిన 78 ఏళ్ల…

6 hours ago

కమల్ కు చిన్మయి చురకలు

మహిళల మీద వివిధ రంగాల్లో జరుగుతున్న లైంగిక వేధింపులు, అఘాయిత్యాల మీద కొన్నేళ్ల ముందు మొదలైన ‘మీ టూ’ ఉద్యమాన్ని…

8 hours ago

ఉస్తాద్ రీమేక్ గోల ఆపుతారా?

రెండేళ్ల గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక..  వరుసగా రీమేక్ సినిమాలే చేస్తూ వచ్చాడు పవర్ స్టార్ పవన్…

9 hours ago

కారు ఎక్కనున్న కీలక కాంగ్రెస్ నేత?

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయకుడు, మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి చేరే స‌మ‌యం ఆస‌న్న‌మైందా?  ఇప్ప‌టికే ఆయ‌న…

11 hours ago

నారా వారి ఇంటో ఫంక్షన్ ఇంతా సింపుల్‌గానా..

ఏపీ సీఎం నారా చంద్రబాబు ఇంట్లో సంబరాలు జరిగాయి. శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగిన ఈ సంబరాలకు నందమూరి…

12 hours ago