Political News

వైరల్ పిక్: బెడ్ పై రామోజీ!

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావుకు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య వైరం పతాక స్థాయికి చేరినట్లే కనిపిస్తోంది. కొంత కాలంగా ఈనాడు జగన్ అండ్ కోను తీవ్ర స్థాయిలోనే టార్గెట్ చేస్తుండగా.. అట్నుంచి కూడా స్పందన అదే స్థాయిలో కనిపిస్తోంది.

రామోజీని ఇరుకున పెట్టడానికి అప్పట్లో వైఎస్, ఇప్పుడు జగన్‌కు ఉన్న ఆయుధం మార్గదర్శి చిట్‌ఫండ్ కేసు ఒక్కటే అన్న సంగతి తెలిసిందే. మార్గదర్శిలో చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరించి, వాటిని ఇతర అవసరాలకు వాడారన్న అభియోగాలతో సుదీర్ఘ కాలంగా కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఇటీవల పోలీసులతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాలను మార్గదర్శి మీదికి ఉసిగొల్పుతూ రామోజీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది జగన్ సర్కారు. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

మార్గదర్శి కేసును విచారిస్తున్న ఏపీ సీఐడీ పోలీసులు ఏకంగా హైదరాబాద్‌లో రామోజీ కుటుంబ సభ్యుల ఇళ్లలోకి అడుగు పెట్టేశారు. మార్గదర్శి కేసులో ఏ1, ఏ2గా ఉన్న రామోజీ రావు, శైలజా కిరణ్ (రామోజీ పెద్ద కోడలు)లను విచారించేందుకు ఏకంగా 20 మంది ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌కు చేరుకున్నారు. భారీ బందోబస్తు మధ్య రామోజీ, శైలజలను పోలీసులు విచారిస్తున్నారు. విచారణ కోసం పోలీసులు పిలవడంతో రామోజీ ఫిలిం సిటీలోని తన నివాసం నుంచి బయల్దేరి.. జూబ్లీ హిల్స్‌లోని కిరణ్ ఇంటికి రామోజీ చేరుకున్నారు. అక్కడే విచారణ జరుగుతుండటంతో అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

విచారణతో సరిపెడతారా.. ఈ కేసులో పోలీసులు ఇంకేదైనా ముందడుగు వేస్తారా అన్నది కీలకం. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులను సైతం ఫిలిం సిటీలోని ఇంటికి పిలిపించుకుని మాట్లాడే రామోజీని.. ఇలా విచారణ కోసం ఏపీ పోలీసులు జూబ్లీహిల్స్‌కు రప్పించారంటే అంటే జగన్ ఈ కేసు విషయంలో ఎంత పట్టుదలతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

This post was last modified on April 3, 2023 1:57 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

మైత్రి రెండు గుర్రాల స్వారీ ఏ ఫలితమిస్తుందో

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థగా వెలిగిపోతున్న మైత్రి మూవీ మేకర్స్ కి ఈ రోజు చాలా కీలకం. తెలుగులో కాకుండా…

14 minutes ago

రాజీ బాటలో రోజా సక్సెస్ అయ్యారా..?

ఆర్కే రోజా పేరు వింటేనే కూటమి పార్టీలు అంతెత్తున ఎగిరి పడుతున్నాయి. వైసీపీ అదికారంలో ఉండగా.. టీడీపీ, జనసేనలపై ఓ…

3 hours ago

హెచ్‌సీయూపై కాంగ్రెస్ గేమ్ స్టార్ట్, బీఆర్ఎస్ ఆన్సర్ ఉందా..?

కంచే గచ్చిబౌలి భూముల విషయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ పెద్ద ఎత్తున విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా…

5 hours ago

తెలంగాణను మించిన స్పీడుతో ఏపీ

పెట్టుబడులను ఆకర్షించే విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నట్లే కనిపిస్తున్నాయి. అయితే ఎక్కడ కూడా ఇరు రాష్ట్రాల మధ్య…

10 hours ago

బాబు ఆనందం అంతా ఇంతా కాదు… ఎందుకంటే…

ఏపీ ముఖ్య‌మంత్రిగా కూట‌మి ప్ర‌భుత్వాన్ని చ‌క్క‌టి స‌మ‌న్వ‌యంతో ముందుకు న‌డిపిస్తున్న చంద్ర‌బాబుకు 10 నెల‌లు పూర్తయ్యాయి. గ‌త ఏడాది జూన్…

10 hours ago

మళ్లీ జోగి రమేశ్ వంతు వచ్చేసింది!

వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో టీడీపీ…

14 hours ago