గ్రౌండ్ లెవల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో పెద్ద సమావేశం జరిగింది. దీనికి ఆత్మీయసభ అని పేరుపెట్టినా ఇది ముమ్మాటికీ మంత్రికి వ్యతిరేకంగా నిర్వహించిన సమావేశమే అని అర్ధమైపోతోంది. సీనియర్ నేత, మంత్రికి బద్ధవిరోధి అయిన చిట్టా విజయభాస్కరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి నియోజకవర్గంలోని చాలామంది హాజరయ్యారు.
చిట్టా ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ఇంతమంది హాజరయ్యారంటేనే అంబటిపైన పార్టీలో ఎంత వ్యతిరేకత ఉందో అర్ధమైపోతోంది. నిజానికి అంబటిది రేపల్లె నియోజకవర్గం. అయితే పోయిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లిలో పోటీచేయించారు. ప్రత్యేక పరిస్ధితుల్లో పార్టీలోని నేతలు, క్యాడరంతా కష్టపడి పనిచేస్తే అంబటి గెలిచారు. గెలిచిన దగ్గర నుండి నేతలతో తేడాగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినబడుతునే ఉన్నాయి. అక్కడక్కడ అసమ్మతి వినిపిస్తున్నా తాజా సమావేశం మాత్రం కీలకమనే చెప్పాలి.
ఇక్కడ గమనించాల్సిందేమంటే అంబటికి టికెట్ ఇస్తే సత్తెనపల్లిలో ఓడిస్తామని డైరెక్టుగా జగన్నే హెచ్చరించటం గమనార్హం. లోకల్ అయిన తనకు టికెట్ ఇస్తే కచ్చితంగా గెలుస్తానని చిట్టా డైరెక్టుగానే చెప్పేశారు. దానికి చాలామంది మద్దతుగా నిలబడ్డారు. సో, జరిగింది చూస్తుంటే జగన్ చేయించుకున్న సర్వేల్లో అంబటిపైన సత్తెనపల్లిలో వ్యతిరేకత బయటపడే ఉంటుందనటంలో సందేహంలేదు. పార్టీలో ఇంత వ్యతిరేకత ఉన్నపుడు అంబటికి మళ్ళీ జగన్ టికెట్ ఇస్తారా ?
లేకపోతే జనాల్లో బాగానే ఉంది కాబట్టి పార్టీలో అసమ్మతిని లెక్కచేయాల్సిన అవసరంలేదని అనుకుంటారా ? అన్నది పజిల్ అయిపోయింది. పార్టీ నేతలు, క్యాడర్ పనిచేయకపోతే అభ్యర్ధి గెలవటం చాలా కష్టం. అభ్యర్ధికి అనుకూలంగా పనిచేయకుండా ఎవరు ఊరికే కూర్చోరు. ప్రత్యర్ధి గెలుపుకు కచ్చితంగా సాయంచేస్తారు. మరిపుడు అంబటికి కూడా ఇదే జరుగుతుంది. కాబట్టి అంబటికి టికెట్ దక్కేది అనుమానమే అనే ప్రచారం పెరిగిపోతోంది. మరి సొంత నియోజకవర్గం రేపల్లెకే వెళతారా ? లేకపోతే అసలు పోటీనుండి తప్పించి ప్రచార బాధ్యతలు అప్పగిస్తారా అన్నది చూడాలి.
This post was last modified on April 3, 2023 11:01 am
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్కు ఊహించని సంకటం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. కవిత.. పాత `టీఆర్ ఎస్`…
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…