ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో చంద్రబాబు అమితానందంలో మునిగిపోయారు. ఆయన నిత్యం ఉత్సాహంగా కనిపిస్తున్నారు. అందరినీ నవ్వుతూ పలుకరిస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా జగన్ పైనా, వైసీపీ ప్రభుత్వం పైనా విరుచుకుపడుతున్నారు. జనంలో మార్పు వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో తనకే ఓటు వేస్తారని చంద్రబాబు విశ్వసిస్తున్నారు.
టీడీపీ అధినేత దృష్టి అంతా ఇప్పుడు ఎన్నికలపైనే ఉంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని ముందస్తుకు భయపడబోమని చంద్రబాబు ప్రకటించారు. ఎవరికీ భయపడబోమని, ముందస్తుకు వెనుకాడబోమని, దేనికైనా తాము సిద్ధమని ఆయన అన్నారు. ఎన్నికలు రేపు వచ్చినా తాము గెలుస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
పట్టభద్రుల ఎన్నికల ఫలితాల అనంతరం చాలా మంది వైసీపీ నేతలు తమతో టచ్లో ఉన్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారని, వచ్చే ఎన్నికల్లో పర్మినెంట్ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు. 175 స్థానాల్లో వైసీపీని ఓడించడమే ధ్యేయంగా పనిచేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు.
175 స్థానాల్లో పోటీ చేస్తారా అంటూ ఎవరైనా అడుగుతారా, బుద్ది జ్క్షానం ఉండేవారు ఎవరు అడగరని, ప్రతిపక్షాలను బెదిరించడం, వారిని భయబ్రాంతులకు గురిచేయడమే వైసీపీ ఎజెండాగా మారిందన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు బానిస బతుకులు బతుకుతున్నారని, వారు కూడా జగన్ నుంచి విముక్తిని కోలుకుంటున్నారని చంద్రబాబు విశ్లేషించారు.
జగన్ ఇప్పటివరకు పబ్లిక్ ను ఫూల్స్ చేస్తూ వచ్చారని. ఫైనల్ గా జగన్ ను ప్రజలు పెద్ద ఫూల్ ని చేస్తారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రం ఎటుపోతుందో అర్దం కావడం లేదని, రాష్ట్ర అప్పు రూ. 10.31 లక్షల కోట్లకు చేరిందని అన్నారు. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో జగన్ రూ. 96 వేల కోట్ల రూపాయలు అప్పు చేశారని, ఇది మరింత ఆర్ధిక సంక్షోభానికి దారి తీస్తుందని, రాష్ట్రం పూర్తిగా దివాళా తీసే పరిస్థితి వస్తుందని అన్నారు. దేశంలోనే నెంబరు 1 దోపడిదారుడు జగన్ నే నని …. దేశంలో అందరి సీఎంల సంపద కంటే జగన్ సంపాదనే ఎక్కువ అని అన్నారు. ఇసుకలో వందల కోట్ల అక్రమాలు చేస్తూ నేను పేదల మనిషిని అంటే సరిపోతుందా అని అన్నారు.
This post was last modified on April 2, 2023 10:30 am
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు…
డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…
హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…
ప్రపంచ వేదిక మీద సగర్వంగా ఆస్కార్ అందుకున్న ఎంఎం కీరవాణి మీద ఇప్పుడు అతి పెద్ద బాధ్యత ఉంది. వారణాసికి…
నిఖిల్ ఎంత గ్యాప్ వస్తున్నా లెక్క చేయకుండా అత్యధిక సమయం కేటాయించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటికే విపరీతమైన…