Political News

షర్మిల ట్విస్టు.. రేవంత్, బండిలకు ఫోన్

మరికొద్ది నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఎవరికి వారు తమదైన రాజకీయ ఎత్తుల్లో మునిగిపోయారు. ఇప్పటికే వేడుక్కిన రాజకీయాలకు కొనసాగింపుగా అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ వైసీపీ అధినేత్రి షర్మిల కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఆమె స్వయంగా ఫోన్ చేశారు.

ప్రజా సమస్యలపై కలిసి పోరాటం చేద్దామని సూచన చేశారు. నిరుద్యోగ సమస్యపై కలిసి పని చేద్దామని ఆమె కోరారు. నిరుద్యోగ సమస్యలు.. టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై ప్రగతిభవన్ కు మార్చ్ నిర్వహిద్దామన్న ఆమె వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త కాక రేపేలా మారాయి.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మెడలు వంచాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాలన్న వైఎస్ షర్మిల.. పేపర్ లీకేజ్ అంశంపై కలిసి పోరాడదామని కోరారు. కలిసి పోరాటం చేయకపోతే.. ప్రతిపక్షాల్ని తెలంగాణలో సీఎం కేసీఆర్ బతకనివ్వరన్న షర్మిల వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. షర్మిల చేసిన ప్రతిపాదనకు బండి సంజయ్ సానుకూలంగా స్పందించినట్లుగా చెబుతున్నారు. నిరుద్యోగుల విషయంలో ఉమ్మడి పోరుకు తాను పూర్తి మద్దతు ఇస్తానని బండి స్పస్టం చేసినట్లుగా పేర్కొన్నారు.

ఇందులో భాగంగా త్వరలోనే సమావేశం అవుదామన్న బండి.. నిరుద్యోగుల విషయంలో ఉమ్మడి పోరుకు తాము పూర్తి మద్దతు పలుకుతామని బండి స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ. . ప్రతిపక్షాలు కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నట్లుగా పేర్కొన్నారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుందామని రేవంత్ చెప్పినట్లుగా పేర్కొన్నారు. ఒకవేళ.. విపక్షాల్ని ఒక తాటి మీద తెచ్చి..ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేయగలిగితే మాత్రం.. ఆ క్రెడిట్ షర్మిలకు దక్కుతుందని చెప్పక తప్పదు.

Satya

Recent Posts

‘ఓం’ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు

ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…

2 hours ago

ఆ నిర్మాతకు మళ్లీ జాక్‌పాటేనా?

తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…

2 hours ago

సీబీఐ విచారణకు జగన్ డిమాండ్

విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…

4 hours ago

వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు… మొక్కు చెల్లించుకున్న రైతు

తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…

4 hours ago

బంగారం బుకింగ్స్ ఎందుకు బాగున్నాయి

మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…

4 hours ago

‘రాజురామను టార్చర్ చేసిన వాళ్లకు, ఉగ్రవాదులకు తేడా లేదు’

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్‌, మాజీ ఎంపీ.. ప్ర‌స్తుత ఉండి శాస‌న‌స‌భ్యుడు ర‌ఘురామ‌కృష్ణ‌రాజును క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేసిన కేసులో హైకోర్టు సంచ‌ల‌న…

5 hours ago