వైసీపీ అధినేత సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు.. కొన్ని కొన్ని సార్లు సక్సెస్ కన్నావిఫలమవుతున్నాయనే చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారంటూ.. నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేశారు. అయితే.. ఈ నిర్ణయంతో వైసీపీ సాధించింది ఏమీ కనిపించడం లేదు. అదేసమయంలో సదరు ఎమ్మెల్యేలకు సింపతీ పెరిగిందనే వాదన బలంగా వినిపిస్తోంది.
కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని తీసుకుంటే.. గత ఏడాదికి ఇప్పటికీ ఆయన గ్రాఫ్ పెరిగింది. గత ఏడాదిఇదే సమయంలో ఆయన పర్యటనలకు వెళ్తే.. పెద్దగా రెస్పాన్స్ ఉండేదికాదు.. కానీ ఇప్పుడు ఆయన తమ గ్రామాలకు రావాలని.. తమ ప్రాంతాలకు రావాలని కోరుతున్నవారు పెరుగుతున్నారు. అదేసమయంలో పార్టీ నుంచి బయటకు వచ్చి మంచి పనిచేశారంటూ.. నెటిజన్లు కూడా ఆయనకు మద్దుతు తెలిపారు.
ఉండవల్లి శ్రీదేవి: అసలు.. వచ్చే ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇచ్చినా.. ఓడిపోతారని.. బలంగా నమ్మిన వైసీపీ.. ఎన్నికల వరకు ఆమె స్థానంలోఅలానే ఉంచేసి.. ఉంటే పరిస్థితి అలానే ఉండేది. కానీ, ఆమెను పార్టీ నుంచి బయటకు పంపించడం ద్వారా.. ఇప్పుడు సంపతీ పెరిగింది. ఏ పార్టీ తరఫున పోటీ చేసినా.. గెలిపిస్తామంటూ.. ఆమెకు ఇక్కడిప్రజలు చెబుతున్నారు.
మేకపాటి చంద్రశేఖర్రెడ్డి. కొన్నాళ్లు పార్టీకి , కార్యక్రమాలకు, నియోజకవర్గానికి కూడా దూరంగా ఉన్న ఆయన విషయంలో అసంతృప్తి పెరిగింది. గడపగడపకు కార్యక్రమాన్ని కూడా ఆయన లైట్ తీసుకున్నా రు. దీంతో నియోజకవర్గంంలో ఆయన మాట వినిపించడం మానేసింది. ఇలాంటి సమయంలో వైసీపీ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ప్రజల్లోకి బాగా తీసుకు వెళ్లారు. నేను పార్టీకోసం ఎంతో చేస్తే.. పార్టీ నాకు.. ఇంత సత్కారం చేసిందన్న వాదన వినిపించారు. ఇప్పుడు ఆయన కూడా సింపతీ రేసులో ముందున్నారు.
ఆనం రామనారాయణరెడ్డి విషయంలో సింపతీ ఎలా ఉన్నా.. ఆత్మకూరులోఆయన రావాలని కోరుతున్న వారు ఏడాది కాలంగా పెరుగుతున్నారు. గౌతంరెడ్డి మరణం తర్వాత.. ఆయన సోదరుడు గెలిచినా.. ఆనం వర్గం మాత్రం బలంగానే ఉంది. ఇప్పుడు దీనికి తోడు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం.. పార్టీలో ఆయనను వెలివేసిన ట్టుగా వ్యవహరించడం వంటివి మరింతగా గ్రాఫ్ పెంచాయి. మరి వైసీపీ ఏం సాధించినట్టు?!
This post was last modified on April 1, 2023 2:29 pm
వైైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన కన్న తల్లి విజయమ్మ నుంచే భారీ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం పనిచేస్తోందని ఆరోపించిన కొన్ని గంటల వ్యవధిలోనే టీడీపీ యువనాయకుడు,…
సౌత్ దర్శకుల్లో రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ తర్వాత అంతకన్నా తక్కువో ఎక్కువో స్టార్ డం తెచ్చుకున్న వాళ్లలో లోకేష్ కనగరాజ్…
ఇటీవలే జరిగిన ఒక ఈవెంట్ లో అమీర్ ఖాన్ మాట్లాడుతూ థియేటర్ ఓటిటి మధ్య ఇప్పుడున్న గ్యాప్ సరిపోదని నాలుగు…
రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల ఇంచార్జ్లను మార్చనున్నట్లు వైసీపీ అధినేత జగన్ చెప్పారు. అయితే దీనికి కొంత సమయం పడుతుందన్నారు.…
పహల్ గాం ఉగ్రవాద దాడి తదనంతర పరిణామాల్లో భాగంగా మంగళవార తెల్లవారుజామున భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ భూభాగంలోని ఆ దేశ…