Political News

ఏపీలో ఒక్కొక్క ప్రాంతం.. ఒక్కొక్క‌ర‌కం.. ఎందుకిలా?!

ఔను.. ఇప్పుడు ఏపీలోని ప్ర‌తి జిల్లా గురించి.. చ‌ర్చ సాగుతోంది. ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క ర‌కంగా భ్ర‌ష్టు ప‌డుతోంద‌నే ఆవేద‌న‌, బాధ క‌నిపిస్తోంది. తాజాగా పులివెందుల‌లో గ‌న్ క‌ల్చ‌ర్‌పై ప్ర‌తి ఒక్క‌రూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు యూపీలో వెలుగు చూసిన గ‌న్ క‌ల్చ‌ర్‌పై అక్క‌డి ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ ఉక్కుపాదం మోపారు. డిపాజిట్ల‌ను రెండింత‌లు పెంచ‌డంతోపాటు.. ఎవ‌రికి అవ‌స‌ర మో.. వారికి మాత్ర‌మే గ‌న్ ఇచ్చేలా చ‌ట్టంలోనూ మార్పులు తెచ్చారు.

కానీ, ఏపీలో ఎన్న‌డూ లేని విధంగా గ‌న్ లైసెన్సు ఉన్న వ్య‌క్తి.. ఉన్న‌ప‌ళాన‌, చిన్న వివాదం.. చ‌ర్చ‌ల‌తో స‌ర్దుబాటు అయ్యే అవ‌కాశంఉండి కూడా.. త‌న‌ను ఎవ‌రూ ఏమీ చేయ‌లేర‌నే ధీమాతో ఏకంగా కాల్పుల‌కు దిగ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురిచేస్తోంది. ఇక‌, కర్నూలులోనూ ఫ్యాక్ష‌న్ ర‌గ‌డ కొన‌సాగుతోంది. గ‌తంలో చంద్ర‌బాబు హ‌యాంలో ఫ్యాక్ష‌న్‌ను అరిక‌ట్టేందుకు.. అనేక చ‌ర్య‌లు తీసుకున్నారు. కానీ, ఇప్పుడు మాత్రం మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది.

విజ‌య‌వాడ‌లో ఒక‌ప్పుడు రౌడీ యిజం ఉండేద‌ని అంటారు. కానీ, ఇప్పుడు మ‌రోసారి ఇక్క‌డ జ‌డ‌లు విచ్చుకుంటోంది. తూర్పు గోదావ‌రిలో ఎస్సీలు బ‌త‌క‌లేని ప‌రిస్థితి వ‌చ్చింద‌ని టీడీపీ నాయ‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్ప‌టికే ఎస్సీల‌పై దాడుల కేసుల్లో తూర్పు గోదావ‌రి జిల్లా ప్ర‌థ‌మ స్థానంలో ఉంది. విశాఖ‌ను తీసుకుంటే.. భూ క‌బ్జాల‌కు కేంద్రంగా మారింద‌నే వాద‌న వినిపిస్తోంది. పులివెందుల‌, క‌డ‌ప‌ల నుంచి వ‌చ్చిన వారు ఇక్క‌డ దందాలు చేస్తున్నార‌ని రోజుకో వార్త వ‌స్తోంది.

ఇక‌, శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, గుంటూరు జిల్లాల్లో మాద‌క ద్ర‌వ్యాల వినియోగం విచ్చ‌ల‌విడిగా మారిపోయిందనే టాక్ వినిపిస్తోంది. స్కూల్ విద్యార్థుల స్థాయిలోనే వీటికి బానిస‌లుగా మారుతున్నార‌ని పోలీసులు ఆందోళ‌న చెందే ప‌రిస్థితివ‌చ్చింది. ఇక‌, గంజాయి సాగు పెరిగిపోతుండ‌డం మ‌రింత ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇలా..రాష్ట్రంలోని ప్ర‌తి ప్రాంతంలోనూ ఎన్న‌డూ లేని విధంగా ఈ విధ‌మైన అసాంఘిక కార్య‌క్ర‌మాలు చెల‌రేగుతుండ‌డం రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తోంది.

Satya

Recent Posts

జూన్ చివరి వారం… రీ రిలీజుల అర్పణం

అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…

2 hours ago

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

7 hours ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

9 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

9 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

11 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

13 hours ago