Political News

వైసీపీ మైండ్‌గేమ్‌కు లొంగొద్దు.. జ‌న‌సేనాని పిలుపు!

ఏపీ అధికార పార్టీ వైసీపీపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ విరుచుకుప‌డ్డారు. వైసీపీ మైండ్ గేమ్ ఆడు తోం \ద‌ని.. దానికి చిక్కొద్ద‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. జ‌న‌సేన నేత‌ల‌తో హైద‌రాబాద్‌లో భేటీ అయిన ప‌వ‌న్‌.. ఈ మేర‌కు వారికి కొన్ని విష‌యాల‌ను వివ‌రించిన‌ట్టు తెలిసింది. వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో పార్టీకి కొన్ని వ్యూహాలు ఉన్నాయ‌ని.. అవ‌న్నీ స్ప‌ష్టంగానే ఉన్నాయ‌ని.. ఎవ‌రితో పొత్తు పెట్టుకోవాలి.. ఎలా వ్య‌వ‌హ‌రించాల‌నే విష‌యాల‌పై స్ప‌ష్ట‌త ఉంద‌ని ప‌వ‌న్ పేర్కొన్న‌ట్టు స‌మాచారం.

వైసీపీ వ్య‌తిరేక ఓటు చీల‌నివ్వ‌బోనంటూ.. గ‌తంలో చెప్పిన మాట‌కు ప‌వ‌న్ క‌ట్టుబ‌డ్డార‌ని.. ఆయ‌న ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్ హ‌రిప్ర‌సాద్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు వివ‌రించారు. ప‌వ‌న్ ఏం చేసినా.. పార్టీ ఫ్యూచ‌ర్‌, పార్టీలో కార్య‌క‌ర్త‌ల కోస‌మేన‌ని పేర్కొన్నారు. అయితే.. వ్య‌తిరేక ఓటు చీల‌నివ్వ‌బో నంటూ.. ప‌వ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న త‌ర్వాత‌.. వైసీపీ అనేక రూపాల్లో మైండ్ గేమ్ ఆడుతోంద‌ని ఆయ‌న తెలిపారు.

రెండు రోజుల కింద‌ట టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు స్వ‌యంగా ఒక ప్ర‌క‌ట‌న చేసిన‌ట్టు అభూత క‌ల్ప‌న‌లు సృష్టించార‌ని.. జ‌న‌సేన‌తో మాకు అవ‌స‌రం లేదు.. జ‌న‌సేన‌కు మాతోనే అవ‌స‌రం నఅన్న‌ట్టుగా ఆయ‌న మాట్టాడిన‌ట్టు ఓ వీడియోను సృష్టించి.. పార్టీని దారిత‌ప్పించేలా వ్య‌వ‌హ‌రించార‌ని.. దీనిని న‌మ్మొద్ద‌ని.. ఇది వైసీపీ ఆడుతున్న రాజ‌కీయ కుట్ర‌, క్రీడ‌ల్లో భాగ‌మేన‌ని ప‌వ‌న్ స్ప‌ష్టం చేసిన‌ట్టు హ‌రిప్ర‌సాద్ వివ‌రించారు.

జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు ఈ విషయంలో గందరగోళానికి, భావోద్వేగాలకు లోనుకావ ద్దని సూచించారు. రానున్న ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలను పార్టీ నాయకులకు పవన్‌కల్యాణ్ త్వ‌ర‌లోనే అన్ని విష‌యాలు వివ‌రిస్తార‌న్నారు.  ‘రైతుల కష్టాలపై త్వరలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహిద్దాం. రాష్ట్రంలో 80 శాతం వరి పంట కౌలు సేద్యం నుంచే వస్తుంది.  అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు’ అని పవన్‌కల్యాణ్‌ తెలిపారు.  

This post was last modified on March 31, 2023 12:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

శుభవార్త చెప్పబోతున్న అఖండ 2 ?

గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…

3 hours ago

AI తెచ్చే ప్రమాదాల్లో ఇదింకా మొదటిది

తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…

3 hours ago

నీలంబరి ఎలా బ్రతుకుతుంది నరసింహా

డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…

4 hours ago

ఇండి`గోల`పై నాయుడుతో మోదీ ఏమన్నారంటే…

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఇండిగో విమాన సేవ‌లు ర‌ద్ద‌యి.. కొన్ని విమానాలు తీవ్ర ఆల‌స్య‌మై.. ల‌క్ష‌ల సంఖ్య‌లో ప్ర‌యాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…

5 hours ago

‘ఉప్పెన’తో సినిమాలు ఆపేద్దాం అనుకున్న బేబమ్మ

కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…

5 hours ago

ప్రధాని మోదీ పొరపాటును సరిచేసిన ప్రతిపక్ష ఎంపీ

పార్లమెంటులో ఈ రోజు వందేమాతరంపై ప్రత్యేక చర్చ జరిగింది. జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఈ చర్చ…

7 hours ago