Political News

పెరుగుతున్న ‘ముందస్తు’ వాతావరణం

జగన్మోహన్ రెడ్డి తాజా ఢిల్లీ టూరుతో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం పెరిగిపోతోంది. రెండువారాల వ్యవధిలో జగన్ రెండుసార్లు ఢిల్లీకి వెళ్ళి నరేంద్రమోడీ, అమిత్ షా తదితరులతో కలవమే ఇందుకు ప్రాధాన కారణం. తాజా టూరులో అమిత్ షా, నిర్మల సీతారామన్ తో భేటీ అయి తిరిగి వచ్చేశారు. అంటే కేంద్రంనుండి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బకాయిలను వీలైనంత తొందరగా రాబట్టుకోవాలన్నదే జగన్ ఉద్దేశ్యంగా పార్టీలో టాక్.

తన ఆలోచనలను వివరించి ముందస్తు ఎన్నికలకు సహకరించమని ఇంతకుముందు మోడీని ఇపుడు అమిత్ షా ను జగన్ రిక్వెస్టు చేసినట్లు ప్రచారం పెరుగుతోంది. రెండువారాల క్రితం మోడీతో భేటీ అయిన తర్వాతే పెండింగ్ బకాయిల్లో రు. 5 వేల కోట్లు విడుదలైంది. ఇపుడు కూడా అలాగే బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని ఆర్ధికశాఖ మంత్రి నిర్మలను కూడా కలిశారట. ఇవన్నీ పక్కనపెట్టేస్తే రాజకీయంగా ప్రతిపక్షాలను ఏకం కానీయకుండా చూడటం కూడా జగన్ టార్టెట్ లో కీలకమైనదని పార్టీవర్గాలు చెబుతున్నాయి.

రాబోయే ఎన్నికల్లో వైసీపీ మళ్ళీ గెలవాలంటే టీడీపీ, జనసేన కలవకుండా చూడటమే జగన్ ముందున్న ఏకైక మార్గం. అయితే పై రెండుపార్టీలు పొత్తు పెట్టుకోకుండా ఆపటం జగన్ చేతిలో లేదు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగితే పొత్తుల విషయాన్ని రెండుపార్టీలు తీరుబడిగా చర్చించి నిర్ణయం తీసుకుంటాయి. టీడీపీ, పీడీఎఫ్ కు జనసేన కూడా కలిస్తే మొన్నటి పట్టభద్రుల ఎంఎల్సీ ఎన్నికల్లో ఏమి జరిగిందో అందరు చూసిందే. మూడుస్ధానాల్లోను వైసీపీ ఓడిపోయింది.

అలాంటిది రేపటి ఎన్నికల్లో టీడీపీ, వామపక్షాలు, జనసేన కలిస్తే వాటిని అడ్డుకోవటం కష్టమని జగన్ అనుకుంటున్నట్లు సమాచారం. సో, వాటిని కలవకుండా చేయాలంటే ముందస్తు ఎన్నికలకు వెళ్ళటమే ఏకైక మార్గమని జగన్ భావనగా చెబుతున్నారు. ప్రతిపక్షాలు సెటిల్ అయ్యేందుకు సమయం ఇవ్వకూడన్నదే జగన్ ప్లానట. తన వ్యూహం వర్కవుటవ్వాలంటే ముందస్తు ఎన్నికలు మాత్రమే ఏకైక మార్గమని జగన్ కన్వీన్స్ అయినట్లు పార్టీనేతలు అంటున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

This post was last modified on March 31, 2023 12:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విజయమ్మ లాజిక్ తో జగన్ కు కఫ్టమే

వైైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన కన్న తల్లి విజయమ్మ నుంచే భారీ…

41 minutes ago

రెడ్ బుక్ వ‌ద‌ల‌: మ‌రోసారి లోకేష్ స్ప‌ష్టం

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం ప‌నిచేస్తోంద‌ని ఆరోపించిన కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే టీడీపీ యువ‌నాయ‌కుడు,…

2 hours ago

క్రేజీ దర్శకుడు హీరో అయితే ఎలా

సౌత్ దర్శకుల్లో రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ తర్వాత అంతకన్నా తక్కువో ఎక్కువో స్టార్ డం తెచ్చుకున్న వాళ్లలో లోకేష్ కనగరాజ్…

6 hours ago

కబుర్లన్నీ చెప్పి ఇదేంటి అమీర్ సాబ్

ఇటీవలే జరిగిన ఒక ఈవెంట్ లో అమీర్ ఖాన్ మాట్లాడుతూ థియేటర్ ఓటిటి మధ్య ఇప్పుడున్న గ్యాప్ సరిపోదని నాలుగు…

9 hours ago

ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు – జగన్

రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల ఇంచార్జ్‌లను మార్చనున్నట్లు వైసీపీ అధినేత జగన్ చెప్పారు. అయితే దీనికి కొంత సమయం పడుతుందన్నారు.…

11 hours ago

థ్యాంక్స్ మోదీజీ: మధుసూదన్ భార్య కామాక్షి!

పహల్ గాం ఉగ్రవాద దాడి తదనంతర పరిణామాల్లో భాగంగా మంగళవార తెల్లవారుజామున భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ భూభాగంలోని ఆ దేశ…

13 hours ago