ఏపీ సీఎం జగన్కు ఒక ప్రత్యేకత ఉంది. తాను ఏం చేసినా.. చాలా కరెక్ట్ అనుకుంటారు. అదేసమయంలో ప్రతిపక్ష కూటమిలో ఎవరు ఏం చేసినా.. ఆయన తప్పులు వెతుకుతారు. అంతేకాదు.. వారంతా తప్పులే చేస్తున్నారని కూడా చెబుతుంటారు. కానీ, ఇప్పుడు తప్పులు అన్నీ కూడా.. ఆయన చుట్టూనే తిరుగుతు న్నాయని గ్రహించారట. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయన తప్పులు చేస్తున్నారంటూ.. ప్రతిపక్షాలు మొత్తుకున్నాయి.
అభివృద్ధి నిలిచిపోయింది. కీలకమైన రాజధానిని పక్కన పెట్టారు. పోలవరం పూర్తి చేయడం లేదు. ఇలా.. అనేక సమస్యలు ఉన్నా.. వాటిని గాలికి వదిలేసి.. కేవలం పంచడం వరకే.. బటన్ నొక్కడం వరకే తను పరిమితమని భావించారు. అయితే.. ఇది రివర్స్ అయింది. ప్రజల్లో సానుభూతి పెరగకపోగా.. తాము కట్టిన పన్నులతో వేల కోట్ల రూపాయలను పందేరం చేయడం పట్ల మెజారిటీ ప్రజలు ఆందోళనతో ఉన్నారు.
ఈ పరిస్థితే ఇటీవల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఇక, ఇదేసమయంలో ఎన్నో ఆశలతో జగన్.. మంత్రివర్గాన్ని విస్తరించారు. కీలకమైన ఎన్నికలసమయంలో ఆయన భారీ అంచనాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారు. అయితే.. అనుకున్న విధంగా మంత్రులు మాత్రం పుంజుకోలేక పోతున్నారనేది.. ఇప్పుడు జగన్ కనిపెట్టిన మరోపెద్ద తప్పిదం.
ఇలా తప్పులపై తప్పులు.. చేసుకుంటూ వెళ్తున్న ఆయన మధ్యలో టీంను మార్చడం ద్వారా.. మరో ప్రధాన తప్పు చేసినట్టు బాధపడుతున్నారు. సాయిరెడ్డిని తప్పించిపూర్తి బాధ్యతలు సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించారు. ఇది పార్టీని పతనం దిశగా తీసుకువెళ్తోంది. ఏ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఏమాత్రం హ్యాపీగా లేరు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి మార్పుల దిశగా అడుగులు వేస్తున్నట్టు చెబుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on March 30, 2023 7:56 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…