Political News

టీంను మార్చి.. జ‌గ‌న్ త‌ప్పు చేశార‌ట‌!

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు ఒక ప్ర‌త్యేకత ఉంది. తాను ఏం చేసినా.. చాలా క‌రెక్ట్ అనుకుంటారు. అదేస‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష కూట‌మిలో ఎవ‌రు ఏం చేసినా.. ఆయ‌న త‌ప్పులు వెతుకుతారు. అంతేకాదు.. వారంతా త‌ప్పులే చేస్తున్నార‌ని కూడా చెబుతుంటారు. కానీ, ఇప్పుడు త‌ప్పులు అన్నీ కూడా.. ఆయ‌న చుట్టూనే తిరుగుతు న్నాయ‌ని గ్ర‌హించార‌ట‌. అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ఆయ‌న త‌ప్పులు చేస్తున్నారంటూ.. ప్ర‌తిప‌క్షాలు మొత్తుకున్నాయి.

అభివృద్ధి నిలిచిపోయింది. కీలక‌మైన రాజ‌ధానిని ప‌క్క‌న పెట్టారు. పోల‌వ‌రం పూర్తి చేయ‌డం లేదు. ఇలా.. అనేక స‌మ‌స్య‌లు ఉన్నా.. వాటిని గాలికి వ‌దిలేసి.. కేవ‌లం పంచ‌డం వ‌రకే.. బ‌ట‌న్ నొక్క‌డం వ‌ర‌కే త‌ను ప‌రిమిత‌మ‌ని భావించారు. అయితే.. ఇది రివ‌ర్స్ అయింది. ప్ర‌జ‌ల్లో సానుభూతి పెర‌గ‌క‌పోగా.. తాము క‌ట్టిన ప‌న్నుల‌తో వేల కోట్ల రూపాయ‌ల‌ను పందేరం చేయ‌డం ప‌ట్ల మెజారిటీ ప్ర‌జ‌లు ఆందోళ‌న‌తో ఉన్నారు.

ఈ ప‌రిస్థితే ఇటీవ‌ల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో స్ప‌ష్టంగా క‌నిపించింది. ఇక‌, ఇదేస‌మ‌యంలో ఎన్నో ఆశ‌ల‌తో జ‌గ‌న్‌.. మంత్రివ‌ర్గాన్ని విస్త‌రించారు. కీల‌క‌మైన ఎన్నిక‌ల‌స‌మ‌యంలో ఆయ‌న భారీ అంచ‌నాల‌తో ఎస్సీ, ఎస్టీ, బీసీ వ‌ర్గాల‌కు ప్రాధాన్యం ఇచ్చారు. అయితే.. అనుకున్న విధంగా మంత్రులు మాత్రం పుంజుకోలేక పోతున్నార‌నేది.. ఇప్పుడు జ‌గ‌న్ క‌నిపెట్టిన మ‌రోపెద్ద త‌ప్పిదం.

ఇలా త‌ప్పుల‌పై త‌ప్పులు.. చేసుకుంటూ వెళ్తున్న ఆయ‌న మ‌ధ్య‌లో టీంను మార్చ‌డం ద్వారా.. మ‌రో ప్ర‌ధాన త‌ప్పు చేసిన‌ట్టు బాధ‌ప‌డుతున్నారు. సాయిరెడ్డిని త‌ప్పించిపూర్తి బాధ్య‌త‌లు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డికి అప్ప‌గించారు. ఇది పార్టీని ప‌త‌నం దిశ‌గా తీసుకువెళ్తోంది. ఏ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు కూడా ఏమాత్రం హ్యాపీగా లేరు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు మ‌రోసారి మార్పుల దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టు చెబుతున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి. 

This post was last modified on March 30, 2023 7:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తారక్ ఫ్యాన్స్‌కు ఆ రోజు నిద్ర ఉండదు

మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…

39 minutes ago

‘పోకిరి’లో ఆ ట్రాక్ పూరి తీసేద్దామనుకుంటే..

టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…

2 hours ago

ఇక రాంబాబు రానట్టే

సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్‌లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…

3 hours ago

వెంకీ మాట విన‌క‌పోవ‌డంతోనే ఆ ఫ్లాప్

తెలుగు సినీ చ‌రిత్ర‌లోనే అత్యంత హైప్ మ‌ధ్య విడుద‌లైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒక‌టి. 2001 సంక్రాంతికి మృగ‌రాజు, న‌ర‌సింహ‌నాయుడు లాంటి…

5 hours ago

మూకుమ్మడిగా మహేష్ సినిమాలను పిండుతున్నారు

రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…

7 hours ago

సోషల్ మీడియా వేరే ప్రపంచం కాదే

ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…

11 hours ago