Political News

టీంను మార్చి.. జ‌గ‌న్ త‌ప్పు చేశార‌ట‌!

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు ఒక ప్ర‌త్యేకత ఉంది. తాను ఏం చేసినా.. చాలా క‌రెక్ట్ అనుకుంటారు. అదేస‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష కూట‌మిలో ఎవ‌రు ఏం చేసినా.. ఆయ‌న త‌ప్పులు వెతుకుతారు. అంతేకాదు.. వారంతా త‌ప్పులే చేస్తున్నార‌ని కూడా చెబుతుంటారు. కానీ, ఇప్పుడు త‌ప్పులు అన్నీ కూడా.. ఆయ‌న చుట్టూనే తిరుగుతు న్నాయ‌ని గ్ర‌హించార‌ట‌. అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ఆయ‌న త‌ప్పులు చేస్తున్నారంటూ.. ప్ర‌తిప‌క్షాలు మొత్తుకున్నాయి.

అభివృద్ధి నిలిచిపోయింది. కీలక‌మైన రాజ‌ధానిని ప‌క్క‌న పెట్టారు. పోల‌వ‌రం పూర్తి చేయ‌డం లేదు. ఇలా.. అనేక స‌మ‌స్య‌లు ఉన్నా.. వాటిని గాలికి వ‌దిలేసి.. కేవ‌లం పంచ‌డం వ‌రకే.. బ‌ట‌న్ నొక్క‌డం వ‌ర‌కే త‌ను ప‌రిమిత‌మ‌ని భావించారు. అయితే.. ఇది రివ‌ర్స్ అయింది. ప్ర‌జ‌ల్లో సానుభూతి పెర‌గ‌క‌పోగా.. తాము క‌ట్టిన ప‌న్నుల‌తో వేల కోట్ల రూపాయ‌ల‌ను పందేరం చేయ‌డం ప‌ట్ల మెజారిటీ ప్ర‌జ‌లు ఆందోళ‌న‌తో ఉన్నారు.

ఈ ప‌రిస్థితే ఇటీవ‌ల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో స్ప‌ష్టంగా క‌నిపించింది. ఇక‌, ఇదేస‌మ‌యంలో ఎన్నో ఆశ‌ల‌తో జ‌గ‌న్‌.. మంత్రివ‌ర్గాన్ని విస్త‌రించారు. కీల‌క‌మైన ఎన్నిక‌ల‌స‌మ‌యంలో ఆయ‌న భారీ అంచ‌నాల‌తో ఎస్సీ, ఎస్టీ, బీసీ వ‌ర్గాల‌కు ప్రాధాన్యం ఇచ్చారు. అయితే.. అనుకున్న విధంగా మంత్రులు మాత్రం పుంజుకోలేక పోతున్నార‌నేది.. ఇప్పుడు జ‌గ‌న్ క‌నిపెట్టిన మ‌రోపెద్ద త‌ప్పిదం.

ఇలా త‌ప్పుల‌పై త‌ప్పులు.. చేసుకుంటూ వెళ్తున్న ఆయ‌న మ‌ధ్య‌లో టీంను మార్చ‌డం ద్వారా.. మ‌రో ప్ర‌ధాన త‌ప్పు చేసిన‌ట్టు బాధ‌ప‌డుతున్నారు. సాయిరెడ్డిని త‌ప్పించిపూర్తి బాధ్య‌త‌లు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డికి అప్ప‌గించారు. ఇది పార్టీని ప‌త‌నం దిశ‌గా తీసుకువెళ్తోంది. ఏ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు కూడా ఏమాత్రం హ్యాపీగా లేరు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు మ‌రోసారి మార్పుల దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టు చెబుతున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి. 

This post was last modified on March 30, 2023 7:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

53 minutes ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

1 hour ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

3 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

3 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

4 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

7 hours ago