Political News

ఎంపీ చెప్పిన ‘ముందస్తు’ జోస్యం

రానున్న నవంబర్, డిసెంబర్లో ఏపీలో ముందస్తు ఎన్నికలు జరగటం ఖాయమట. వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో జోస్యం చెప్పారు. మీడియాతో ఆయన మాట్లాడుతు తెలంగాణాలో డిసెంబర్లో జరగబోయే ఎన్నికలతోనే ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నట్లు చెప్పారు. తాజా ఢిల్లీ పర్యటనలో నరేంద్రమోడీ, అమిత్ షా తో ఈ విషయం మాట్లాడటానికే వచ్చుంటారని ఎంపీ అనుమానం వ్యక్తంచేశారు.

మోడీ, అమిత్ షా తో భేటీపై అధికార పార్టీ పైకి చెప్పే కారణాలు వేరు, లోపల మాట్లాడుకునే మాటలు వేరే ఉంటాయన్నారు. రాష్ట్రంలో పడిపోతున్న పార్టీ  గ్రాఫ్ విషయంలో జగన్ లో ఆందోళన పెరిగిపోతోందట. ఈ గ్రాఫ్ మరింతగా పడిపోకముందే ముందస్తు ఎన్నికలకు వెళిపోతే పార్టీకి కొన్ని సీట్లయినా వస్తుందన్నది జగన్ ఆలోచనగా ఎంపీ తేల్చేశారు. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ప్రభావం తమ పార్టీపైన బాగా తీవ్రంగా ఉంటుందని అంచనా వేశారు.

అందుకనే రాబోయే ఎన్నికల్లో వివేకా మర్డర్ కేసు తమ పార్టీపైన పడకుండా మ్యానేజ్ చేసుకోవడం కూడా జగన్ అజెండాలో ఒక భాగమన్నారు. మర్డర్ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిపైన సీబీఐ  ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆపేందుకు మోడీని జగన్ రిక్వెస్టు చేస్తున్నట్లు ఎంపీ ఆరోపించారు. అవినాష్ రెడ్డి జైలుకు వెళినా అంతిమ విచారణ తనదాకా రాకుండా ఉండేట్లు జగన్ తెగ ప్రయత్నాలు చేసుకుంటున్నారట.  

ఇదే సమయంలో మర్డర్ కేసులో తాను అనుకుంటున్న వారిని సీబీఐతో అరెస్టు చేయించేందుకు కూడా జగన్ కేంద్రంలోని పెద్దలను రిక్వెస్టు చేస్తున్నట్లు తనకు తెలిసిందన్నారు. ఇలాంటి చాలా విషయాలను చెప్పిన ఎంపీ రాబోయే ఎన్నికల్లో తమపార్టీకి ఘోర పరాజయం తప్పదని తేల్చేశారు. ఒకసారి 15 సీట్లొస్తే ఎక్కువని చెప్పిన ఎంపీ మరోసారి 60 సీట్లవరకు వచ్చే అవకాశముందని చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాజా సమావేశంలో మాత్రం ఘోరపరాజయం తప్పదన్నారే కానీ ఎన్నిసీట్లకు పరిమితం అవుతుందన్నది మాత్రం  మాత్రం చెప్పలేదు. మరి ఎంపీ జోస్యం నిజమవుతుందా ?

This post was last modified on March 30, 2023 3:22 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

1 hour ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

4 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

4 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

7 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

9 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

9 hours ago