Political News

ఎంపీ చెప్పిన ‘ముందస్తు’ జోస్యం

రానున్న నవంబర్, డిసెంబర్లో ఏపీలో ముందస్తు ఎన్నికలు జరగటం ఖాయమట. వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో జోస్యం చెప్పారు. మీడియాతో ఆయన మాట్లాడుతు తెలంగాణాలో డిసెంబర్లో జరగబోయే ఎన్నికలతోనే ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నట్లు చెప్పారు. తాజా ఢిల్లీ పర్యటనలో నరేంద్రమోడీ, అమిత్ షా తో ఈ విషయం మాట్లాడటానికే వచ్చుంటారని ఎంపీ అనుమానం వ్యక్తంచేశారు.

మోడీ, అమిత్ షా తో భేటీపై అధికార పార్టీ పైకి చెప్పే కారణాలు వేరు, లోపల మాట్లాడుకునే మాటలు వేరే ఉంటాయన్నారు. రాష్ట్రంలో పడిపోతున్న పార్టీ  గ్రాఫ్ విషయంలో జగన్ లో ఆందోళన పెరిగిపోతోందట. ఈ గ్రాఫ్ మరింతగా పడిపోకముందే ముందస్తు ఎన్నికలకు వెళిపోతే పార్టీకి కొన్ని సీట్లయినా వస్తుందన్నది జగన్ ఆలోచనగా ఎంపీ తేల్చేశారు. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ప్రభావం తమ పార్టీపైన బాగా తీవ్రంగా ఉంటుందని అంచనా వేశారు.

అందుకనే రాబోయే ఎన్నికల్లో వివేకా మర్డర్ కేసు తమ పార్టీపైన పడకుండా మ్యానేజ్ చేసుకోవడం కూడా జగన్ అజెండాలో ఒక భాగమన్నారు. మర్డర్ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిపైన సీబీఐ  ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆపేందుకు మోడీని జగన్ రిక్వెస్టు చేస్తున్నట్లు ఎంపీ ఆరోపించారు. అవినాష్ రెడ్డి జైలుకు వెళినా అంతిమ విచారణ తనదాకా రాకుండా ఉండేట్లు జగన్ తెగ ప్రయత్నాలు చేసుకుంటున్నారట.  

ఇదే సమయంలో మర్డర్ కేసులో తాను అనుకుంటున్న వారిని సీబీఐతో అరెస్టు చేయించేందుకు కూడా జగన్ కేంద్రంలోని పెద్దలను రిక్వెస్టు చేస్తున్నట్లు తనకు తెలిసిందన్నారు. ఇలాంటి చాలా విషయాలను చెప్పిన ఎంపీ రాబోయే ఎన్నికల్లో తమపార్టీకి ఘోర పరాజయం తప్పదని తేల్చేశారు. ఒకసారి 15 సీట్లొస్తే ఎక్కువని చెప్పిన ఎంపీ మరోసారి 60 సీట్లవరకు వచ్చే అవకాశముందని చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాజా సమావేశంలో మాత్రం ఘోరపరాజయం తప్పదన్నారే కానీ ఎన్నిసీట్లకు పరిమితం అవుతుందన్నది మాత్రం  మాత్రం చెప్పలేదు. మరి ఎంపీ జోస్యం నిజమవుతుందా ?

This post was last modified on March 30, 2023 3:22 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

చిక్కుల్లో కేసీఆర్ ‘ఆప్త అధికారి’

తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు అత్యంత ఆప్తులైన అధికారులు చాలా మంది ఉన్నారు. ఆయ‌న వ‌స్తే.. పొర్లు దండాలు పెట్టిన‌వారు…

57 mins ago

తారక్ అభయంతో అభిమాని ఆనందం

తిరుపతికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ రెండు పదుల వయసులో కూడా లేని స్థితిలో క్యాన్సర్ బారిన పడి…

2 hours ago

ప్ర‌ధాని మోడీ ఇంట కొత్త అతిధి

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ ఇంట్లో ఉన్న గోశాల‌కు పండ‌గ వ‌చ్చింది. సుమారు 30 గోవుల‌ను ఈ గోశాల‌లో పెంచు తున్నారు.…

3 hours ago

ఉప్పెన భామకు మళ్ళీ నిరాశేనా

డెబ్యూతోనే సెన్సేషనల్ హిట్ అందుకుని ఆ తర్వాత వరస డిజాస్టర్లతో టాలీవుడ్ మార్కెట్ కోల్పోయిన హీరోయిన్ కృతి శెట్టి మలయాళం…

4 hours ago

రేవంత్‌రెడ్డి…. చిట్టినాయుడు, టైగర్ కౌశిక్ భాయ్:  కేటీఆర్‌

"తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఓ.. చిట్టినాయుడు. మేం చంద్ర‌బాబు నాయుడితోనే కొట్టాడినం. ఈయ‌నెం త‌?" అని బీఆర్ ఎస్…

6 hours ago

కొత్త హీరో లాంచింగ్.. ఎన్ని కోట్లు పోశారో

హీరోయిన్‌గా రెజీనా కసాండ్రా.. ముఖ్య పాత్రల్లో ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, నాజర్, బ్రహ్మానందం, ఆలీ.. ఇంకా చాలామంది ప్రముఖ…

6 hours ago