తెలంగాణలో తాజాగా నిర్వహించిన టీడీపీ ఆవిర్భావ సదస్సులో నటుడు, అన్నగారి కుమారుడు నంద మూరి బాలకృష్ణ హాట్ కామెంట్లు చేశారు. టీడీపీ స్థాపించకపోతే.. తెలుగు వారు ఢిల్లీకి దాసోహం చేయాల్సి వచ్చేందని వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న ప్రతినాయకుడు.. టీడీపీ గూటి నుంచి ఎగిరిపోయిన పక్షే.. అని సంచలన కామెంట్లు చేశారు. ఇక, టీడీపీ స్థాపించి.. అనతికాలంలోనే అధికారం చేపట్టి తెలుగువాడు ఎక్కడున్నా సగర్వంగా తలెత్తుకునేలా చేసిన ఘనత అన్నగారు ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు.
పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, ఎస్సీ రీజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు తెచ్చిన ఘనత ఎన్టీఆర్దేనని తెలిపారు. ఎన్టీఆర్ పాలనలో పేదలకోసం ఎన్నో సాహసోపేతమైన పథకాలు తీసుకొచ్చారన్నారు. తెలుగు దేశం పార్టీ స్థాపించి తెలుగువారందరిని ఏకతాటిపై తెచ్చి అనతికాలంలో అధికారంలోకి తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.
పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దుచేసిన ఘనత ఎన్టీఆర్దేనని బాలకృష్ణ గుర్తు చేశారు. ఎస్సీ రిజర్వేషన్లు, మహిళలకు స్థానిక సంస్థల రిజర్వేషన్లు తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ప్రజల వద్దకే పాలన తెచ్చిన గొప్పవ్యక్తి అన్నారు. సహకార వ్యవస్థలో సింగల్ విండో విధానం తెచ్చిన నేత ఎన్టీఆర్ అని అన్నారు. గురుకుల విద్యా బోధన, సంక్షేమ హాస్టళ్లు తీసుకువచ్చారని వివరించారు.
అలాంటి గొప్ప వ్యక్తికి గుర్తుగా పెట్టిన ఎన్టీఆర్ వర్సిటీ పేరును వైసీపీ ప్రభుత్వం మార్చడం దౌర్భాగ్యమని బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి పాలనకు ప్రజలు బుద్ధి చెప్పాలని బాలయ్య పిలుపు నిచ్చారు. మొత్తానికి సినిమా డైలాగులతో బాలయ్య దంచికొట్టిన స్పీచ్కు పార్టీ కార్యకర్తల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది.
This post was last modified on March 30, 2023 1:42 pm
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డికేసులో తాజాగా సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ-8గా ఉన్న…
లోక్ సభ ఎన్నికలలో ఖచ్చితంగా ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. 2019…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఇప్పుడు ఇలాంటి పరిస్తితే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న…
ఇవాళ విడుదలవుతున్న సినిమాల్లో బాక్ అరణ్మయి 4 ఒకటి. మాములు తమిళ డబ్బింగ్ మూవీ అయితే ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు…
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు అంటే..అసెంబ్లీ+పార్లమెంటు ఎన్నికలు ఈ నెల 13న జరగనున్నాయి. అయితే.. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొన్ని…
మాములుగా ఒక వెబ్ సిరీస్ గురించి సినిమా ప్రేక్షకులు ఎదురు చూడటం తక్కువ. కానీ హీరామండి ఈ విషయంలో తన…