ఈ ఏడాది జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. తెలంగాణను అభివృద్ధి చేసిన పార్టీకి తెలంగాణలో పోటీ చేసే అర్హత ఉందని స్పష్టం చేశారు. ఇక్కడి ప్రజలకు ప్రాణసంకటంగా ఉన్న పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన ఘనత తెలుగు దేశం పార్టీ దేనని ఆయన తెలిపారు. అందుకే తాము ఇక్కడ పోటీకి అన్ని విధాలా అర్హులమని తెలిపారు.
ఇదేసమయంలో చంద్రబాబు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోనూ 100 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఉ న్నారని తాజాగా జరిగిన టీడీపీ ఆవిర్భావ సదస్సులో వెల్లడించారు. అయితే, వారెవరు? అనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు. వంద నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో మనం పోటీ చేస్తున్నాం.. ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయాలి.. అని చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
అయితే.. వంద నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేస్తుందన్న ప్రకటన వెనుక ఉన్న మర్మమేంటనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. తాను ఎవరితోనైనా పొత్తుకు రెడీ అని చంద్రబాబు సంకేతాలు ఇస్తున్నారా? అనేది చర్చకు దారితీసింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీకి సైతం 100 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు లేరు. ఉన్నవారిలోనూ చాలా మంది ప్రజల మధ్య బలాన్ని నిరూపించుకునే సత్తాలేదు.
ఈ నేపథ్యంలో పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి..చంద్రబాబు ఇలా వ్యాఖ్యానించి ఉంటారని.. పరిశీలకులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేసే నియోజకవర్గాల్లో బలమైన టీడీపీ శ్రేణులు.. ఉన్నారని.. హైదరాబాద్ అభివృద్ధి సహా శంషాబాద్ విమానాశ్రయాన్ని కూడా తానే నిర్మించానని చెప్పడం ద్వారా.. మరింత జోష్ పెంచుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారని పరిశీలకులు అంటున్నారు. గతానికి ఇప్పటికి కొంత జోష్ పెరిగిన మాట వాస్తవమేనని క్షేత్రస్థాయిలోనూ నాయకులు చెబుతున్నారు. మరి చంద్రబాబు వ్యూహం తెలియాలంలో మరో రెండు మూడు నెలలు వెయిట్ చేయాల్సిందే.
This post was last modified on March 30, 2023 10:41 am
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు…
ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…