ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడేం జరుగుతోంది. పాలన ఎలా ఉంది.. పైకి వెళ్తోందా.. కిందకు వెళ్తుందా.. ఇలాంటి ప్రశ్నలకు స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు సమాధానం చెప్పారు. తెలుగుదేశం 41వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగిన బహిరంగ సభకు భారీగా పార్టీ శ్రేణులు, అభిమానులు తరలి వచ్చారు. బాలయ్య మార్క్ ప్రసంగం తర్వాత పార్టీ అధినేత చంద్రబాబు గంటన్నర పాటు మాట్లాడారు.
జగన్ ప్రభుత్వ తీరును ఆయన ఎండగట్టారు. రాష్ట్రంలో తిరుగుబాటు ప్రారంభమైందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో గొడ్డలి, గన్,గంజాయి రాజ్యమేలుతున్నాయన్నారు. వైఎస్ వివేకాను గొడ్డలితో నరికారని చంద్రబాబు గుర్తు చేశారు. మంగళవారమే జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో గన్ కల్చర్ కనిపించిందన్నారు.
వివేకా హత్యకేసులో విచారణను ఎదుర్కొన్న వ్యక్తి కాల్పులు జరిపితే ఒకరు చనిపోయారన్నారు. అదీ రాష్ట్రంలో పరిస్థితికి అద్దం పడుతుందన్నారు. జగన్ పాలనలో రాష్ట్రం గంజాయి ప్రదేశ్గా మారిందన్నారు. గంజాయి రవాణాలో రాష్ట్రం నెంబర్ వన్ స్థానానికి ఎగబాకిందన్నారు. ఈ పరిస్థితి పోవాలంటే తెలుగు దేశం రావాలన్నారు. సైకోను వదిలించుకుని సైకిల్కు ఓటేసే రోజు ఎంతో దూరం లేదన్నారు.
సంపదను సృష్టించి ఆ సంపదను పేదవాళ్లకు పంచి పెట్టే ప్రక్రియ అవసరమన్నారు. ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన, మైనార్టీ వర్గాలకు సహాయపడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. గుడ్ పాలిటిక్స్, గుడ్ గవర్నెన్స్ ఆంధ్రప్రదేశ్కు, దేశానికి అవసరమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రజల జీవితాలను మార్చేది రాజకీయమని చంద్రబాబు గుర్తు చేశారు.
విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్న కొరియన్ కనకరాజుకి మోక్షం దొరికేసింది. ఆగస్ట్ 7 రిలీజ్ కు రంగం సిద్ధం…
గత వారం భారీ అంచనాల మధ్య ప్రేక్షెకుల ముందుకు వచ్చిన పెద్ది సినిమా తొలి వీకెండ్లో అంచనాలకు తగ్గట్లే భారీ…
జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పరిస్థితి. అలాంటిది కాంగ్రెస్ మంత్రితో బీజేపీ ఎంపీ భేటీ…
ఏపీలో కూటమి సర్కారు కొలువుదీరి రెండేల్లు అవుతోంది. మూడు పార్టీల కలయికతో ఏర్పడిన కూటమి… 2024 ఎన్నికల్లో అత్యంత కష్టతరమైన…
గత ఎన్నికల సమయంలో కొందరు నాయకులు పోటీ చేసిన నియోజకవర్గాల్లో వారు ఓడిపోయారు. అయితే.. ఆ తర్వాత పలువురు నేతలు..…
సత్యనారాయణ గారూ.. రేపు సిద్ధాంతం వస్తున్నా.. అక్కడ కలుద్దాం. అంటూ 87 ఏళ్ల వృద్ధుడు సత్యనారాయణకు ఆదివారం సీఎం చంద్రబాబు…