‘మగవారు పోరంబోకులు.. తినేసి వెళ్లిపోతారు’ అని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆసరా పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం శ్రీకాకుళంలోని కిల్లిపాలెం, హడ్కో కాలనీలో రెండు చోట్ల మహిళలతో సమావేశం నిర్వహించి మరీ మగవారిని పోరంబోకులంటూ విమర్శించారు. మంత్రి మాట్లాడుతూ ‘మగవాళ్లు పోరంబోకులు. బాగా తిరిగేసి వస్తారు. తినేసి వెళ్లిపోతారు. ఇలా అంటున్నప్పుడు కొంతమంది చప్పట్లు కొడుతున్నారంటే అంగీకరించినట్లే. ఆ పోరంబోకులకు అధికారం ఇవ్వకూడదన్నదే జగనన్న ప్రభుత్వ ఉద్దేశం. ఇంటిని నడిపేది ఇల్లాలు. ఆమె పేరుతో ప్రభుత్వ పథకాలు అందిస్తుంది జగన్ ప్రభుత్వం` అని అన్నారు.
ఆడవారికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అధికారం ఉంది కాబట్టే సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నామని తెలిపారు. సంపదను మీచేతిలో పెడుతున్నామని, అధికారం అప్పగించే అధికారం మీ చేతుల్లోనే ఉందని తెలిపారు. ఇంకా ఏడాది మాత్రమే అధికారం ఉందని, అది అయిపోయిన తర్వాత మరి ఇవ్వలేడని, చాలా మంది నెగిటివ్గా మాట్లాడుతున్నారని చెప్పారు. “ఇంటాయన చెప్పారని.. కొడుకు చెప్పారని.. ఓటు ఎవరికో వేయవద్దు. మహిళలకు ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు కావాలంటే వైసీపీ మరోసారి అధికారంలోకి రావాలి. అధికారంలో లేక పోతే ఇవ్వలేరు“ అని ధర్మాన వ్యాఖ్యానించారు.
మా పథకాలు తీసుకుని సైకిల్కు ఓటేస్తారా?
“ఇటీవల గార మండలంలో ఓ గ్రామం వెళ్లాను. ఓ మహిళకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా.. ఎవరిస్తున్నా రు..? అని అడిగాను. అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి.. జగన్మోహనరెడ్డి ఇస్తున్నారని చెప్పింది ఆ మహిళ. మరి ఓటు ఎవరికి వేస్తావు అని అడిగాను. సైకిల్కు వేస్తాను అని చెప్పింది . ఆమెకు జగన్ ఇస్తున్న పథకాలు తెలుసుకానీ.. పార్టీ గుర్తు తెలియలేదు. చాలామంది ఇలానే ఉన్నారు. వీరికి పూర్తిగా అవగాహన కల్పించాలి’ అని ధర్మాన పేర్కొన్నారు.
మునిసిపల్ నీళ్లు ఆపేయండి!
శ్రీకాకుళంలో హడ్కోకాలనీలో సాయంత్రం నిర్వహించిన సమావేశంలో గేట్లు వేసేసి.. మహిళలు ఎవరినీ బయటకు వెళ్లకుండా సమావేశం నిర్వహిం చారు. ఈ సమావేశంలోనే మంత్రి మాట్లాడుతూ ‘గేట్లు వేశాం కాబట్టి.. ఎవరూ గోడలు గెంతలేరు.. లేకుంటే ఇక్కడ పిట్ట కూడా ఉండదు’ అని అన్నారు. అలాగే ఈ సమయంలో మున్సిపల్ కొళాయిల నుంచి నీరు ఇవ్వవద్దని.. ఆలస్యంగా ఇవ్వాలని.. నీళ్ల కోసం వెళ్లిపోతారని వేదికపై నుంచే మంత్రి ధర్మాన.. మున్సిపల్ కమిషనర్ను ఆదేశించడం మరింత వివాదంగా మారింది.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…