Political News

ఏపీలో మురికి వాడ‌ల‌కు ప‌ర‌దాలు.. రీజ‌న్ ఇదే!

ఏపీలో సీఎం జ‌గ‌న్ ఎక్క‌డ‌కు వెళ్లినా.. ప‌ర‌దాలు క‌డుతున్నార‌ని.. ప్ర‌తిప‌క్ష పార్టీలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న విష‌యం తెలిసిందే. జ‌గ‌న్ ఎక్క‌డ ప‌ర్య‌ట‌న పెట్టుకున్నా.. పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో ప‌ర‌దాలు క‌డుతున్నారు. అదేస‌మ‌యంలో రోడ్ల‌పై చెట్లు న‌రికేస్తు న్నారు. ఈ చ‌ర్య‌ల‌పై ప్ర‌జాస్వామ్య వాదులు.. ప్ర‌తిప‌క్ష నేత‌ల నుంచి కూడా తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నా.. ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు.

అయితే..ఇప్పుడు ఏకంగా మురికి వాడ‌ల‌కు కూడా..భారీ ఎత్తున ప‌ర‌దాలు క‌ట్టేస్తున్నారు. అది కూడా ఏపీ పాల‌నా రాజ‌ధానిగా వైసీపీ పేర్కొంటున్న విశాఖ‌లోనే కావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనికి రీజ‌నేంటి? ఎందుకు? అనేది ఆస‌క్తిగా మారింది. విశాఖ వేదికగా జీ-20 సదస్సు ప్రారంభం కాబోతోంది. ఇందులో పాల్గొనేందుకు జీ-20లోని 20 సభ్యదేశాలతోపాటు ఆహ్వానిత దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు వస్తున్నారు.

ఈ నేపథ్యంలో అధికారులు దాదాపు రూ.120 కోట్లతో నగరంలో అభివృద్ధి, సుందరీకరణ, విద్యుత్‌ అలంకరణ పనులు చేపట్టారు. అదే సమయంలో కొన్ని ప్రాంతాలను మాత్రం సదస్సుకు హాజరయ్యే విదేశీ ప్రతినిధుల కంటపడకుండా అధికారులు పరదాలు కట్టడం చర్చనీయాంశమైంది. విదేశీ ప్రతినిధులు ఎయిర్‌పోర్టు నుంచి నగరంలోకి వచ్చే సమయంలో, తిరిగి వెళ్లేప్పుడు జాతీయ రహదారిని ఆనుకుని తాటిచెట్లపాలెం, అక్కయ్యపాలెం ప్రాంతాల్లోని మురికివాడలు.. వారి కంటపడకుండా ఇళ్లకు ముందు పరదాలను క ట్టేస్తున్నారు.

వివిధ దేశాలకు చెందిన 63 మంది ప్రతినిధులను ఆహ్వానించగా.. వారిలో 57 మంది హాజరవుతున్నారు. ‘రేపటి నగరాలకు ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకోవాలి?’ అనే అంశంపై సదస్సులో ప్రధానంగా చర్చిస్తారు. పట్టణీకరణలో సాధించిన విజయాలను వివిధ దేశాల ప్రతినిధులు వివరిస్తారు. మ‌రి ఇలాంటి కీల‌క చ‌ర్చ‌లో భాగం కావాల్సిన మురికి వాడ‌ల‌కు ఇప్పుడు ప‌ర‌దాలు క‌ట్ట‌డం సంచ‌ల‌నంగా మారింది.

This post was last modified on March 29, 2023 7:59 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

3 minutes ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

45 minutes ago

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

3 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

5 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

5 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

6 hours ago