ఏపీ అమరావతిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని మెట్రో అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ విషయంపై ఆయన తాజాగా స్పందించారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న మెట్రో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల్లో ప్రస్తుతం హైదరాబాద్ ముందు ఉందని ఆయన చెప్పారు. దేశంలోనే 7000+ స్క్వేర్ కిలోమీటర్ల పరిదిలో హైదరాబాద్ అభివృద్ది చెందుతోందన్నారు.
అయితే.. ఈసందర్భంగా కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ విషయంలో హైదరాబాద్ వెనుక బడి ఉండేదని.. దీనికి ప్రధాన కారణం.. గతంలో అమరావతి మెట్రో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో పనులు వేగంగా జరిగాయని చెప్పారు. అది కనుక జరిగి.. ముందుకు వెళ్లి ఉంటే.. హైదరాబాద్ ఖచ్చితంగా రెండో స్థానంలో ఉండేదని.. కానీ, ఏపీలో జరిగిన, జరుగుతున్న పరిణామాల క్రమంలో అమరావతిలో ఎలాంటి పనులు జరగడం లేదని కేటీఆర్ చెప్పారు.
అమరావతి మెట్రో అర్బన్ డెవలప్మెంట్ పనులు నిలిచిపోయిన నేపథ్యంలో హైదరాబాద్ దేవంలోనే ఫస్ట్ ప్లేస్లో ఉన్నదని కేటీఆర్ పేర్కొన్నారు. మరింతగా హైదరాబాద్ను అబివృద్ధి చేసేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నట్టు కేటీఆర్ వివరించారు. అయితే.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు.. అమరావతి అభివృద్దికి బారీ ఎత్తున నిధులు కేటాయించి.. పెద్ద ఎత్తున కంపెనీలు ఇక్కడకు వచ్చేలా చేశారు. అయితే.. వైసీపీ వచ్చిన తర్వాత..అమరావతి పనులు నిలిచిపోయాయి.
This post was last modified on March 29, 2023 12:19 am
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…
ఈటీవీ విన్.. పోస్టర్ మీద ఈ లోగో ఉంటే చాలు.. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా అందులో…
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్ టాపిక్గా మారుతుందో.. దేని మీద నెటిజన్లు చర్చలు పెడతారో చెప్పలేం. కొన్నిసార్లు ఎప్పటివో…
ఏపీలో అధికార కూటమిలోని పార్టీల మధ్య తరచూ చిన్న చిన్న వివాదాలు చెలరేగుతున్నాయి. అయితే ఈ వివాదాలన్నీ ఆయా పార్టీల కీలక నేతల ప్రమేయం…
థియేటర్లలో రిలీజైనపుడు ఆశించిన స్పందన తెచ్చుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. ‘ఈ నగరానికి…
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…