ఏపీ అమరావతిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని మెట్రో అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ విషయంపై ఆయన తాజాగా స్పందించారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న మెట్రో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల్లో ప్రస్తుతం హైదరాబాద్ ముందు ఉందని ఆయన చెప్పారు. దేశంలోనే 7000+ స్క్వేర్ కిలోమీటర్ల పరిదిలో హైదరాబాద్ అభివృద్ది చెందుతోందన్నారు.
అయితే.. ఈసందర్భంగా కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ విషయంలో హైదరాబాద్ వెనుక బడి ఉండేదని.. దీనికి ప్రధాన కారణం.. గతంలో అమరావతి మెట్రో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో పనులు వేగంగా జరిగాయని చెప్పారు. అది కనుక జరిగి.. ముందుకు వెళ్లి ఉంటే.. హైదరాబాద్ ఖచ్చితంగా రెండో స్థానంలో ఉండేదని.. కానీ, ఏపీలో జరిగిన, జరుగుతున్న పరిణామాల క్రమంలో అమరావతిలో ఎలాంటి పనులు జరగడం లేదని కేటీఆర్ చెప్పారు.
అమరావతి మెట్రో అర్బన్ డెవలప్మెంట్ పనులు నిలిచిపోయిన నేపథ్యంలో హైదరాబాద్ దేవంలోనే ఫస్ట్ ప్లేస్లో ఉన్నదని కేటీఆర్ పేర్కొన్నారు. మరింతగా హైదరాబాద్ను అబివృద్ధి చేసేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నట్టు కేటీఆర్ వివరించారు. అయితే.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు.. అమరావతి అభివృద్దికి బారీ ఎత్తున నిధులు కేటాయించి.. పెద్ద ఎత్తున కంపెనీలు ఇక్కడకు వచ్చేలా చేశారు. అయితే.. వైసీపీ వచ్చిన తర్వాత..అమరావతి పనులు నిలిచిపోయాయి.
This post was last modified on March 29, 2023 12:19 am
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కంగనా రనౌత్.. పరిశ్రమలో ఒక స్థాయి అందుకున్న దగ్గర్నుంచి తాను పని చేసే ఇండస్ట్రీలోనే…
రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…
ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…
స్థానిక ఎన్నికలపై జనసేన త్రిముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…