Political News

అమ‌రావ‌తి కేసు.. స‌ర్కారుపై సుప్రీం ఆగ్ర‌హం

అమ‌రావతి రాజ‌ధాని విష‌యంపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలంటూ.. ఏపీ ప్ర‌భుత్వం దాఖ‌లు చేసిన పిటిష‌న్ విష‌యంలో సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. “ఎందుకంత తొంద‌ర ప‌డుతున్నారు? దానిలో మీ వ్య‌క్తి గ‌త ప్ర‌యోజ‌నాలు లేవుక‌దా.. ఉంటే చెప్పండి!” అని ఏపీ ప్ర‌భుత్వం త‌ర‌పు న్యాయ‌వాదుల‌నుఉద్దేశించి.. తాజాగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వాస్త‌వానికి సుప్రీంకోర్టులో మంగ‌ళ‌వారం అమ‌రావ‌తి కేసు విచార‌ణ‌కు రావాల్సి ఉంది. ఈ కేసుకు కోర్టురిజిస్ట్రీ 10వ నెంబ‌రు కేటాయించారు.

అయితే.. 8వ నెంబర్ కేసుపై విచారణ జరుగుతుండగా ధర్మాసనం ముందు అమరావతి కేసును ప్రస్తావించేందుకు ఏపీ న్యాయవాదులు ప్రయత్నించారు. దీంతో జస్టిస్ కేఎం జోసెఫ్ అసహనం వ్యక్తం చేశారు. అమరావతి పిటీషన్‌ను వెంటనే విచారణకు తీసుకోవాలని ఏపీ తరపు సీనియర్ న్యాయవాదులు నఫ్డే, నిరంజన్ రెడ్డి ప్రస్తావించారు. అయితే ఒక కేసు సగం విచారణలో ఉండగా మరో కేసు ఎలా విచారించాలి..? అసలు ఎందుకు ఇంత తొంద‌ర ప‌డుతున్నారు? మీ వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ఉన్నాయా? అని న్యాయమూర్తి జస్టిస్ కెఎం జోసెఫ్ ప్రశ్నించారు.

సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఒక కేసు విచారణ పూర్తి కాకుండా.. మరో కేసు విచారించడం తగదని అన్నారు. న్యాయమూర్తి కెఎం జోసెఫ్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఏపీ లాయర్లు మిన్నకుండిపోయారు. కాగా.. సుప్రీం కోర్టులో కేసుల విచారణ జాబితా వరుస మారడంతో అమరావతి కేసుపై విచారణ ఆలస్యమైంది. మొదటి 5 కేసుల విచారణ తర్వాత 12వ నెంబర్ నుంచి 20 నెంబర్ కేసు వరకు విచారణ జరుగుతుంది. ఆ తర్వాత 7వ నెంబర్ కేసు నుంచి 11వ నెంబర్ కేసు విచారణ జరుగుతుంది. ఆ తర్వాత 21 నుంచి 39, 41వ నెంబర్ కేసులను కోర్టు విచారిస్తుంది. ప్రస్తుతం 10వ నెంబర్ కేసుగా అమరావతి రాజధాని కేసు ఉంది.

సుదీర్ఘ వాయిదా..

అమరావతి రైతుల పిటిషన్‌‌తో పాటు ప్రభుత్వం పిటిషన్‌పై విచారణను జులై 11కి ధర్మాసనం వాయిదా వేసింది. ప్రభుత్వం తరపు పిటిషన్‌ను జులై 11న తొలి కేసుగా విచారణకు తీసుకుంటామని ధర్మాసనం చెప్పింది. మూడు రాజధానుల చట్టాలను ఉపసంహరించుకున్న తరువాత ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అర్ధం లేదన్న ఏపీ తరపు సీనియర్ కౌన్సిల్ కెకె వేణుగోపాల్ వాదనలు వినిపించారు. అయితే.. ఏపీ ప్రభుత్వ లాయర్లు చేసిన విజ్ణప్తులను న్యాయమూర్తి జస్టిస్ కె ఎం జోసెఫ్ పట్టించుకోలేదు. జూన్ 16న జస్టిస్ కె ఎం జోసెఫ్ పదవీ విరమణ చేయనున్నారు. అందుకే కేసు విచారణను జులై 11కు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.

This post was last modified on March 28, 2023 7:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈటీవీ విన్… జాగ్రత్తపడాలి

ఈటీవీ విన్.. పోస్టర్ మీద ఈ లోగో ఉంటే చాలు.. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా అందులో…

27 minutes ago

బన్నీపై 7th ఫెయిల్ ట్రోలింగ్

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్ టాపిక్‌గా మారుతుందో.. దేని మీద నెటిజన్లు చర్చలు పెడతారో చెప్పలేం. కొన్నిసార్లు ఎప్పటివో…

1 hour ago

కూటమి నాయకులు అలా నేతలేమో ఇలా

ఏపీలో అధికార కూటమిలోని పార్టీల మధ్య తరచూ చిన్న చిన్న వివాదాలు చెలరేగుతున్నాయి. అయితే ఈ వివాదాలన్నీ ఆయా పార్టీల కీలక నేతల ప్రమేయం…

1 hour ago

కల్ట్ సీక్వెల్… ఈసారి సెటప్ అక్కడ

థియేటర్లలో రిలీజైనపుడు ఆశించిన స్పందన తెచ్చుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. ‘ఈ నగరానికి…

1 hour ago

హహ హాసిని… స్టేజ్ మీద ఏడ్చేసింది

జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…

3 hours ago

మీ వాళ్లకు చెప్పండి… ఏపీ సీఎంకి తెలంగాణ మంత్రి లేఖ

తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…

4 hours ago