Political News

అప్పుడు లక్ష్మీపార్వతి.. ఇప్పుడు సజ్జల

ఎమ్మెల్సీ ఎన్నికలతో మారిన ఏపీ రాజకీయ వాతావరణానికి తగ్గట్లు వరుస పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటివరకు విపక్షాలపై విరుచుకుపడే వైసీపీ.. ఇప్పుడు తమలో తాము అనుకునే పరిస్థితిలోకి వెళ్లిపోయింది. నష్ట నివారణ చర్యల విషయంలో సీఎం జగన్ మౌనం ఒకపక్క.. ఆయన కార్యకలాపాల్ని చక్కదిద్దే ఆయన సలహాదారు సజ్జల కొత్త తరహా దాడి ఎక్కువైంది. దీంతో.. అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ రాఘురామ క్రిష్ణరాజుసంచలన వ్యాఖ్యలు చేశారు. “ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న వేళలో.. రాజ్యాంగేతర శక్తిగా మారిన లక్ష్మీ పార్వతి పంచాయితీతో చోటు చేసుకున్న పరిణామాల్ని గుర్తుకు తెచ్చేలా వైసీపీ ఎంపీ మాటలు ఉన్నాయి. నాడు టీడీపీలో లక్ష్మీపార్వతిలా నేడు వైసీపీలో సజ్జల వ్యవహరిస్తున్నారు. గతంలో టీడీపీలో తలెత్తిన సంక్షోభం లాంటిది మన పార్టీలో తలెత్తకుండా చూసుకోండి. ఎన్టీఆర్ మంచివారే అయినప్పటికీ లక్ష్మీపార్వతి ప్రమేయం ఎక్కువ కావటంతో 1995లో టీడీపీలో సంక్షోభం తలెత్తింది.

సజ్జల రామక్రిష్ణారెడ్డి మన పార్టీలో లక్ష్మీ పార్వతిలా వ్యవహరిస్తున్నారని పలువురు చెబుతున్నారు. పరిస్థితి చేయి దాటక ముందే ఆయన్నుపక్కన పెట్టకపోతే ఎక్కువమందిలో అసంత్రప్తి పెరుగుతుంది.. అని వ్యాఖ్యానించారు. ఇప్పటికి అత్యధిక ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రేమిస్తున్నారన్న ఎంపీ రఘురామ.. ఒకప్పటి సాక్షి దినపత్రిక ఉద్యోగి సజ్జల రామక్రిష్ణారెడ్డికి రిపోర్టు చేయాలని చెప్పటం సరికాదన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన ఓటును జయమంగళ వెంకటరమణకు ఓటు వేశానని చెబుతున్నారని.. అయినా ఆయనపై చర్యలు తీసుకోవటం ఏమిటి? అని ప్రశ్నించారు. జగన్ కోసం మేకపాటి కుటుంబం ఎంత చేసిందంటూ గతాన్ని గుర్తు తెచ్చే ప్రయత్నం చేశారు.

వైసీపీ కోసం మేకపాటి కుటుంబం ఎన్నో త్యాగాలు చేసింది. వైసీపీ పెట్టాలనుకున్నప్పటి నుంచి మేకపాటి గౌతం రెడ్డి పార్టీకి వెన్నుముకగా మారారు. జగన్ పార్టీ పెట్టాలనుకున్నప్పుడు ఆయనకు మద్దతుగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన శాసన సభా సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో జయమంగళానికి ఓటు వేశానని.. అందుకే ఆయన గెలిచారని చెబుతున్నారు. అయినప్పటికీ చంద్రశేఖర్ రెడ్డిపై వేటు వేయటం సిగ్గుచేటు” అని వ్యాఖ్యానించారు. రెబల్ ఎంపీ రఘురామ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మరి.. దీనికి వైసీపీ అధినాయకత్వం ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి.

This post was last modified on March 28, 2023 12:47 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

మొదటి రిలీజ్ 3 కోట్లు – రీ రిలీజ్ 7 కోట్లు

ఎప్పుడో ఆరేళ్ళ క్రితం రిలీజైన సినిమా. ఓటిటిలో వచ్చేసి అక్కడా మిలియన్ల వ్యూస్ సాధించుకుంది. ఇప్పుడు కొత్తగా రీ రిలీజ్…

6 hours ago

శంకర్ ఆడుతున్న ఒత్తిడి గేమ్

సెప్టెంబర్ నెల సగానికి పైనే అయిపోయింది. ఇకపై ఆకాశమే హద్దుగా గేమ్ ఛేంజర్ నాన్ స్టాప్ అప్డేట్స్ ఉంటాయని దిల్…

6 hours ago

ముందు లక్కు వెనుక చిక్కు

యూత్ హీరో సుహాస్ కొత్త సినిమా గొర్రె పురాణం ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కానుంది. ట్రైలర్ కూడా వచ్చేసింది.…

6 hours ago

జానీ మాస్ట‌ర్‌పై జ‌న‌సేన వేటు.. ఏం జ‌రిగింది?

జ‌న‌సేన పార్టీ నాయ‌కుడు, ప్ర‌ముఖ సినీ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్‌పై పార్టీ వేటు వేసింది. ఆయ‌న‌ను పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా…

6 hours ago

డిజాస్టర్ సినిమాకు రిపేర్లు చేస్తున్నారు

కొన్ని నెలల క్రితం లాల్ సలామ్ అనే సినిమా ఒకటొచ్చిందనే సంగతే చాలా మంది సగటు ప్రేక్షకులు మర్చిపోయి ఉంటారు.…

11 hours ago

చిన్న బడ్జెట్‌లతో పెద్ద అద్భుతాలు

స్టార్ హీరోలు నటించిన సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చి భారీ వసూళ్లు సాధించడంలో ఆశ్చర్యం లేదు. కానీ చిన్న బడ్జెట్…

12 hours ago