Political News

అప్పుడు లక్ష్మీపార్వతి.. ఇప్పుడు సజ్జల

ఎమ్మెల్సీ ఎన్నికలతో మారిన ఏపీ రాజకీయ వాతావరణానికి తగ్గట్లు వరుస పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటివరకు విపక్షాలపై విరుచుకుపడే వైసీపీ.. ఇప్పుడు తమలో తాము అనుకునే పరిస్థితిలోకి వెళ్లిపోయింది. నష్ట నివారణ చర్యల విషయంలో సీఎం జగన్ మౌనం ఒకపక్క.. ఆయన కార్యకలాపాల్ని చక్కదిద్దే ఆయన సలహాదారు సజ్జల కొత్త తరహా దాడి ఎక్కువైంది. దీంతో.. అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ రాఘురామ క్రిష్ణరాజుసంచలన వ్యాఖ్యలు చేశారు. “ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న వేళలో.. రాజ్యాంగేతర శక్తిగా మారిన లక్ష్మీ పార్వతి పంచాయితీతో చోటు చేసుకున్న పరిణామాల్ని గుర్తుకు తెచ్చేలా వైసీపీ ఎంపీ మాటలు ఉన్నాయి. నాడు టీడీపీలో లక్ష్మీపార్వతిలా నేడు వైసీపీలో సజ్జల వ్యవహరిస్తున్నారు. గతంలో టీడీపీలో తలెత్తిన సంక్షోభం లాంటిది మన పార్టీలో తలెత్తకుండా చూసుకోండి. ఎన్టీఆర్ మంచివారే అయినప్పటికీ లక్ష్మీపార్వతి ప్రమేయం ఎక్కువ కావటంతో 1995లో టీడీపీలో సంక్షోభం తలెత్తింది.

సజ్జల రామక్రిష్ణారెడ్డి మన పార్టీలో లక్ష్మీ పార్వతిలా వ్యవహరిస్తున్నారని పలువురు చెబుతున్నారు. పరిస్థితి చేయి దాటక ముందే ఆయన్నుపక్కన పెట్టకపోతే ఎక్కువమందిలో అసంత్రప్తి పెరుగుతుంది.. అని వ్యాఖ్యానించారు. ఇప్పటికి అత్యధిక ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రేమిస్తున్నారన్న ఎంపీ రఘురామ.. ఒకప్పటి సాక్షి దినపత్రిక ఉద్యోగి సజ్జల రామక్రిష్ణారెడ్డికి రిపోర్టు చేయాలని చెప్పటం సరికాదన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన ఓటును జయమంగళ వెంకటరమణకు ఓటు వేశానని చెబుతున్నారని.. అయినా ఆయనపై చర్యలు తీసుకోవటం ఏమిటి? అని ప్రశ్నించారు. జగన్ కోసం మేకపాటి కుటుంబం ఎంత చేసిందంటూ గతాన్ని గుర్తు తెచ్చే ప్రయత్నం చేశారు.

వైసీపీ కోసం మేకపాటి కుటుంబం ఎన్నో త్యాగాలు చేసింది. వైసీపీ పెట్టాలనుకున్నప్పటి నుంచి మేకపాటి గౌతం రెడ్డి పార్టీకి వెన్నుముకగా మారారు. జగన్ పార్టీ పెట్టాలనుకున్నప్పుడు ఆయనకు మద్దతుగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన శాసన సభా సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో జయమంగళానికి ఓటు వేశానని.. అందుకే ఆయన గెలిచారని చెబుతున్నారు. అయినప్పటికీ చంద్రశేఖర్ రెడ్డిపై వేటు వేయటం సిగ్గుచేటు” అని వ్యాఖ్యానించారు. రెబల్ ఎంపీ రఘురామ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మరి.. దీనికి వైసీపీ అధినాయకత్వం ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి.

This post was last modified on March 28, 2023 12:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తారక్ ఫ్యాన్స్‌కు ఆ రోజు నిద్ర ఉండదు

మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…

41 minutes ago

‘పోకిరి’లో ఆ ట్రాక్ పూరి తీసేద్దామనుకుంటే..

టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…

2 hours ago

ఇక రాంబాబు రానట్టే

సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్‌లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…

3 hours ago

వెంకీ మాట విన‌క‌పోవ‌డంతోనే ఆ ఫ్లాప్

తెలుగు సినీ చ‌రిత్ర‌లోనే అత్యంత హైప్ మ‌ధ్య విడుద‌లైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒక‌టి. 2001 సంక్రాంతికి మృగ‌రాజు, న‌ర‌సింహ‌నాయుడు లాంటి…

5 hours ago

మూకుమ్మడిగా మహేష్ సినిమాలను పిండుతున్నారు

రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…

7 hours ago

సోషల్ మీడియా వేరే ప్రపంచం కాదే

ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…

12 hours ago