టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర హాఫ్ సెంచరీ కొట్టింది. యాభై రోజుల తర్వాత కూడా లోకేష్ అదే ఊపులో నడుస్తుంటే లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానులు ఆయన వెంట నడుస్తున్నారు. పీలేరు పాదయాత్ర సందర్భంగా లోకేష్ చేసిన భూకబ్జా ఆరోపణలపై వైసీపీ ప్రభుత్వం స్పందించలేదు. దీనితో లోకేష్ మరోమారి దీన్ని ప్రస్తావించారు.
పీలేరు భూఆక్రమణలపై సీబీఐ లేదా సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని నేరుగా ముఖ్యమంత్రి జగన్ కు లోకేష్ లేఖ రాశారు. భూ ఆక్రమణల ఆరోపణలకు తాను కట్టుబడి ఉన్నానని లోకేష్ అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భూ మాఫియా దందా చేస్తోందని, అందులోనూ పీలేరు నియోజకవర్గంలో మాఫియా ఆగడాలు పెరిగిపోయాయని లోకేష్ అంటున్నారు.
మొత్తం 601.37 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు మదనపల్లి సబ్ కలెక్టర్ సవివర నివేదిక సమర్పించారని లోకేష్ అన్నారు. తెలుగుదేశం పోరాటంతో చిత్తూరు కలెక్టర్ పీలేరులోని డీకేటీ భూములు, ప్రభుత్వ భూముల అక్రమ కబ్జాపై 2021లోనే విచారణ చేయించారని గుర్తు చేశారు. పీలేరులోని భూ కుంభకోణంపై సిఐడి లేదా సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీకి చెందిన పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గతంలో శాసనసభలో కోరిన సంగతిని లోకేష్ గుర్తుచేశారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కబ్జాదారులకు కొమ్ము కాస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది..
రాష్ట్రంలో భూమాఫియాకు వ్యతిరేకంగా తెలుగుదేశం నిరంతర పోరాటం కొనసాగిస్తుందని లోకేష్ వెల్లడించారు. తమ ఫిర్యాదులపై చర్యలకు కలెక్టర్ సహా అధికారులందరూ సిద్ధమవుతున్నప్పటికీ, కొన్ని అదృశ్య శక్తులు వారికి అడ్డం పడుతున్నాయన్నారు. నిజంగా దమ్మున్న ప్రభుత్వమైతే ప్రతి ఆరోపణపై విచారణ జరపాలని లోకేష్ డిమాండ్ చేశారు….
This post was last modified on March 27, 2023 2:37 pm
ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయడం అన్నది పెద్ద రిస్క్గా మారిపోయిన మాట వాస్తవం. ఇంటర్నెట్, ఓటీటీల విప్లవం వల్ల…
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…