Political News

రికమండ్ చేయరూ ప్లీజ్

రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ డౌన్ అయిపోతోంది. టీడీపి పట్ల జనంలో నమ్మకం పెరుగుతోంది. టీడీపీ నేతలు, కార్యకర్తల్లో ఎక్కడ లేని ఉత్సాహం కనిపిస్తోంది. ఇప్పుడు అన్ని దారులు టీడీపీ వైపే చూపిస్తున్నాయి. వైసీపీలోని కొందరు నేతలు టీడీపీలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. వారికి మించి.. కాంగ్రెస్ నుంచి వలసలకు చాలా మంది సిద్ధమవుతున్నారు.

తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ మునిగింది. వరుసగా రెండు ఎన్నికల్లో ఓడిపోయి కోలుకోలేని దెబ్బతిన్నది. ఆ పార్టీకి మచ్చుకైనా ఒక ఎమ్మెల్యే కూడా లేరు. వచ్చే ఎన్నికల్లోనైనా ఒక్కరూ గెలుస్తారన్న నమ్మకం కలగడం లేదు. దానితో కాంగ్రెస్ నేతలు పక్క చూపులు చూస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, కేంద్ర మంత్రులుగా చేసిన వారు ఇప్పుడు టీడీపీలోకి వెళ్లాలనుకుంటున్నారు.

ఎన్నికలు వచ్చే లోపే పెట్టేబెడా సర్దుకుని వెళ్లి పసుపు కండువా కప్పుకోవాలనుకుంటున్నారు. టీడీపీలో ఇప్పటికే గుంపులు పెరగడంతో వారిని సాదరంగా ఆహ్వానించే పరిస్థితి లేదు. టీడీపీ అధినేత చంద్రబాబును నేరుగా కలిసే అవకాశాలు చాలా మందికి దొరకడం లేదు. డైరెక్టుగా అడిగితే ఎలాంటి సమాధానం వస్తుందో తెలీదు. దానితో ఇప్పుడు చంద్రబాబుకు సన్నిహితులైన రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, మీడియా పెద్దల రికమండేషన్ కోసం కాంగ్రెస్ నేతలు నానా తంటాలు పడుతున్నట్లు సమాచారం.

వారికి రోజూ ఫోన్లు చేసి ఏదోటి చేయాలని, వీలైనంత త్వరగా సహాయ పడాలని కోరుతున్నారట. అయితే చంద్రబాబు దగ్గర చెప్పి ఆయన వైపు నుంచి ఇప్పుడు కాదులే అని సమాధానం వస్తే తాము ఇబ్బంది పడాల్సి వస్తోందని సదరు పెద్దలు ఆలోచిస్తున్నారట. టీడీపీలో ఇప్పుడు అందరినీ చేర్చుకునే అవకాశాలు లేవని ఆ పెద్దలకు అర్థమైపోయింది. దానితో రికమండ్ చేసేందుకు వెనుకాడుతున్నారు. కాంగ్రెస్ నేతల ప్రయత్నాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. రాజకీయ నాయకులంటే ఆశావాదులు కదా..

This post was last modified on March 27, 2023 12:08 pm

Share
Show comments

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago