Political News

కటౌట్ కు కాపలాగా పోలీసులు

ప్రజాజీవితంలో ఉండి.. తమ జీవితాన్ని ప్రజల కోసం ధారపోసే నేతల వైభోగం ఏ రేంజ్ లో ఉంటుందన్న విషయాన్ని చెప్పేందుకు తాజా ఉదంతానికి మించిన ఉదాహరణ మరేదీ ఉండదని చెప్పాలి. గత ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకొని.. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ యాదవ్.. తన తీరుతో తరచూ వార్తల్లో నిలిచేవారు. ఆ మధ్యన జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో పదవిని పోగొట్టుకున్నఆయన.. ప్రస్తుతం మాజీ మంత్రిగా.. ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు.

రెండురోజుల క్రితం ఆయన పుట్టిన రోజు జరిగింది. ఈ సందర్భంగా బర్త్ డే వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. అక్కడితో ఆగితే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ.. ఆయన చేసిన చేష్ట ఇప్పుడు అందరి నోట నానుతోంది. నెల్లూరు నర్తకి సెంటర్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్ఱహానికి అడ్డుగా భారీగా ఉన్న అనిల్ కుమార్ కటౌట్ ను ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి అడ్గుగా ఉన్న కటౌట్ ను ఏర్పాటు చేయటంపై టీడీపీ నగర ఇన్ చార్జి అభ్యంతరం వ్యక్తం చేశారు. కటౌట్ ను తొలగించాలని కోరారు.

అయితే.. ఇందుకు పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేదు. మరోవైపు.. తాజాగా టీడీపీలో చేరిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నర్తకి సెంటర్ కు వచ్చారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు ఆయన అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రిగారి నిలువెత్తు కటౌట్ ను తొలగిస్తారన్న సందేహానికి గురైన పోలీసులు.. భారీగా మొహరించారు.

నగరంలో కటౌట్లు.. ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతి లేదని.. నిషేధం ఉందని చెప్పే అధికారులు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నిలువెత్తు కటౌట్ ను చూస్తూ ఎలా ఉన్నారన్న ప్రశ్నలు ఎక్కువ అయ్యాయి. అంతేకాదు.. మాజీ మంత్రి అనిల్ కటౌట్ ను టీడీపీ వారు తొలగిస్తారేమోనన్న సందేహంతో ఒక సీఐతో సహా మొత్తం 15 మంది పోలీసుల్ని కటౌట్ కు భద్రత కల్పించేందుకు కేటాయించటం విస్మయానికి గురి చేస్తోంది. ఒక నేతకు భద్రత పెంచటం ఒక పద్దతి. అందుకు భిన్నంగా ఒక కటౌట్ కు 15 మంది పోలీసు సిబ్బందిని కేటాయించిన వైనం షాకింగ్ గా మారింది.

This post was last modified on March 27, 2023 11:15 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సేఫ్ హౌస్ లోకి పారిపోయిన పాక్ ప్రధాని

భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ మొదలై రెండు రోజులు కూడా ముగియలేదు…అప్పుడే పాకిస్తాన్ తన అపజయాన్ని అంగీకరించే దిశగా సాగుతోంది.…

17 minutes ago

అమరావతి మూలపాడు దశ తిరుగుతుంది

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నవ నగరాలతో నిర్మితం కానున్న సంగతి తెలిసిందే. వీటిలో అత్యధిక ప్రాధాన్యం కలిగిన క్రీడా…

22 minutes ago

బుక్ మై షోలో ‘వీరమల్లు’

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కొన్నేళ్ల నుంచి విడుదల కోసం ఎదురు చూస్తున్న సినిమా.. హరిహర వీరమల్లు. పవన్…

2 hours ago

క్లాసిక్ సీక్వెల్ – రామ్ చరణ్ డిమాండ్

35 సంవత్సరాల తర్వాత విడుదలవుతున్న జగదేకవీరుడు అతిలోకసుందరిని ఆస్వాదించడం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారని అడ్వాన్స్ బుకింగ్స్ తేటతెల్లం చేశాయి.…

3 hours ago

ఇంటరెస్టింగ్ డే : శ్రీవిష్ణు VS సామ్

కొత్త శుక్రవారం వచ్చేసింది. హిట్ 3 ది థర్డ్ కేస్ తో మే నెలకు బ్రహ్మాండమైన బోణీ దొరికాక ఇప్పుడు…

3 hours ago

పాక్ దొంగ దారి!… యుద్ధం మొదలైనట్టే!

దాయాదీ దేశాలు భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధం మొదలైపోయిందనే చెప్పాలి. ఈ మేరకు గురువారం యుద్ధం జరుగుతున్న తీరుకు…

11 hours ago