Political News

దత్తపుత్రుడు జగనే.. ఏపీ సీఎంపై సంచలన ఆరోపణ

ఏపీలో రాజకీయాలలో ప్రధాన పార్టీలు రెండూ కేంద్రంలోని ఒకే పార్టీ ప్రాపకం కోసం పాకులాడుతున్నాయి. వైసీపీ, బీజేపీల ఫ్రెండ్షిప్ ముగిస్తే తాను బీజేపీతో ఫ్రెండ్షిప్ చేయాలని టీడీపీ తహతహలాడుతోంది. ఎందుకో కానీ బీజేపీ వైపు నుంచి అలాంటి అడుగులే పడడం లేదు. అయినా, టీడీపీ అధినేత చంద్రబాబు కానీ, ఆయన పార్టీ నేతలు కానీ బీజేపీని పల్లెత్తు మాట అనడం లేదు. ఏదో ఒక రోజు బీజేపీ కరుణించకపోదా అని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఆ కారణంగానే వైసీపీని, జగన్‌ను కూడా బీజేపీతో లింక్ చేసి విమర్శలు చేయలేకపోతున్నారు చంద్రబాబు.

ఇక జనసేన కూడా టెక్నికల్‌గా బీజేపీతో పొత్తులో ఉన్నందున పవన్ కల్యాణ్ కూడా బీజేపీని ఏమీ అనే పరిస్థితి లేదు. తనను చంద్రబాబుకు దత్తపుత్రుడు అని జగన్ సహా వైసీపీ నేతలు పదేపదే విమర్శిస్తున్నా దాన్ని పవన్, చంద్రబాబులు ఎన్నడూ బలంగా తిప్పికొట్టలేకపోయారు. బీజేపీకి జగన్ కూడా దత్తపుత్రుడులానే ఉన్నారని అనలేకపోయారు. కానీ… మాజీ ఎంపీ హర్షకుమార్ తాజాగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీకి జగన్ దత్తపుత్రుడని హర్ష కుమార్ ఆరోపించారు. ఆ కారణం వల్లే ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కాకుండా జగన్‌ బయటపడగలిగారని ఆయన ఆరోపించారు. మోదీకి దత్తపుత్రుడు కావడం వల్లే జగన్ గర్వంతో విర్రవీగుతున్నారని హర్షకుమార్ ఆరోపించారు. జగన్ పొగరు ఆయన నాశనానికేనని హర్ష కుమార్ అన్నారు.

వైసీపీ ఎమ్మెల్యేలలో ఇదే అభిప్రాయం ఉందని.. అది పట్టభద్రుల ఎన్నికలలో బయటపడిందని హర్షకుమార్ అన్నారు. వైసీపీ ఓటమికి ప్రధాన కారణం జగనేనని.. ఇంకే కారణం లేదని ఆయన అన్నారు. దళితులను హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేయలేదని.. కల్తీ మద్యం అమ్మకాలతో డబ్బు సంపాదిస్తున్నారని హర్షకుమార్ ఆరోపించారు.

This post was last modified on March 26, 2023 6:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సినిమా నచ్చకపోతే బాలేదని నలుగురికి చెప్పండి

ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయ‌డం అన్న‌ది పెద్ద రిస్క్‌గా మారిపోయిన మాట వాస్త‌వం. ఇంట‌ర్నెట్, ఓటీటీల విప్ల‌వం వ‌ల్ల…

34 minutes ago

శుభవార్త చెప్పబోతున్న అఖండ 2 ?

గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…

3 hours ago

AI తెచ్చే ప్రమాదాల్లో ఇదింకా మొదటిది

తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…

4 hours ago

నీలంబరి ఎలా బ్రతుకుతుంది నరసింహా

డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…

5 hours ago

ఇండి`గోల`పై నాయుడుతో మోదీ ఏమన్నారంటే…

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఇండిగో విమాన సేవ‌లు ర‌ద్ద‌యి.. కొన్ని విమానాలు తీవ్ర ఆల‌స్య‌మై.. ల‌క్ష‌ల సంఖ్య‌లో ప్ర‌యాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…

6 hours ago

‘ఉప్పెన’తో సినిమాలు ఆపేద్దాం అనుకున్న బేబమ్మ

కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…

6 hours ago