వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాక గత నాలుగేళ్లలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు వ్యతిరేకత, అసమ్మతి స్వరాలు ఎదుర్కొంటున్నారు. పార్టీలో అసంతృప్త నేతలందరూ ఒక్కొక్కరుగా బయటికి వస్తూ జగన్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు.
అందులోనూ తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగలడంతో అసమ్మతి నేతల స్వరం మరింత పెరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేసి టీడీపీ అభ్యర్థి అనురాధ విజయానికి దోహదం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆనం రామనారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఒకే రోజు జగన్ మీద తీవ్ర స్థాయి విమర్శలు, ఆరోపణలకు దిగారు. ముఖ్యంగా శ్రీదేవి.. జగన్ మీద చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన పథకాల్లో జగనన్న ఇళ్ల నిర్మాణం ఒకటి. ఐతే అదో పెద్ద స్కామ్ అని శ్రీదేవి ఆరోపించారు. జగనన్న ఇళ్ల కాలనీల్లో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆమె ఆరోపించారు. అమరావతి రైతుల విషయంలో గతంలో చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేసిన శ్రీదేవి.. రైతులకు క్షమాపణ చెప్పారు. వారి పోరాటానికి తన మద్దతు ఉంటుందని అన్నారు. డాక్టర్ సుధాకర్, డాక్టర్ అచ్చెన్నల మాదిరే తనను కూడా చంపేయాలని కుట్ర జరుగుతోందని.. ఏపీలో దళితులకు ఏ మాత్రం రక్షణ లేని అరాచక పరిస్థితులు నెలకొన్నాయని.. అందుకే తాను హైదరాబాద్లో ఉండి ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తోందని ఆమె వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యే అయిన తన పరిస్థితే ఇలా ఉంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి ఆమె ప్రశ్నించారు. తనకు ప్రాణ హాని ఉందని.. తనకు ఏదైనా జరిగితే సజ్జల రామకృష్ణారెడ్డిదే బాధ్యత అని ఆమె అన్నారు. తనకు ప్రాణ హాని లేదని ప్రభుత్వ పెద్దలు హామీ ఇస్తేనే తాను ఏపీలో అడుగు పెడతానని శ్రీదేవి వ్యాఖ్యానించారు. జగన్కు తాను త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ఆమె చివరగా పంచ్ ఇచ్చారు.
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో తెలిసిందే. ప్రతిసారీ అవార్డులు ప్రకటించినపుడు గ్రహీతల అర్ఙతల…