Political News

‘చంద్రబాబూ… నాన్చొద్దు’.. సీనియర్ల సజెషన్

ఎమ్మెల్సీ ఎన్నికలతో ఒక్కసారిగా ఏపీలో టీడీపీ జోష్‌లోకి వచ్చినా చంద్రబాబు గతంలో చేసిన పొరపాట్లను మళ్లీ చేస్తారేమోనని ఆ పార్టీ నేతలు ఆందోళ వ్యక్తంచేస్తున్నారు. లెక్క ప్రకారం ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచి క్షేత్రస్థాయిలో పనిచేసుకుంటూ పోతే తప్ప బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోలేని.. ప్రభుత్వ వ్యతిరేకతను నమ్ముకుని ఎన్నికలకు వెళ్లడం కంటే సొంత బలాన్ని నమ్ముకుని వెళ్లాలని పార్టీ నేతలు సూచిస్తున్నారు.

అయితే, గతంలో చంద్రబాబు చేసిన తప్పులు ఈసారి చేయకపోతే మంచి ఫలితాలు వస్తాయని అంటున్నారు. అభ్యర్థుల ఖరారు విషయంలో చివరి నిమిషం వరకు నాన్చకుండా ముందే ప్రకటించడం వల్ల ప్రయోజనం అధికంగా ఉంటుందని చెప్తున్నారు. చివరి నిమిషంలో టికెట్లు కేటాయిస్తే టికెట్లు రాని నాయకులను బుజ్జగించడానికి, వారిని మళ్లీ పార్టీ కోసం పనిచేయించేలా చేయడానికి సమయం చాలదని చెప్తున్నారు.

టికెట్ల విషయంలో పోటీ తీవ్రంగా ఉన్న నియోజకవర్గాలలో తప్ప మిగతా చోట్ల అధికారికంగా ప్రకటించేస్తే ఆయా అభ్యర్థులు నియోజకవర్గాలకే పరిమితమై ప్రచారం చేసుకుంటారని చెబుతున్నారు. ముఖ్యంగా చివరి నిమిషంలో టికెట్లు ఖరారు చేస్తే టికెట్ రాని వారు కచ్చితంగా అసంతృప్తికి గురవుతారని.. అసంతృప్తి చల్లారే సమయం దొరకదని గత అనుభవాలతో సీనియర్ నేతలు చెప్తున్నారు.

మరోవైపు పాతతరం నేతలు చంద్రబాబును కలిసి హామీలు తీసుకుంటూ, కొత్తతరం నేతలు లోకేశ్‌ను కలిసి హామీలు తీసుకుంటూ ఎవరికి వారు తమకే టికెట్లు వస్తాయన్న అంచనాలలో ఉంటున్నారని.. ఇది పార్టీలో గందరగోళానికి దారితీస్తోందని చెప్తున్నారు. టికెట్ల విషయం మొత్తం చంద్రబాబే చూసుకుంటారని అనుకోవడానికి ఏమాత్రం వీల్లేదని.. ఇప్పటికే లోకేశ్ తన పాదయాత్రలో భాగంగా కొన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటిస్తుండడంతో టికెట్ల విషయంలో ఎవరిది తుది నిర్ణయమో అర్థం కావడం లేదని ఓ సీనియర్ నేత ఇటీవల వ్యాఖ్యానించారు.

కాగా… చంద్రబాబు ఇప్పటికే 90 మంది వరకు నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని… వారు నియోజకవర్గాలలో పనిచేసుకుంటున్నారని కూడా టీడీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది. అయితే, అధికారికంగా ప్రకటించకపోతే మాత్రం సొంత పార్టీలోని రెబల్స్ వల్ల నష్టపోకతప్పదని వీలైనంత వేగం టికెట్లపై ప్రకటన చేయాలని అంటున్నారు.

This post was last modified on March 26, 2023 12:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

11 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

55 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago