Political News

తండ్రి ప్రజాస్వామ్యవాది.. కొడుకు అరాచకవాది: ఆనం

వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన ఆనం రామనారాయణరెడ్డి.. బహిష్కరణ తరువాత తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన జగన్‌పైన, ఆయన ప్రభుత్వంపైన, ఆయన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపైన తీవ్రమైన ఆరోపణలు చేశారు. రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిల మధ్య ఉన్న తేడాలు చెప్తూ రాజశేఖర్ రెడ్డితో జగన్‌ను పోల్చడానికే వీల్లేదని చెప్పారు. క్రాస్ ఓటింగ్ చేశానంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు.

తాను క్రాస్ ఓటింగ్ చేసినట్టు ఆధారాలుంటే చూపించాలని ఆనం రాంనారాయణరెడ్డి సవాల్ విసిరారు. తాను సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కోవడానికో.. కుటుంబ సభ్యులను హత్య చేయడానికో రాజకీయాల్లోకి రాలేదని ఆనం స్పష్టం చేశారు. ‘మిమ్మల్ని ప్రశ్నిస్తే ఆరోపణలు చేస్తారా? నేను క్రాస్ ఓటింగ్ చేసినట్టు ఎన్నికల కమిషన్‌ను చెప్పమనండి. లేదంటే ఆధారాలుంటే బయట పెట్టండి. నేను క్రాస్ ఓటింగ్ చేసినట్టు సజ్జల రామకృష్ణారెడ్డికి ఎవరు చెప్పారు’ అని ఆయన ప్రశ్నించారు.

సజ్జల రామకృష్ణారెడ్డి రాజ్యాంగేతర శక్తిగా మారారని.. రాజ్యాంగేతర శక్తితో పరిపాలన చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ఆయన ప్రశ్నించారు. సజ్జల వంద కోట్లకు ఎలా పడగలెత్తారో చెప్పాలన్నారు. “క్రాస్ ఓటింగ్ చేశానో లేదో చెప్పాల్సింది నేను. నాపై ఆరోపణలు చేసే స్థాయి సజ్జలకు లేదు. నన్ను తప్పించడానికి నాలుగు నెలల క్రితమే కుట్ర చేశారు. సలహాదారు ఉద్యోగానికి సజ్జల ఎన్ని కోట్లు ఇచ్చారు. పోస్టింగ్‌లకు సజ్జల ఎన్ని కోట్లు తీసుకున్నారు. వ్యవస్థలు దిగజారుతున్నాయని సీఎంకు ఎప్పుడో చెప్పా. ప్రభుత్వంలో దోపిడీ జరుగుతోంది. సీఎంకు చెప్పినా పట్టించుకోవడం లేదు. టీడీపీలో ఏవైనా సమస్యలొస్తే.. వినేవారు.. అర్ధం చేసుకునేవారు. కానీ వైసీపీలో అలాంటి పరిస్థితులు లేవు. ఈ ప్రభుత్వంలో కుంభకోణాలు తప్ప మరేమీ లేవు. నేనెప్పుడూ నా వ్యక్తిగత పనులు చేయాలని కోరలేదు. అధికారుల మెడపై కత్తి పెట్టి పని చేయమనడానికి.. మీరేం చక్రవర్తులు కాదు.. సామ్రాజ్యాదీశులు కాదు. విలువలు లేవు కాబట్టే సజ్జల అందరిపై ఆరోపణలు చేస్తున్నారు” అన్నారు ఆనం.

“నిజమైన ప్రజాస్వామ్యవాది రాజశేఖర్ రెడ్డి. ప్రజాస్వామ్యమంటేనే తెలియని వ్యక్తి జగన్మోహన్‌రెడ్డి. నన్ను ఓటు అడగలేదు. ఫలానా వారికి వేయమని చెప్పలేదు. అలాంటప్పుడు క్రాస్ ఓటింగ్ చేశాననడానికి ఆస్కారం లేదు” అని ఆనం అన్నారు.

వైసీపీ బహిష్కరించడంతో ఏ పార్టీలో చేరాలనేది ఆలోచిస్తున్నానని.. తన రాజకీయ భవిష్యత్ ప్రారంభమైందే టీడీపీలో అని, కార్యకర్తలు, సన్నిహితుల సలహాలతో ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

This post was last modified on March 26, 2023 12:56 pm

Share
Show comments

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

4 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

6 hours ago

సభలోకి దేవుడిని లాగడం కరెక్టేనా?

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో శాస‌న స‌భ‌ను బాయ్‌కాట్ చేసిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు శాస‌న మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…

6 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

7 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

8 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

9 hours ago