Political News

రాహుల్‌ పై వేటు: ప్ర‌శాంత్ కిషోర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కుడు రాహుల్ గాంధీ.. మోడీ ఇంటిపేరుతో చేసిన వ్యాఖ్య‌ల‌ను క్రిమినల్ నేరంగా ప‌రిగ‌ణిస్తూ.. సూర‌త్ కోర్టు ఆయ‌న‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించ‌డం, ఆవెంట‌నే ఆయ‌న‌పై పార్ల‌మెంటు అనర్హ‌త‌ వేటు వేయ‌డం.. తెలిసిందే. ఈ నేప‌థ్యంలో జాతీయ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌.. ఒక‌ప్ప‌టి మోడీ శిష్యుడు ప్ర‌శాంత్ కిషోర్ దీనిపై రియాక్ట్ అయ్యారు. పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రెండేళ్ళ జైలు శిక్ష విధించడం సరికాదని ఆయ‌న‌ అన్నారు.

అయితే.. రాహుల్‌కు జ‌రిగింది అన్యాయ‌ని, పార్ల‌మెంటు చేసింది తప్పు అని సామాన్య జనాలకు తెలియజేయడంలో కాంగ్రెస్ పార్టీ సరైన విధంగా సిద్ధం కాలేదని కిషోర్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా దివంగత అటల్ బిహారీ వాజ్‌పాయి గతంలో చెప్పిన మాటలను ప్ర‌ధాని మోడీ స‌హా.. బీజేపీ నేత‌లు గుర్తు చేసుకోవాల‌ని ఆయ‌న చుర‌క‌లు అంటించారు. ఓ పరువు నష్టం కేసులో రెండేళ్ళ జైలు శిక్ష అనేది చాలా ఎక్కువ అని తెలిపారు.

అటల్ బిహారీ వాజ్‌పాయి గతంలో చెప్పిన మాటలను కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి గుర్తు చేయాలను కుంటున్నానని చెప్పారు. ‘‘సంకుచిత హృదయంగలవారు గొప్పవారు కాలేరు’’ అని వాజ్‌పాయి అన్నారని చెప్పారు. రాహుల్ గాంధీ దోషి అని వెలువడిన తీర్పును, సాంకేతిక అంశాలను చూపించి, అధికార పార్టీ దాక్కొనవచ్చునని, ఆయనపై అనర్హత వేటు అనివార్యమైనదని చెప్పవచ్చునని, అయితే దివంగత వాజ్‌పాయి పుస్తకంలోని ఓ మాటను అధికార పార్టీ పెద్దలు గుర్తు చేసుకోవలసిందని అన్నారు. రాహుల్ గాంధీని అనర్హుడిని చేయడానికి తొందరపడకుండా ఉండవలసిందని ప్ర‌శాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు.

This post was last modified on March 25, 2023 9:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

3 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

3 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

4 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

5 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

6 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

8 hours ago