Political News

ఆ న‌లుగురు స‌స్పెండ్‌.. వేటు వేసిన వైసీపీ

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పార్టీకి వ్య‌తిరేకంగా ఓటేశార‌ని పేర్కొంటూ.. వైసీపీ న‌లుగురు ఎమ్మెల్యేల‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేసింది. పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లను సస్పెండ్ చేస్తున్నట్లు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విష‌యాన్ని ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ లో ప్ర‌భుత్వ‌ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. వీరంతా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నుంచి క్రాస్ ఓటింగ్ వేసేందుకు కోట్లాది రూపాయలు తీసుకున్నట్లు పార్టీ భావిస్తున్నట్లు చెప్పారు.

క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలపై చ‌ర్య‌లు తీసుకోక త‌ప్ప‌ద‌ని ఆయ‌న చెప్పారు. ఆ ప్ర‌కార‌మే తీసుకున్నామన్నారు. ఓటింగుకు సంబంధించి పూర్తిగా అన్ని కోణాల్లోనూ ద‌ర్యాప్తు చేసిన‌ట్టు స‌జ్జ‌ల వివ‌రించారు. వీరంతా చంద్ర‌బాబు చేతిలో కీలు బొమ్మ‌ల్లా వ్య‌వ‌హ‌రించార‌ని అన్నారు. త‌మ పార్టీ ఎమ్మెల్యేల‌ను మ‌రోసారి ప్ర‌తిప‌క్షంలో ఉన్న చంద్ర‌బాబు కొన్నార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. క్రాస్ ఓటింగ్ చేసిన వాళ్లకు టికెట్ ఇస్తామని కూడా టీడీపీ నాయ‌కుడు చంద్ర‌బాబు చెప్పి ఉంటార‌ని భావిస్తున్న‌ట్టు స‌జ్జల వ్యాఖ్యానించారు.

గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌ఫున టికెట్లు పోందిన వీరు జ‌గ‌న్ క‌ష్టంతో గెలిచార‌ని స‌జ్జ‌ల అన్నారు. పార్టీలో అసంతృప్తి ఉంటే.. దానిపై చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోవాల‌ని.. అంతేకానీ.. పార్టీనే ధిక్క‌రిస్తామ‌నే ప‌రిస్థితి ఉండ‌కూడ‌ద‌ని స‌జ్జ‌ల వ్యాఖ్యానించారు. ఇది స‌రైన చ‌ర్య‌గానే పార్టీ అధినేత జ‌గ‌న్ భావిస్తున్నార‌ని అన్నారు. పార్టీలో ఎవ‌రైనా స‌రే.. పార్టీ విధానాల‌కు.. క‌ట్టుబ‌డి ఉండాల్సిందేన‌ని అన్నారు. కాగా, గురువారం జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి పంచుమ‌ర్తి అనురాధ విజ‌యం ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. అయితే, వాస్త‌వానికి టీడీపీకి 19 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. వీరికి అనుకూలంగా వైసీపీ ఎమ్మెల్యేలు ఓటేయ‌డంతో అనురాధ గెలుపు గుర్రం ఎక్కారు.

This post was last modified on March 24, 2023 6:35 pm

Share

Recent Posts

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

23 seconds ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

11 minutes ago

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

2 hours ago

బారికేడ్లు లేని హైవేలు.. ఏంటీ కొత్త విధానం!

ఒక ఊరు నుంచి మ‌రో ఊరుకు జాతీయ ర‌హ‌దారి(హైవే)పై ప్ర‌యాణించే స‌మ‌యంలో టోల్ గేట్లు దాట‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ టోల్…

4 hours ago

నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న…

7 hours ago

డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని

నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…

9 hours ago