ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా ఓటేశారని పేర్కొంటూ.. వైసీపీ నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లను సస్పెండ్ చేస్తున్నట్లు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ లో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. వీరంతా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నుంచి క్రాస్ ఓటింగ్ వేసేందుకు కోట్లాది రూపాయలు తీసుకున్నట్లు పార్టీ భావిస్తున్నట్లు చెప్పారు.
క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోక తప్పదని ఆయన చెప్పారు. ఆ ప్రకారమే తీసుకున్నామన్నారు. ఓటింగుకు సంబంధించి పూర్తిగా అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేసినట్టు సజ్జల వివరించారు. వీరంతా చంద్రబాబు చేతిలో కీలు బొమ్మల్లా వ్యవహరించారని అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను మరోసారి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు కొన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రాస్ ఓటింగ్ చేసిన వాళ్లకు టికెట్ ఇస్తామని కూడా టీడీపీ నాయకుడు చంద్రబాబు చెప్పి ఉంటారని భావిస్తున్నట్టు సజ్జల వ్యాఖ్యానించారు.
గత ఎన్నికల్లో పార్టీ తరఫున టికెట్లు పోందిన వీరు జగన్ కష్టంతో గెలిచారని సజ్జల అన్నారు. పార్టీలో అసంతృప్తి ఉంటే.. దానిపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని.. అంతేకానీ.. పార్టీనే ధిక్కరిస్తామనే పరిస్థితి ఉండకూడదని సజ్జల వ్యాఖ్యానించారు. ఇది సరైన చర్యగానే పార్టీ అధినేత జగన్ భావిస్తున్నారని అన్నారు. పార్టీలో ఎవరైనా సరే.. పార్టీ విధానాలకు.. కట్టుబడి ఉండాల్సిందేనని అన్నారు. కాగా, గురువారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, వాస్తవానికి టీడీపీకి 19 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. వీరికి అనుకూలంగా వైసీపీ ఎమ్మెల్యేలు ఓటేయడంతో అనురాధ గెలుపు గుర్రం ఎక్కారు.
This post was last modified on March 24, 2023 6:35 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…